ఉపాధి మేళాలు.. అధునాతన కోర్సులు
కోఠి మహిళా కళాశాల.. హైదరాబాద్ చరిత్రలో అంతర్భాగం. అలాంటి ప్రత్యేకత ఉన్న కళాశాలలో సైన్స్ విద్యార్థినిగా చదివిన ప్రొ.ఎం.విజ్జులత నేడు విశ్వవిద్యాలయ స్థాయి పొందిన అదే కళాశాలకు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు.
ఇవే నా ప్రాధామ్యాలు
‘ఈనాడు’తో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీ ప్రొ.ఎం.విజ్జులత
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, సుల్తాన్బజార్: కోఠి మహిళా కళాశాల.. హైదరాబాద్ చరిత్రలో అంతర్భాగం. అలాంటి ప్రత్యేకత ఉన్న కళాశాలలో సైన్స్ విద్యార్థినిగా చదివిన ప్రొ.ఎం.విజ్జులత నేడు విశ్వవిద్యాలయ స్థాయి పొందిన అదే కళాశాలకు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రెండురోజుల ముందు ఇన్ఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు. విద్యార్థిగా కోఠి మహిళా కళాశాలలో చదువుకున్న తాను మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విధులు నిర్వహించడం చాలా సంతోషంగా అనిపిస్తే.. తొలి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. విద్యార్థి దశలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. పట్టుదల.. అంకితభావంతో చదువుకోవడం వల్లే ఈ స్థానానికి చేరుకున్నానని వివరించారు. ఈ సందర్భంగా ఆమె వీసీగా తన లక్ష్యాలను ‘ఈనాడు’ ప్రతినిధులకు వివరించారు.
ఉద్యోగిగా వెళ్లేలా..
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 5వేల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు వస్తున్న వీరికి ఉపాధి అవకాశాలను కూడా అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సంప్రదాయ కోర్సులతోపాటు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో చదువు పూర్తైన వెంటనే వారికి ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ రూపొందించాం. ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూల తరహాలో మహిళా విశ్వవిద్యాలయంలోనూ ఉపాధి మేళాలు నిర్వహించనున్నాం. డిగ్రీ, పీజీ పూర్తికాగానే వారు ఉద్యోగులుగా బయటకు వెళ్లాలి, అంకుర సంస్థలు ప్రారంభించాలి లేదా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలి.
పరిశోధనలపై దృష్టి..
విద్యారంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులే పరిశోధనల్లో అగ్రగాములన్న భావనను మార్చాలని నిర్ణయించాం. బీఎస్సీలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలతోపాటు కృత్రిమ మేధ, డేటా సైన్స్, న్యూట్రిషన్ కోర్సులపై దృష్టి కేంద్రీకరించనున్నాం. కొత్త విద్యా సంవత్సరంలో ఈ కోర్సులకు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. కృత్రిమమేధ, డేటాసైన్స్ల గురించి విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు నిపుణులతో సదస్సులు నిర్వహించనున్నాం.
మౌలిక సదుపాయాల కల్పన..
మహిళా విశ్వవిద్యాలయంలో అత్యున్నత బోధన ప్రమాణాలుండే విధంగా చర్యలు చేపట్టనున్నాం. తొలుత మౌలిక వసతుల సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాం. మహిళా విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పదిరోజుల్లో విశ్వవిద్యాలయంలో చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లు, ప్రణాళికలు తీసుకురావాలంటూ ఉన్నతాధికారులు సూచించారు. రూ.వందకోట్లతో తొమ్మిది అంతస్తుల వసతిగృహం, భౌతిక, రసాయనశాస్త్రాల బ్లాక్ల నిర్మాణం చేపట్టనున్నాం. అర్హులైన డిగ్రీ, పీజీ విద్యార్థినులందరికీ హస్టల్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
[ 03-05-2024]
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
కమల దళం.. అదినేతల కదనోత్సాహం
[ 03-05-2024]
నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. -
పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు
[ 03-05-2024]
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. -
నేటి నుంచి తపాలా ఓటింగ్
[ 03-05-2024]
ఈనెల 13న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. -
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!
[ 03-05-2024]
ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. -
యువత ఓటెత్తాలి
[ 03-05-2024]
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 03-05-2024]
ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. -
అత్యధిక ఓటింగ్ నమోదైంది అప్పుడే!
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది 1991లోనే. -
‘కాంగ్రెస్ వైపే బలహీన వర్గాలు’
[ 03-05-2024]
దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
[ 03-05-2024]
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. -
చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా
[ 03-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
[ 03-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. -
ఉత్కంఠ పోరులోఆధిక్యాలు స్వల్పమే
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్లోనే. -
పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం
[ 03-05-2024]
చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్బహదూర్ వెంకట్రామ్రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. -
అంధులు.. చదరంగంలో ఎత్తులు
[ 03-05-2024]
దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ పాఠశాలలో ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. -
‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’
[ 03-05-2024]
బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ హైదర్బాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల
[ 03-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ గురువారం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
ఎండలిలా.. ప్రచారమెలా..!
[ 03-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్