logo

Hyderabad: హైటెక్‌ సిటీలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

హైటెక్‌ సిటీలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. శిక్షణతో పాటు ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు గుంజిన సదరు సంస్థ నిర్వాహకులు చేతులెత్తేశారు.

Updated : 04 Sep 2023 08:41 IST

మాదాపూర్‌ న్యూస్‌టుడే: హైటెక్‌ సిటీలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. శిక్షణతో పాటు ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు గుంజిన సదరు సంస్థ నిర్వాహకులు చేతులెత్తేశారు.

మాదాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బిజినేపల్లి ప్రేమ్‌ప్రకాష్‌(44) నగరానికి వలస వచ్చాడు. సనత్‌నగర్‌లో నివాసం ఉంటూ స్నేహితుడు లిఖిత్‌తో కలసి ఏడాది క్రితం కొండాపూర్‌ వెస్ట్రన్‌ పెరల్‌ భవనంలో సంటూ సూ ఇన్నోవేషన్స్‌ పేరిట ఐటీ కంపెనీ ప్రారంభించాడు. తమ కంపెనీలో శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తామని ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.లక్ష నుంచి లక్షన్నర వసూలు చేశారు. అలా సొమ్ము చెల్లించి కంపెనీలో చేరిన వారికి రెండు నెలలు జీతాలు ఇచ్చారు. ఆ తర్వాత మాయమాటలు చెబుతూ కాలం గడుపుతున్నారు.

కంపెనీ నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులు ప్రేమప్రకాష్‌, లిఖిత్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిందితులు దాదాపు రూ.3కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని