e-Challan: మీకూ వచ్చిందా.. ‘ఈ-చలానా’
చలానా విధించినట్లు ఫోన్కు సందేశం వస్తుంది. రూ.వేలల్లో కట్టాలని, లేకపోతే జైలుకెళ్తారంటూ హెచ్చరికలు వస్తుంటాయి. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటారు. ఇది పోలీసు, రవాణా శాఖల సాంకేతిక తప్పిదం కాదు..
నకిలీవి గుర్తించి, జాగ్రత్త పడండి
నేరగాళ్లు పంపిన నకిలీ సందేశం
ఈనాడు, హైదరాబాద్: ఎన్నడూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకున్నా.. ఎక్కడా గీత దాటకున్నా పోలీసులు చలానా విధించినట్లు ఫోన్కు సందేశం వస్తుంది. రూ.వేలల్లో కట్టాలని, లేకపోతే జైలుకెళ్తారంటూ హెచ్చరికలు వస్తుంటాయి. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటారు. ఇది పోలీసు, రవాణా శాఖల సాంకేతిక తప్పిదం కాదు.. సైబర్ నేరగాళ్ల మాయ. ప్రజల డబ్బు కాజేసేందుకు ఎప్పటికప్పుడు మారువేషాలు వేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసుల అవతారమెత్తారు. ట్రాఫిక్ చలానాలు(e-Challan) చెల్లించాలంటూ బూటకపు సందేశాలతో మోతెక్కిస్తున్నారు. ఇవి నిజమేనని కొందరు తమకు వచ్చిన సందేశాల్లోని లింకులు క్లిక్ చేసి రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆ లింకులపై క్లిక్ చేస్తే అంతే.. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాహన యజమాని నంబర్లకు చలానా వివరాలు సందేశాలుగా వస్తాయి. సైబర్ నేరగాళ్లు దీన్నే సొమ్ము చేసుకుంటున్నారు. ఈ-చలానా పేరుతో నకిలీ సందేశాలు పంపిస్తున్నారు. సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని, డబ్బు కట్టేందుకు లింకు క్లిక్ చేయాలని సూచిస్తారు. వీటిపై క్లిక్ చేస్తే ఫోన్లలోని డేటా అంతా నేరస్థుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు ఫోన్ హ్యాక్ అవ్వడం లేదా ఎనీ డెస్క్ తదితర యాప్లు డౌన్లోడ్ అవుతాయి. తర్వాత నేరగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని డబ్బంతా కొట్టేస్తారు. ఇంకొన్ని సార్లు ఫోన్లలోని ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించి బెదిరించి డబ్బు కొట్టేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వాహనదారుల డేటా ఎలా..? సైబర్ నేరగాళ్లకు వాహనాల డేటా.. యజమానుల ఫోన్ నంబర్లతో సహా ఎలా వెళ్తున్నాయన్నది పెద్ద ప్రశ్న. కొన్ని ప్రైవేటు సంస్థల్లో భద్రతా వ్యవస్థలు సక్రమంగా లేకపోవడం, ఉద్యోగుల తప్పిదాలతో డేటా బయటకు పొక్కుతోంది. ట్రాఫిక్, రవాణా శాఖలకిచ్చిన వాహనదారుల డేటా ఎలా వెళ్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఎక్కువ మందికి సొంత వాహనాలు ఉన్నందున.. గంపగుత్త సందేశాలు పంపిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని సైబర్క్రైమ్ అధికారులు తెలిపారు
ఫిర్యాదు చేయొచ్చిలా..
నకిలీ ఈ-చలానాల పేరుతో సందేశాలను నమ్మి డబ్బు పోగొట్టుకుంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ః ఒకవేళ చలానా ఉన్నట్లు సందేశం వస్తే.. పోలీసు శాఖ ఆధ్వర్యంలోని ‘ఈ-చలానా’ వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలి. అక్కడ ఉంటే అందులోనే రుసుము కట్టొచ్చు. ః ఈ తరహా అనుమానాస్పద నకిలీ సందేశాలు వస్తే.. వాటిని ప్రత్యేక వాట్సాప్ నంబరు 87126 72222 పంపి ఫిర్యాదు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
[ 28-04-2024]
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. -
భువనేశ్వర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
[ 28-04-2024]
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
[ 28-04-2024]
రిజర్వేషన్ల అంశంపై ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. -
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
[ 28-04-2024]
నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
[ 28-04-2024]
ఈ చిత్రం చూశారా.. ఓయూ ఆర్ట్స్ కళాశాల అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. ఇది కైరోలోని ఈజిప్ట్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. దీని ఆర్కిటెక్ట్ మొనేసర్ ఎర్నెస్ట్ జాస్పర్. -
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
[ 28-04-2024]
తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్లు నామినేషన్లు దాఖలు చేశారు. -
ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం
[ 28-04-2024]
ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. -
సాధించేందుకు పట్టు.. తెలిసిందే లోగుట్టు
[ 28-04-2024]
మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు. -
నాలుగు స్థానాలు.. బరిలో 168 మంది
[ 28-04-2024]
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114మంది నామపత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకూ పరిశీలన కొనసాగింది. -
బెట్టింగ్ కోసం వృద్ధురాలిని హతమార్చిన యువకుడు
[ 28-04-2024]
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడిన యువకుడు.. వృద్ధురాలిని హతమార్చి పరారయ్యాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
గంజాయి తాగొచ్చి వేధిస్తున్నాడని తమ్ముడి హత్య
[ 28-04-2024]
మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు. -
నాలా.. సాఫీగా సాగేలా
[ 28-04-2024]
నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేయగా.. కమిషనర్ రోనాల్డ్రాస్ భరోసా ఇవ్వడంతో నెలరోజులుగా పనులు ఊపందుకున్నాయి. -
ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
[ 28-04-2024]
నగరంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. -
యువ వాటరూ.. నీదే జోరు
[ 28-04-2024]
యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు. -
అసత్య ప్రచారాలకు ‘మిత్ వర్సెస్ రియాలిటీ’తో చెక్
[ 28-04-2024]
అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి. -
ఆలిన్లో అదుపులోకి అగ్నికీలలు
[ 28-04-2024]
ఆలిన్ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
డార్మెటరీలో దోస్తీ.. చోరీలతో మస్తీ
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
నగరవాసి.. నీటికి అల్లాడి
[ 28-04-2024]
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. -
బామ్మర్దికి వీడియోకాల్.. ఆపై బలవన్మరణం
[ 28-04-2024]
బామ్మర్దికి వీడియోకాల్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్యాదవ్(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 28-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గెలుపు బాధ్యత మీదే!
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!