ముఖ్యమంత్రిని అందించిన మేడ్చల్
రాష్ట్ర రాజకీయాల్లోకి అగ్రనేతలను అందించిన పురిటిగడ్డ మేడ్చల్.. 1952లో నియోజకవర్గం ఏర్పాటైంది. 1957లో ఇతర నియోజకవర్గంలో కలిపినా 1962లో మళ్లీ నియోజక వర్గంగా మారింది.
న్యూస్టుడే, ఘట్కేసర్: రాష్ట్ర రాజకీయాల్లోకి అగ్రనేతలను అందించిన పురిటిగడ్డ మేడ్చల్.. 1952లో నియోజకవర్గం ఏర్పాటైంది. 1957లో ఇతర నియోజకవర్గంలో కలిపినా 1962లో మళ్లీ నియోజక వర్గంగా మారింది. ఇక్కడి నేతలు కేంద్ర, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. 1978లో కాంగ్రెస్ నుంచి మర్రిచెన్నారెడ్డి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు.
5 సార్లు గెలుపు.. 4 సార్లు పూర్తికాలం
న్యూస్టుడే, ఖైరతాబాద్: దానం నాగేందర్ మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా 4 సార్లే పూర్తికాలం కొనసాగారు. ఆసిఫ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో తెదేపా నుంచి గెలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెదేపాకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2018లో తెరాసలో చేరి విజయ ఢంకా మోగించారు.
హైటెక్సిటీ.. అప్పటి మూసాపేట పంచాయతీ
న్యూస్టుడే, మూసాపేట: హైదరాబాద్ మహా నగరానికి హైటెక్సిటీ తలమానికం. ఈ ప్రాంతం ఒకప్పుడు మూసాపేట పంచాయతీ పరిధిలో ఉండేది. మూసాపేట, జింకలవాడ, అల్లాపూర్, బబ్బుగూడ, రామారావునగర్, కబీర్నగర్, మాదాపూర్, గుట్టల బేగంపేట, దయార్గూడ, సంగీత్నగర్ రెవెన్యూ గ్రామాల సమాహారంగా 1956లో మూసాపేట పంచాయతీ ఏర్పడింది. 1981లో మాదాపూర్ పేరుతో ప్రత్యేక పంచాయతీ ఏర్పాటైంది.
అమ్మ ఆశీర్వాదంతోనే ప్రచారానికి
న్యూస్టుడే, గౌతంనగర్: తల్లిని మించిన దైవం లేదు. మల్కాజిగిరి నుంచి భారాస అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మర్రి రాజశేఖర్రెడ్డి నిత్యం తల్లి అరుంధతీ ఆశీర్వాదô తీసుకున్నాకే అడుగు బయటపెడతారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికీ అలాగే వెళ్తున్నారు. తల్లి పేరున అరుంధతి ఆసుపత్రి నెలకొల్పి అనేక మందికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. తల్లి ఆశీర్వాదం, ప్రజల మద్దతుతో తప్పక గెలుస్తానంటున్నారు.
ఓటింగ్ యంత్రాలు... గంటల్లో ఫలితాలు
న్యూస్టుడే, కాచిగూడ: మనదేశంలో ఎన్నికల క్రతువును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) సులభతరం చేశాయి. దీంతో ఫలితాలు గంటల వ్యవధిలో వెలువడుతున్నాయి. 1989లో బీఈఎల్, ఈసీఐఎల్ వీటిని అభివృద్ధి చేశాయి. తొలిసారిగా కేరళలోని పరవూరు నియోజకవర్గ ఉపఎన్నికలో, 1998లో దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పరిమితంగా వినియోగించారు. 1999 నుంచి పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్నటి వరకు సీబీఐ, ఈడీ.. ఇప్పుడు దిల్లీ పోలీసులు: రేవంత్రెడ్డి
[ 29-04-2024]
అమిత్షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
[ 29-04-2024]
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
[ 29-04-2024]
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్