Hyderabad: ప్రజాపాలన దరఖాస్తులతో దోపిడీ
దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు
కంప్యూటరీకరణ చేయకుండా రూ.కోట్లు స్వాహా
ఏజెన్సీలకు రూ.లక్షలు దోచిపెట్టిన అధికారులు
పథకాలు వర్తించక అర్హుల అవస్థలు
చార్మినార్ జోన్లో కంప్యూటరీకరణ జరగని దరఖాస్తు
ఈనాడు, హైదరాబాద్: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం. ఏజెన్సీలతో చేతులు కలిపి ఈ ప్రక్రియను నిధుల దోపిడీ తంతుగా మార్చారు. ఉదాహరణకు.. లక్షలో దాదాపు 40వేల దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లలో నమోదుచేయలేదు. ఆయా ఏజెన్సీలవారికి బిల్లులను మాత్రం లక్ష దరఖాస్తులకు చెల్లించారు. ఇలా నగరం మొత్తంగా రూ.12 కోట్ల ప్రజాధనం వెచ్చించడం గమనార్హం. దరఖాస్తుల దశలోనే అవకతవకలతో.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను నగరంలో అర్హులైన ప్రజలు పూర్తిస్థాయిలో అందుకోలేకపోయారు.
నమోదైంది 11లక్షలే.. నగరవ్యాప్తంగా 600 కేంద్రాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల కోసం 19 లక్షలకుపైగా దరఖాస్తులందాయి. రేషన్కార్డు, ఇళ్లు, ఇతర పథకాలకు మరో 5.7లక్షలు కలిపి మొత్తం 24.7లక్షల అర్జీలందాయి. ఆ వివరాలను కంప్యూటర్లలో నమోదుచేసే ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది. కమిషనర్ ఉప కమిషనర్లు(డీసీ)కు బాధ్యత ఇచ్చారు. ఒక్కో దరఖాస్తుకు రూ.12 ఇవ్వాలని ఆదేశించారు. కొందరు డీసీలు ప్రకియను పారదర్శకంగా పూర్తిచేయగా.. మరికొందరు చేతివాటం ప్రదర్శించారు. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్లలోని సర్కిళ్లలో అవకతవకలు ఎక్కువగా జరిగాయి. దరఖాస్తుల్లో సమాచారాన్ని కంప్యూటర్లలోకి ఎక్కించకుండానే.. పని పూర్తయినట్లు ఏజెన్సీలతో బిల్లులు పెట్టించి, నిధులు చెల్లించారు. ః వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటరీకరణ జరిగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 14లక్షల మంది దీనికి అర్జీ పెట్టుకున్నారు. విద్యుత్తు శాఖకు మాత్రం 11లక్షల దరఖాస్తుల వివరాలే చేరాయి. అంటే.. ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులకు, ప్రభుత్వం, విద్యుత్తు శాఖలు తెలిపిన వివరాలకు పొంతన లేదని తెలుస్తోంది.
నకిలీ బిల్లులతో.. చార్మినార్ జోన్లోని ఆరు సర్కిళ్లలో 5,08,772 దరఖాస్తులందగా, ఎస్వీ ప్రాజెక్ట్స్, జోయ్-ఈ, వీజేఎస్, హోమిత్, తదితర సంస్థలు కంప్యూటరీకరించారని బల్దియా బిల్లులు చెల్లించింది. ప్రజాపాలన సభలకు భోజనాలు, టీలు, బిస్కట్లు, దరఖాస్తుల సరఫరా.. ఇలా ఒక్కో సర్కిల్కు రూ.40లక్షల మేర చెల్లించారు. సదరు జోన్లో సగం దరఖాస్తుల కంప్యూటరీకరణ కూడా జరగలేదని అంతర్గత విచారణలో తేలింది. దరఖాస్తులపై ఏజెన్సీ నిర్వాహకులు 251664-3636928, 251664-4563631 వంటి సంఖ్యలు రాసి, కంప్యూటర్లలో సమాచారం చేర్చినట్లు నకిలీ బిల్లులు సృష్టించారని వెల్లడైంది. ఈతతంగం వెనుక ఉప కమిషనర్ల హస్తముందనే విమర్శలున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఇలా అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.