ప్రయాణికులకు పరీక్ష
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు
జగన్ సభకు వందల బస్సులు తరలింపు
గంటల తరబడి తప్పని పడిగాపులు
సీట్ల కోసం పాట్లు
కర్నూలు బి.క్యాంపు, న్యూస్టుడే : బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు. ప్రయాణికుల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు జనం నరకయాతన పడ్డారు. బస్టాండ్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అధికారులను ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేవారే కరవయ్యారు. మరోవైపు జగన్ సభకు బస్సులను మళ్లించడంతో ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని కోల్పోయింది.
ఏడు వందలు మళ్లించారు
నంద్యాల పట్టణం, ఎమ్మిగనూరు పట్టణాల్లో వైకాపా మేమంతా సిద్ధం సభలు నిర్వహిస్తోంది. జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు బస్సులన్నింటినీ తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 960 బస్సులు ఉండగా అందులో 700కుపైగా బస్సులను మళ్లించడం గమనార్హం. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే మగ్గిపోయారు. కర్నూలు నుంచి నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆత్మకూరు, నందికొట్కూరు మార్గాల్లో నడవాల్సిన బస్సులు ఉదయం నుంచి రాత్రి 8 గంటలలోపు 5, 6 ట్రిప్పులు తిరగాల్సి ఉంది. గురువారం చాలా సర్వీసులు రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు ఎంతసేపటికీ రాకపోవడంతో చివరికి ప్రైవేటు వాహనాల్లో వెళ్లారు.
ఆర్టీసీ ఆదాయానికి గండి
ఒక్కో ఆర్టీసీ బస్సు సరాసరిన దూరాన్ని బట్టి 8 ట్రిప్పులు తిరగాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలకు ఒక్క ట్రిప్పు తిరిగితే ఖర్చులన్నీపోనూ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఆదాయం వస్తుంది. అదే కర్నూలు నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు వెళితే ఒక్క ట్రిప్పు ద్వారా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు లభిస్తుంది. పల్లె ప్రాంతాలకు జనాభాకు అనుగుణంగా దూరాన్ని బట్టి ప్రతిరోజు నాలుగైదు ట్రిప్పులు తిరగాల్సి ఉంది. నంద్యాల, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, మంత్రాలయం, శ్రీశైలం వంటి ప్రాంతాలకు మూడు నుంచి నాలుగు ట్రిప్పులు నడుస్తాయి. కానీ సిద్ధం సభకు బస్సులు మళ్లించగా ఒక్కో బస్సుకు డీజిల్ ఇచ్చి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆర్టీసీ భారీగా నష్టపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా విజయం తథ్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో తెదేపా విజయం తద్యమని కర్నూల్ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
తెదేపా అభ్యర్థులను గెలిపించాలి
[ 27-04-2024]
మండలంలోని కైరుప్పల పుప్పాల దొడ్డి అట్టేకల్ గ్రామాల్లో తెదేపా ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు పర్యటించారు. -
ఈ నెల 28న ఏపీ సెట్ పరీక్ష
[ 27-04-2024]
ఏపీ సెట్-2024 పరీక్ష ఈ నెల 28న జరుగనుందని రీజినల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ పేర్కొన్నారు. -
ప్రజాగళం సభ ఏర్పాట్ల పరిశీలన
[ 27-04-2024]
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో ఆదివారం చంద్రబాబు ప్రజాగళం సభ జరగనుంది. -
తెదేపాతో ముస్లింల సంక్షేమం
[ 27-04-2024]
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ముస్లింలకు రక్షణ, సంక్షేమం సాధ్యమని తెదేపా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ అన్నారు. -
వైకాపా పోవాలి.. చంద్రబాబు రావాలి
[ 27-04-2024]
వైకాపా పాలన నుంచి విముక్తి పొందాలంటే చంద్రబాబు సీఎం కావాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
[ 27-04-2024]
డోన్ మండలం వెంకటాపురం చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
ఓటు విలువ తెలియజెప్పండి.. బహుమతి గెలుచుకోండి
[ 27-04-2024]
ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మీరు మొదటిసారి ఓటు హక్కును వినియోగిస్తున్నారా.. అయితే, ఈ అవకాశం మీకోసమే. -
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్