జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి..
కౌతాళం: వర్షాలు లేక, ఎల్లెల్సీ సాగునీరు అందక ఎండిపోయిన మిరప పంట
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. మూటాముల్లె సర్దుకొని పల్లెలు పట్నాలకు పయమయ్యాయి. ముసలీముతక, చిన్న పిల్లలు ఇంటి వాకిట కవాలయ్యారు. పండగకో పబ్బానికి వచ్చిపోతూ సొంతూరికి చుట్టపుచూపయ్యారు. ‘మీ బిడ్డను ఒక్కసారి దీవించండి, కష్టం మీ దరిచేరనీయను’ అని అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి గ్రామాల సమస్యలు, జనం కష్టాలు కనిపించడం లేదా? అని పశ్చిమ పల్లెలు ప్రశ్నిస్తున్నాయి.
కౌతాళం: గోతులదొడ్డి గ్రామంలో వలస వెళ్లేందుకు బారులు తీరిన వాహనాలు
పరిహారం జాడ లేదు
పత్తికొండ గ్రామీణం పెద్దహుల్తి గ్రామానికి చెందిన రైతు బసవరాజు ఈ ఏడాది ఖరీఫ్లో తొమ్మిది ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. పెట్టుబడి కింద రూ.లక్షకు పైగానే ఖర్చుపెట్టారు. పైరు వేసినప్పటి నుంచీ వానజాడ లేకపోవటంతో పంట మొత్తం ఎండిపోయింది. ఉన్నా లాభం లేదనుకుని పంట మొత్తం దున్నేశారు. రబీలో శనగ సాగు చేపట్టినా పరిస్థితిలో మార్పులేదు. అటు ఖరీఫ్, ఇటు రబీ మొత్తం నష్టాలపాలే. ప్రభుత్వం ఆదుకుంటుందని భావించినా.. ఇటీవల కరవు సహాయక చర్యల్లో భాగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి బటన్ నొక్కినా.. ఒక్క పైసా ఇంత వరకు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్కు పంటల సాగు ఎలా చేపట్టాలో దిక్కు తోచటంలేదంటున్నారు రైతు బసవరాఉజు.
- న్యూస్టుడే, పత్తికొండ గ్రామీణం
తీరని దాహం
ఆస్పరి మండలంలో మొత్తం 33 గ్రామాలు ఉన్నాయి. 21 గ్రామ పంచాయతీలు, 12 మజార గ్రామాలు ఉన్నాయి. మండల జనాభా 65,082. మండలంలోని 53 ప్రభుత్వ నీటి పథకాలు ఉన్నాయి. భూగర్భజాలాలు అడుగంటిపోవడంతో కొన్ని బోర్లులో నీరు అరకొరగా వస్తున్నాయి. మరికొన్ని బోర్లు పూర్తిస్థాయిలో ఎండి పోయాయి. ఆస్పరి మండలానికి తంగరడోణ, తుర్వగల్లు, నగరూరు, చిగళి, బిణిగేర, హలిగేర, చిరుమాన్దొడ్డి, శంకరబండ, ఆస్పరి గ్రామానికి నాగనాతనహళ్లీ జలశయం నుంచి నీరు సరఫరా కావాల్సి ఉండగా వారం పదిరోజులకోకసారి వస్తున్నాయి. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, రెండు చక్రాల బండ్లపై నీరు తెచ్చుకుంటున్నారు.
- న్యూస్టుడే, ఆస్పరి
దారి తప్పారు
పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం మారెళ్ల- బొందిమడుగుల గ్రామాల మధ్య వాగుపై రాకపోకల కోసం గతంలో నిర్మించిన వంతెన కూలిపోయి ఏళ్లు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి వెంటనే వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గత ఏడాది జూన్ 1న పత్తికొండలో నిర్వహించిన రైతు భరోసా బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారు. నేటికీ నెరవేర్చకపోతే ఎలా అని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
- న్యూస్టుడే, పత్తికొండ, తుగ్గలి
వ్రలస బాటలో బతుకు పోరు
మంత్రాలయం గ్రామీణం, న్యూస్టుడే: కొడుకులు, కోడళ్లు వలస వెళ్తే వృద్ధులకు ఒంటరి జీవనం తప్పడంలేదు. పశ్చిమ పల్లెల్లో పనులు లేక మూటాముల్లె సర్దుకుని వలసబాట పట్టారు. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇళ్లకు వేసిన తాళాలే ఇందుకు నిదర్శనం. మంత్రాలయానికి నాలుగు కి.మీ. దూరంలో ఉన్న కల్లుదేవకుంట గ్రామంలో 300 ఇళ్లు, 1,800 జనాభా, 1,349 మంది ఓటర్లు ఉన్నారు. పొలాల్లో బోర్లు పడకపోవడంతో వలసలు తప్పడం లేదు. నేటికీ తాగునీటికి కూడా నాలుగు కి.మీ. దూరంలోని చిలకలడోణ, ఇబ్రహీంపురం గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవలసిన పరిస్థితి. గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు భార్యా పిల్లలతో కలిసి వలస వెళ్లారు.
రెండెకరాల పొలం ఉన్నా..
ఇంట్లో అందరూ వలస వెళ్లడంతో కల్లుదేవకుంట గ్రామంలో ఇంటి వద్ద ఇలా ఒంటరిగా కూర్చున్న వృద్ధురాలి పేరు గువ్వల నరసమ్మ. ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు గువ్వల శివరాముడును డిగ్రీ వరకు చదివించారు. కోడలు గువ్వల రంగమ్మ ఇద్దరూ గత ఐదు సంవత్సరాలుగా బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే సిమెంట్ పనులు చేస్తున్నారు. ఏదో పండగలకు, శుభకార్యాలకు మాత్రం గ్రామనికి వచ్చి వారం పది రోజులు ఉండి, తిరిగి సుగ్గి బాట పడుతున్నారు. రెండెకరాల పొలం ఉన్నా.. పంటలు పండక ఊరొదిలి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నరసమ్మ.
ఊళ్లో పనులు లేకనే..
మంచంపై కూర్చున్న ఈ వృద్ధురాలు జక్కల రాములమ్మకు కల్లుదేవకుంట గ్రామంలో ఎలాంటి పనులు లేక కుటుంబమంతా వలస వెళ్లారని చెబుతున్నారు. పెద్ద హనుమంతు, చిన్న హనుమంతు ఇద్దరు కుమారులు, దస్తగిరమ్మ, లక్ష్మి ఇద్దరు కోడళ్లు మనవళ్లు, మరవరాళ్లు అందరూ ఊళ్లో పనులు వలసబాట పట్టారు. గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆమె ఒక్కరే ఇంటి వద్ద ఉంటున్నారని, పండగలకు కుమారులు, కోడళ్లు వచ్చివెళ్తారని వృద్ధురాలు రాములమ్మ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా విజయం తథ్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో తెదేపా విజయం తద్యమని కర్నూల్ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
తెదేపా అభ్యర్థులను గెలిపించాలి
[ 27-04-2024]
మండలంలోని కైరుప్పల పుప్పాల దొడ్డి అట్టేకల్ గ్రామాల్లో తెదేపా ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు పర్యటించారు. -
ఈ నెల 28న ఏపీ సెట్ పరీక్ష
[ 27-04-2024]
ఏపీ సెట్-2024 పరీక్ష ఈ నెల 28న జరుగనుందని రీజినల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ పేర్కొన్నారు. -
ప్రజాగళం సభ ఏర్పాట్ల పరిశీలన
[ 27-04-2024]
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో ఆదివారం చంద్రబాబు ప్రజాగళం సభ జరగనుంది. -
తెదేపాతో ముస్లింల సంక్షేమం
[ 27-04-2024]
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ముస్లింలకు రక్షణ, సంక్షేమం సాధ్యమని తెదేపా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ అన్నారు. -
వైకాపా పోవాలి.. చంద్రబాబు రావాలి
[ 27-04-2024]
వైకాపా పాలన నుంచి విముక్తి పొందాలంటే చంద్రబాబు సీఎం కావాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
[ 27-04-2024]
డోన్ మండలం వెంకటాపురం చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
ఓటు విలువ తెలియజెప్పండి.. బహుమతి గెలుచుకోండి
[ 27-04-2024]
ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మీరు మొదటిసారి ఓటు హక్కును వినియోగిస్తున్నారా.. అయితే, ఈ అవకాశం మీకోసమే. -
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్