పట్టణ వాసులపై.. జగన్ ‘పైసా’చికత్వం
నంద్యాల పురపాలిక: బైర్మల్ వీధిలో నివాసం ఉంటున్న శంకరయ్య ఇంటి విస్తీర్ణం సెంటున్నర లోపల ఉంది. ఆయనకు 2018లో రూ1018 బిల్లు రాగా 2022లో రూ1496 వచ్చింది. దాదాపు రూ.500 పన్ను పెరిగింది.
ఏటా 15 శాతం ఇంటి పన్ను పెంపు
నాలుగేళ్లలో రూ.41.2 కోట్లు బాదేశారు
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : నంద్యాల పురపాలిక: బైర్మల్ వీధిలో నివాసం ఉంటున్న శంకరయ్య ఇంటి విస్తీర్ణం సెంటున్నర లోపల ఉంది. ఆయనకు 2018లో రూ1018 బిల్లు రాగా 2022లో రూ1496 వచ్చింది. దాదాపు రూ.500 పన్ను పెరిగింది.
వార్షిక అద్దె విలువ (ఏఆర్వీ) ఆధారంగా అయిదేళ్లకోసారి ఆస్తి పన్ను పెంచే విధానం నగరాలు, పట్టణాలలో ఉండేది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఏఆర్వీకి బదులుగా ఆస్తి మూలధన విలువ (సీవీ) ఆధారంగా పన్ను పెంచే కొత్త విధానం తీసుకొచ్చింది. దీనికి మళ్లీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో లింకు పెట్టింది. ఆస్తుల విలువలను ఆ శాఖ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా పెంచాలని నిర్ణయించింది. ఇలా 2021- 22, 2022- 23, 2023- 24, 2024- 25 ఆర్థిక సంవత్సరాల్లో కర్నూలు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆస్తి పన్ను 15 శాతం పెరుగుతూ వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది మున్సిపాల్టీల పరిధిలో 2020 ఆర్థిక సంవత్సరంలో పన్ను లక్ష్యం రూ.140.23 కోట్లు ఉండగా... 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.181.23 కోట్లకు చేరింది.
ఎక్కడ ఎంత భారం
కర్నూలు నగరం: నగర పాలక సంస్థలో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి ప్రస్తుతం రూ.6 వేల వరకు పన్ను వసూలు చేస్తున్నారు. అదే ఇంటికి నాలుగేళ్ల కిందట రూ.4,400 మాత్రమే తీసుకొనేవారు. ఏటా రూ.400 పెరుగుతూ ప్రస్తుతం రూ.6 వేలకు చేరుకుంది. సి.క్యాంప్, నరసింగరావుపేట, బి.క్యాంప్, డాక్టర్స్కాలనీ తదితర ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల ఇంటికి ప్రస్తుతం రూ.5,500 వరకు పన్ను ఉంది. నాలుగేళ్ల కిందట రూ.4 వేల లోపు ఉండేది.
నంద్యాల: జిల్లా కేంద్రం నంద్యాలలోని పద్మావతినగర్, శ్రీనివాసనగర్, ఎన్జీవో కాలనీ, బైపాస్ రహదారి, బైర్మల్వీధి తదితర ప్రాంతాల్లోని వాణిజ్య దుకాణాలకు యజమానులు ప్రస్తుతం రూ.10 వేల ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. 2021లో ఆయా దుకాణాలకు ఆస్తి పన్ను రూ.8 వేలలోపు ఉండేది. 15 శాతం పెంపుతో రూ.2 వేలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.\
ఆదోని: తానాజీ రోడ్డు, హావన్నపేట, లంగరు పేట ప్రాంతాల్లో 800 చదరపు అడుగులున్న ఇంటికి ప్రస్తుతం పన్ను కింద రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఇళ్లపై తక్కువ పన్నులు వేశామని చెబుతూ నాలుగేళ్లుగా ఏటా రూ.350 పెంచుకుంటూ వస్తున్నారు. వెంకన్నబావి ప్రాంతంలో కూడా సుమారు 400 ఇళ్లపై ఇదే విధంగా పన్నును పెంచుతున్నారు. ఈ మున్సిపాల్టీలో 20 వేలకు పైగా ఇళ్లను కొత్త పన్ను విధానంలోకి తీసుకొచ్చారు.
నాడు
నగరాలు, పట్టణాల్లో గత ప్రభుత్వాలు ఆస్తి పన్నును అయిదేళ్లకోసారి పెంచేవి. పేద, మధ్య తరగతి వర్గాలపై పెద్దగా భారం పడకుండా జాగ్రత్తలు తీసుకునేవి. ఒకవేళ భారం మరీ ఎక్కువగా ఉందని భావిస్తే... అయిదేళ్లకు బదులుగా 10-15 ఏళ్లకోసారి ఆస్తి పన్నులు సవరించేవి.
నేడు
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లింది.. పట్టణాల్లో ఐదేళ్లకోసారి ఆస్తిపన్ను పెంచే విధానాన్ని పక్కనపెట్టింది. గత మూడేళ్లుగా ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను పెంచుతోంది. ఇది చాలదన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆస్తుల విలువలను పెంచినప్పుడల్లా పన్ను మొత్తం మళ్లీ పెరుగుతోంది. దీన్ని ఒకేసారి వర్తింపజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని... పెరిగిన దానికి సమానమయ్యే వరకు ఏటా 15 శాతం చొప్పున విధిస్తోంది. అంటే పన్ను పోటును నిరంతర ప్రక్రియగా మార్చేసింది.
ఆదాయం ఏమి చేస్తున్నారో
గత నాలుగేళ్లుగా ప్రతి ఆస్తిపైన రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం పెంచుకుంటూపోవడంతో రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. కర్నూలు నగరంలో ప్రస్తుతం రాబడి రూ.90 కోట్లు ఉంది. నాలుగేళ్ల నుంచి ఈ కార్పొరేషన్ ఏటా రూ.12 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకుంటోంది. నంద్యాల మున్సిపాల్టీ ఏటా రూ.2 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.8 కోట్లు ఆదాయం ఆర్జించింది. ఆదోని రూ.5 కోట్లు, ఎమ్మిగనూరు రూ.3.50 కోట్లు, డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు మున్సిపాల్టీలు రూ.50 లక్షల చొప్పున ఆదాయం సమకూర్చుకున్నాయి.
కొత్త ఇంటికి మరింత
- ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే కొత్త విధానంతో కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటున్న వారంతా బెంబేలెత్తుతున్నారు. వారికి పాత పన్ను విధానం లేదు కాబట్టి... ఏటా 15 శాతం పెంపుదల వర్తించదు. రిజిస్ట్రేషన్ల శాఖ విలువ ప్రకారం నిర్ణయించిన పూర్తి పన్నును ప్రతి సంవత్సరం చెల్లించాల్సిందే. ఇళ్లు, భవనాల నిర్మాణ ప్రాంతం ఆధారంగా విధిస్తున్న ఆస్తి పన్ను రూ.వేలు, లక్షల్లో ఉండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.
- అదేవిధంగా పాత ఇళ్లపై అదనపు అంతస్తు వేసుకున్నా, ఒక గది నిర్మించుకున్నా కొత్త విధానం ప్రకారమే ఆస్తిపన్నును మదింపు చేస్తున్నారు. అప్పటి నుంచి ఆ మొత్తం భవనానికి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ణయించిన పూర్తి పన్నునే వసూలు చేస్తున్నారు.
అద్దెల మోత
ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడంతో ఇళ్ల యజమానులు అద్దెలను 10 నుంచి 20 శాతం వరకు పెంచేశారు. కర్నూలు నగరంలో రెండు పడక గదుల ఇంటి బాడుగ నాలుగేళ్ల కిందట రూ.4- 5 వేల మధ్య ఉంటే ప్రస్తుతం రూ.6-7 వేల వరకు ఉంది. నంద్యాలలో రెండు పడక గదుల ఇంటి అద్దెను రూ.6 వేలకు పెంచారు. ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు వంటి చిన్న పట్టణాల్లో కూడా డబుల్ బెడ్రూం ఇంటి అద్దె రూ.4 వేలకుపైగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సంస్థల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశ్రమలు తదితర అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఈ వర్గానికి ఏటా పెరుగుతున్న ఆస్తి పన్ను భారంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంతకుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు
[ 29-04-2024]
వైకాపా హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. -
సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు
[ 29-04-2024]
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
కూటమితోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
[ 29-04-2024]
ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాలులోఉమ్మడి జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాల్లోని యువతతో కలిసి భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు. -
తెదేపాలోకి 80 కుటుంబాలు చేరిక
[ 29-04-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని హాలహర్వికి గ్రామానికి చెందిన ఎనభై కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. -
వర్షాలు సమృద్ధిగా కురవాలని సప్తభజనలు
[ 29-04-2024]
మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఖరీఫ్, రబీ సీజన్లలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని సప్త భజనలు నిర్వహిస్తున్నారు. -
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా
[ 29-04-2024]
పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెదేపా అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్రెడ్డి అన్నారు. -
గూడ్స్ బోగిలో మంటలు
[ 29-04-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు రైల్వే స్టేషన్లో ఆదివారం గూడ్స్ బోగిలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖ వారికి సమాచారం అందించారు. -
జలం తీసుకొస్తాం.. జనాలను బాగు చేస్తాం
[ 29-04-2024]
పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది.. మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఎక్కువ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వలసలకు అడ్డుకట్ట వేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. -
వైకాపాలో రగడ
[ 29-04-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక సగర (ఉప్పర) సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సంఘం ఛైర్మన్ రుద్రగౌడ్, పట్టణ బ్యాంకు ఛైర్మన్ యు.కె.రాజు తదితరులు హాజరయ్యారు. -
జగన్ పాలన.. కష్టాల‘పాలు’
[ 29-04-2024]
చంద్రబాబు ఆలోచన: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. ‘పాడి’ రంగాన్ని ప్రోత్సాహం ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా కల్లూరు మండలం తడకనపల్లెలో పశు వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. -
పశ్చిమాన వలస విలాపం
[ 29-04-2024]
పశ్చిమాన పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. వలస వెళ్తున్న ప్రజలను చూసి. ఇళ్లకేసిన తలుపులు, తాళాలు ప్రశ్నిస్తున్నాయి.. మళ్లీ ఎప్పుడు తీస్తారని. ఇంటికి కాపలా ఉన్న పెద్దలు ఎదురు చూస్తున్నారు.. అయినవాళ్లు ఎప్పుడు తిరిగొస్తారని. -
విలీనం చేసి.. జగన్ నిలువునా ముంచి
[ 29-04-2024]
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి. -
జగన్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
[ 29-04-2024]
ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం కట్టలేదని, రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా మాట తప్పారని, మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. -
అరాచక పాలనకు అంతం తప్పదు
[ 29-04-2024]
రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
నెరవేరని మాటలు.. అవస్థల పాఠాలు
[ 29-04-2024]
విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పొంతన ఉండటం లేదు. -
వైకాపాను నమ్మి మళ్లీ మోసపోవద్దు
[ 29-04-2024]
ఆదోని పట్టణంలోని శివశంకర్నగర్లో భాజపా అభ్యర్థి డా.పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెదేపా సీనియర్ నాయకులు భూపాల్చౌదరి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశం
[ 29-04-2024]
ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్ బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 22న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్కు ఆవుకు పోలీస్స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు నిమిత్తం డోన్కు వచ్చారు. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెబుదాం: బీసీ
[ 29-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పి ఇంటికి పంపిద్దామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పెండేకంటి నగర్, శివనందినగర్లో ‘ప్రజాగళం’లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. -
కల్తీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారులను ఓడించాలి
[ 29-04-2024]
నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’