పట్టు దొరక్క.. గిట్టుబాటు కాక..
తళతళలాడే పట్టు చీరలు నేసే మగ్గాలపై నేత పని నిలిచిపోతోంది. నేతన్నలు ఉపాధి కోల్పోతున్నారు. చీరల తయారీకి ఉపయోగించే మల్బరీ పట్టు గూళ్ల ధర రెట్టింపైంది.
ఉపాధి కోల్పోతున్న నేతన్నలు
పట్టుగూళ్ల నుంచి పట్టుదారం ఉత్పత్తి
చౌటుప్పల్, చండూరు, న్యూస్టుడే: తళతళలాడే పట్టు చీరలు నేసే మగ్గాలపై నేత పని నిలిచిపోతోంది. నేతన్నలు ఉపాధి కోల్పోతున్నారు. చీరల తయారీకి ఉపయోగించే మల్బరీ పట్టు గూళ్ల ధర రెట్టింపైంది. నేసిన చీరలకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 5వేల పట్టు చీరలు నేసే మగ్గాలున్నాయి. వీటిపై ఆధారపడి 20 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి.
అమాంతం పెరిగిన పట్టుదారం ధర
తెలంగాణలో పట్టుగూళ్ల మార్కెట్లు తిరుమలగిరి, జనగామలో ఉన్నాయి. రైతులు తాము పండించిన పట్టుగూళ్లను అక్కడ విక్రయిస్తుంటారు. సిల్క్ రీలింగ్, ట్విస్టింగ్ చేసే పరిశ్రమల నిర్వాహకులు ఈ మార్కెట్ల నుంచి పట్టుగూళ్లను కొంటారు. గతేడాది లాక్డౌన్ సమయంలో మార్కెట్లలో పట్టుగూళ్లు కిలోకు ధర రూ.180-200 పలికింది. కనీసం రూ.250- 300 ధర వస్తేనే సెరికల్చర్ చేసే రైతులకు గిట్టుబాటవుతుంది. సరైన ధర రావడం లేదని సగానికి పైగా రైతులు మల్బరీ సాగును మానుకున్నారు. మిగిలిన తోటలకు ఇటీవల వర్షాలకు నష్టం జరిగింది. పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. మార్కెట్లో పట్టుగూళ్లకు కిలోకు ధర రూ.600కు పైగా పలుకుతోంది. దారం తయారీకి అవసరమైన పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గడంతో మహారాష్ట్ర మార్కెట్ నుంచి కొనాల్సి వస్తోంది. కర్ణాటక నుంచి ముడి పట్టుదారాన్ని తెచ్చుకుంటున్నారు. గతంలో చైనా నుంచి పట్టుదారం దిగుమతయ్యేది. అదీ నిలిచిపోయింది. పట్టుచీరల తయారీకి ఉపయోగించే పట్టుదారం ధర రెట్టింపైంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల చేనేతలకు సరిపడా పట్టుదారం ఉత్పత్తి కావాలంటే నెలకు 210 టన్నుల పట్టుగూళ్లు అవసరం. 15 వేల ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలి.
మగ్గం నేయకపోతే పూట గడవదు
-బత్తుల చంద్రయ్య, చౌటుప్పల్
కరోనా మహమ్మారికి ముందు కిలో పట్టుదారం ధర రూ.3,500 ఉండేది. ఇప్పుడు రూ.5,300 అయ్యింది. ఏడు పట్టుచీరల తయారీకి కిలోన్నర నిలువు దారం, 3.7 కిలోల పేక దారం అవసరం. ప్రస్తుత ధర ప్రకారం పట్టుదారానికి రూ.27,340 అవుతుంది. కరోనాకు ముందు రూ.18,500 సరిపోయేది. పట్టుదారం ధర దాదాపు రెట్టింపైనా చీర ధర అంతే ఉంది. మగ్గం నేయకపోతే పూట గడవదు. నేస్తే కనీస కూలి రాని పరిస్థితి నెలకొంది.
మహారాష్ట్ర నుంచి పట్టుగూళ్లు తెస్తున్నా
-గంజి శ్రీహరి, పట్టుదారం ఉత్పత్తిదారు, చౌటుప్పల్
5వేల మగ్గాలపై పట్టుచీరలు నేస్తున్నారు. మగ్గానికి నెలకు ఆరు కిలోలు చొప్పున 30వేల కిలోల పట్టుదారం అవసరం. పట్టుగూళ్లను జనగామ, తిరుమలగిరి మార్కెట్ల నుంచి కొంటాం. అక్కడికి సగటున రోజుకు 1,000 నుంచి 1,500 కిలోల పట్టుగూళ్లను రైతులు అమ్మకానికి తెచ్చేవారు. కిలోకు రూ.250 నుంచి రూ.300 ధర చెల్లించి కొంటాం. ప్రస్తుతం 100 కిలోలూ మార్కెట్కు రావడం లేదు. ధర కిలోకు రూ.600 అయ్యింది. నా యూనిట్కు రోజుకు 400 కిలోల పట్టుగూళ్లు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఉత్పత్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో సెరికల్చర్ నిలిచిపోయింది. మహారాష్ట్ర నుంచి పట్టుగూళ్లు రోజుకు 150 కిలోలు తెస్తున్నాం. కర్ణాటక నుంచి ముడి పట్టుదారం తెచ్చి ట్విస్టింగ్ చేస్తున్నాం. గతంలో రోజుకు 57 కిలోల పట్టుదారం ఉత్పత్తి చేసేవాళ్లం. ముడి సరుకు కొరతతో 20 కిలోలే ఉత్పత్తి అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడగళ్ల వాన.. పంట నష్టం
[ 05-05-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఆత్మకూర్ (ఎస్) మండలంలో పెద్ద ఎత్తున ఈదురు గాలులతో వర్షం కురిసింది. -
అవకాశవాదులను ఓడించాలి: సీపీఎం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాదులను ఓడించి ప్రజాస్వామ్య వాదులను గెలిపించాలని ఐద్వా ఉపాధ్యక్షురాలు కేఎన్ ఆశలత అన్నారు. -
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి దీప్తి హోటల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. -
తీవ్ర ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
[ 05-05-2024]
తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
భారాస అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం
[ 05-05-2024]
పేద ప్రజలకు భారాస వల్లే లాభం చేకూరుతుందని భారాస నాయకులు అన్నారు. -
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి