ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది.
వీఐపీ రోడ్డు మూసివేతతో తరచూ ప్రమాదాలు
ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
దారి మళ్లకుండా ఏర్పాటు చేసిన విభాగిని
కార్పొరేషన్, న్యూస్టుడే: నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. వీఐపీ రహదారి నుంచి ఆశీలుమెట్ట వైపు వాహనాలు వెళ్లకుండా రహదారిని విభాగినులతో మూసివేయడం సమస్యగా మారింది. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ద్విచక్రవాహన చోదకులు బాధితులుగా మారుతున్నారు. వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ ఇటీవల ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతకంటే ముందు ఓ కారు విభాగినిపైకి ఎక్కి బీభత్సం సృష్టించింది. ఆశీలుమెట్ట నుంచి జీవీఎంసీ కార్యాలయం వైపు వస్తున్న ఓ యువతి ద్విచక్రవాహనాన్ని ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, వాహనం నుజ్జయింది.
వీఐపీ రోడ్లో ఎదురెదురుగా వాహనాలు
అందుకే మూసివేత: వాస్తు దోషం కారణంగా సీబీసీఎన్సీ ప్రాజెక్టు పనులు వేగంగా జరగడం లేదని, వీఐపీ రహదారిని మూసివేస్తే వాస్తు దోషం పోతుందనే నమ్మకంతో రహదారిపై విభాగిని ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వీఐపీ రహదారి- ఆశీలుమెట్ట మార్గంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేవి. వీఐపీ రహదారి నుంచి వచ్చే వాహనాలు ముందుగా సిరిపురం వైపు తిరిగి, కాస్త ముందుకెళ్లిన తరువాత మలుపు(యూ టర్న్) తీసుకోవాల్సి ఉంటుంది. సిరిపురం నుంచి వీఐపీ రహదారికి రావాలంటే సంపత్ వినాయగర్ ఆలయం దాటి వేమన మందిరం వద్ద మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘షాపర్స్’ స్టాప్ దాటిన తరువాత కాస్త ముందుకెళితే కుడివైపు తిరిగే వీలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో టైకూన్ హోటల్ వైపు ఉన్న మార్గాల నుంచి వచ్చే వాహనచోదకులు రాంగ్ రూటÂలో వచ్చి ఎడమ వైపు ఉన్న రహదారిలోకి మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు.
టైకూన్ కూడలి వద్ద ఇలా...
ఫిర్యాదులు వస్తున్నా చర్యలేవీ?: వీఐపీ రోడ్డులో విభాగినుల ఏర్పాటుపై ప్రజలపై నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. గతంలో స్వయానా ఎంపీ ఎంవీవీ జీవీఎంసీ కమిషనర్, సీపీలను కలిసి విభాగినులను తొలగించాలని వినతిపత్రాలు అందజేశారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో తన తప్పులేదని తప్పించుకోవడానికి ఎంపీ ఇలా వినతిపత్రాలు ఇచ్చారని నాడు విమర్శలొచ్చాయి. ఇది జరిగి 8 నెలలైనా ఉన్నతాధికారులు విభాగినుల తొలగింపునకు ఎటువంటి చొరవ తీసుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ కుట్ర లోతు.. బంగాళా‘ఖాత’మంత!!
[ 01-05-2024]
ప్రభుత్వ యంత్రాంగం తగినంత ఉంది. పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేయొచ్చు. అయినా లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టే యోచనపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. -
సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు
[ 01-05-2024]
ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. -
నేడు పెందుర్తిలో పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ బుధవారం పెందుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని జీవీఎంసీ తెదేపా ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. -
రెండో విడతలో 12,626 మందికి పోలింగ్ విధులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ, గాజువాక, విశాఖ పశ్చిమ, ఎస్.కోట నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు... -
ఎన్నికల పండక్కి.. విశాఖకు రండి!
[ 01-05-2024]
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది. యువత ఉపాధి అవకాశాలకు గండిపడింది. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ దగా చేసిన తీరు తేటతెల్లమయింది. అనేక ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు. -
మాటలకెన్నో అర్థాలు.. నోటినిండా అబద్ధాలు
[ 01-05-2024]
నా బీసీలంటూ.. తరచూ వల్లించే జగన్ వారిని కోలుకోని దెబ్బ తీశారు. ‘బీసీలంటే వెన్నెముక వర్గాలని’ చెప్పి.. అయిదేళ్లలో వారిని మరింత వెనక్కి నెట్టేశారు. జిల్లా జనాభాలో 50 శాతానికి పైగా వెనకబడిన వర్గాల ప్రజలే ఉన్నారు. -
గుర్తుందా.. జగన్ ఏలేరు పైపులైను..!
[ 01-05-2024]
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలనకు ఇవే చివరి ఎన్నికలు
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ పరిపాలనకు ఇవే చివరి ఎన్నికలు అని సినీనటుడు, జనసేన ప్రచారకుడు పృథ్విరాజ్ అన్నారు. ఎంవీపీకాలనీ విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
[ 01-05-2024]
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. -
సూపర్ సిక్స్... బంపర్ హిట్ : గణబాబు
[ 01-05-2024]
తెదేపా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు బంపర్ హిట్ అని, వైకాపా మ్యానిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అభిప్రాయపడ్డారు. -
‘కాగితం’పైనే డిప్యుటేషన్ల రద్దు!
[ 01-05-2024]
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దుకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లంటినీ రద్దు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెల 7న ఆదేశించారు. -
లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి ప్రకటనలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
కార్మికులపై కరకు మనసు!!
[ 01-05-2024]
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. -
ఉపాధి నిధులు మింగేస్తున్నారు..
[ 01-05-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే ఉపాధి నిధులను వైకాపా నాయకులు స్వాహా చేస్తున్నారని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. అచ్యుతాపురం మండలం లంకధర్మవరం, మడుతూరు గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మంగళవారం మాట్లాడారు. -
పేదల స్థలాలు కబ్జా
[ 01-05-2024]
కాయకష్టం చేసి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కొనుగోలు చేసిన ఇంటి స్థలాలను వైకాపాకు చెందిన నాయకుడు కబ్జా చేశాడు. ఐదేళ్ల కితం కొనుగోలు చేసిన ఈ స్థలాలను ఆ నేత పొక్లెయిన్తో చదును చేయించడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. -
విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. -
రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపా కూటమిని గెలిపించాలి
[ 01-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని, రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజాపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, సినీనటి ఖుష్బూ తెలిపారు. -
వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
[ 01-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
బాలుడి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం
[ 01-05-2024]
విశాఖ మీదుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన ఓ బాలుడ్ని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. -
పలు రైళ్ల దారి మళ్లింపు
[ 01-05-2024]
సదరన్ రైల్వే సేలం డివిజన్ వంజిపాల్యం స్టేషన్లో యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా మే 10న డిబ్రూఘర్-కన్యాకుమారీ (22504) రైలు, మే 7, 9, 13 తేదీల్లో ఎర్నాకుళం-టాటానగర్(18190) ఎక్స్ప్రెస్ వయా ఇరుగుర్, పొదనూర్, సూరత్కల్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్యాయత్నం..
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!