పునరావాసం.. పచ్చి మోసం
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది.
అయిదేళ్లుగా హామీలతోనే కాలయాపన
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. నిలువ నీడ లేకుండా పోయినవారిని నిలువునా ముంచేస్తోంది. ఉన్న ఊరిని పోగొట్టుకొని, ఉపాధిని కోల్పోయి.. నిస్సహాయలుగా మిగిలిన నిర్వాసితుల గోడు గాలికొదిలేసింది. నేనున్నానంటూ సీఎం జగన్ చెప్పిన మాటలు వీరి విషయంలో ఉత్తుత్తి వాగ్దానాలుగా మిగిలిపోయాయి.
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 26 గ్రామాల పరిధిలోని భూములను సేకరించి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు ఇంటి స్థలాలు, ఆర్అండ్ఆర్ పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. ఇంకా 700 మందికి, వారి పిల్లలకు పరిహారం, ఇంటి స్థలాలు కేటాయించలేదు. నిర్వాసితుల పునరావాసం కోసం దిబ్బపాలెంలో సెజ్ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో వసతుల మెరుగుపై ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదు. సరైన మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సదుపాయం లేదు. ఆర్భాటంగా రూ. 1.10 కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మించిన ప్రస్తుత ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కనీసం నెలరోజుల వరకైనా గోదావరి జలాలను కాలనీకి సరఫరా చేయలేక చతికిలపడ్డారు.
10 శాతమైనా న్యాయం చేయలేదు
నక్కపల్లి, న్యూస్టుడే: నక్కపల్లి మండలంలో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిమిత్తం తీరప్రాంతాన్ని ఆనుకుని ప్రభుత్వ, జిరాయితీ, డీఫాô భూములు కలిపి సుమారు 4300 ఎకరాలు సేకరించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో సుమారు 90 శాతం రైతులకు పరిహారం చెల్లించారు. అంతేకాకుండా స్టార్టప్ ఏరియా కోసం 1150 ఎకరాలు సిద్ధం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరవాత మిగిలిన సమస్యలు పరిష్కరించి, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెడుతుందని భావించినా, ఒరిగిందేమీ లేదు. దీనికి తోడు నిర్వాసితులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినా, పెద్దగా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని బాధితులంతా డిమాండు చేస్తుంటే, కేవలం ఇళ్లు కోల్పోయిన వారికి మాత్రమే పునరావాసం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మాట తప్పనన్నారు.. నాలుక మడత పెట్టేశారు..
నేనున్నానన్నారు.. నట్టేట్లో ముంచారు..
ఆదుకుంటామన్నారు.. ఆపదలోకి తోసేశారు..
పరిహారమిస్తామన్నారు.. పరిహాసం చేశారు..
తెదేపా హయాంలో అలా.. జగన్ పాలనలో డీలా ... గతంలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు ప్యాకేజీ అందించే తేదీని 2004 నుంచి 2010కి మార్చి వారికి మర్చిపోలేని మేలు చేసింది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కాదన్న వితంతు మహిళలకు సైతం పరిహారం, ఇంటిస్థలం అందించాలని నిర్ణయం తీసుకొని అమలు చేసింది. మేజర్ మగపిల్లలు, మేజర్ ఆడపిల్లలకు సమానంగా 5 సెంట్లు ఇంటిస్థలం, రూ. 1.75 లక్షల పరిహారం అందించి వందలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. దిబ్బపాలెం సెజ్ కాలనీలో తారురోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందాన తయారైంది.
పరిష్కారం కాని సమస్యలెన్నో... పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పిస్తామంటూ చట్టం చేసిన జగన్ ప్రభుత్వం అచ్యుతాపురం సెజ్లో మాత్రం అమలు చేయలేదు. సెజ్ కారణంగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న దుప్పితూరు గ్రామం తరలింపును ఈ ఐదేళ్లుగా ప్రభుత్వం నానుస్తూనే ఉంది. తమ గోడు పట్టించుకోవాలంటూ స్థానికులు దీనిపై మంత్రులు, అఖిలభారత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సెజ్ ఏర్పాటుతో తీవ్ర ప్రభావానికి గురైన పూడిమడక గ్రామస్థులు, మత్స్యకార యువతకు ఉపాధి దక్కలేదు. నిర్వాసితులకు కనీసం బస్సు సౌకర్యం లేకుండా పోయింది.
పరిహారం, ప్యాకేజీ చెల్లించాలంటూ నిర్వాసితుల ఆందోళన (పాత చిత్రం)
కార్యాలయాన్నీ తరలించేశారు... నిర్వాసితుల సమస్యలు పరిష్కారం మాటెలా ఉన్నా ఆర్అండ్ఆర్ ప్రత్యేక ఉప కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగడానికి అన్నదాతల కాళ్లరుగుతున్నాయి. అర్హులైన వారికి ఇంటిస్థలాలు, పట్టాలు అందివ్వడానికి వీలుగా గతంలో ఏపీఐఐసీ వన్స్టాప్ కార్యాలయంలో ఈ కార్యాలయం నడిచేది. వైకాపా ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించేసింది. రెండు మండలాల పరిధిలో 9297 ఎకరాల సెజ్ స్థలానికి సంబంధించిన వేలాది మంది నిర్వాసితులు జిల్లాలో ఉన్న ఎస్డీసీ కార్యాలయానికి వరుస కడుతున్నారు.
-ఈనాడు, అనకాపల్లి,
న్యూస్టుడే,
అచ్యుతాపురం
రెండు మండలాల్లో 26 గ్రామాల నిర్వాసితులకు
ఏర్పాటు చేసిన దిబ్బపాలెం సెజ్ కాలనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్‘వేరుకు వైకాపా వైరస్’
[ 06-05-2024]
విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఎంతో నైపుణ్యమున్న యువత బయటకు వస్తున్నారు. -
అదీ.. నాయకత్వం!!
[ 06-05-2024]
విశాఖకు ‘హుద్హుద్’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది. -
‘వైకాపా పాలనలో సహజ వనరుల లూఠీ’
[ 06-05-2024]
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పిలుపునిచ్చారు. ఆదివారం జగదాంబకూడలిలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
కోడ్.. ఏమైంది?
[ 06-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా అధికార వైకాపా నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. -
ప్రలోభాల ‘పోస్టల్ బ్యాలట్’...!
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలో ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలట్ పోలింగ్ ప్రారంభమైంది. -
ప్రలోభాల వల.. చిక్కితే విలవిలే!!
[ 06-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్ కనీసం పట్టించుకోలేదు. -
భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు : శ్రీభరత్
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు పెడతామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. -
‘యువతకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం’
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ -
అయిదేళ్లలో కాపులకు రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాపులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి కాపుల సాధికారత, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వంగవీటి రాధా ప్రకటించారు. -
ఏప్రిల్లో భారీ రికవరీ
[ 06-05-2024]
విశాఖ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ నెలలో 68 ఆస్తి చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 49 కేసులను ఛేదించినట్లు జె.సి.పి. ఫకీరప్ప, డి.సి.పి. వెంకటరత్నంలు వెల్లడించారు. -
రైతుకు ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం
[ 06-05-2024]
ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
కూటమి ప్రభుత్వంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణం మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కూటమి(జనసేన) దక్షిణం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. -
జిల్లా అభివృద్ధికి పరి‘శ్రమిస్తా’..!
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమితో పిల్లలకు బంగారు భవిత
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
రౌడీగా మారిన బూడికి బుద్ధి చెప్పండి
[ 06-05-2024]
కాపులంతా ఐక్యంగా ఉండి ఎమ్మెల్యే కన్నబాబురాజును చిత్తుగా ఓడించాలని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
ఉచిత బస్సు ప్రయాణం: అనిత
[ 06-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లపాటు వైకాపా చేసిన అరాచకాలకు ప్రజలంతా ఈనెల 13న ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
అదిరింది అయ్యన్నా!
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారంలో అయ్యన్నపాత్రుడు వినూత్న పంథా ఎంచుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఎన్టీఆర్ మినీ స్టేడియంకు వచ్చిన ఆయన వాకర్స్తో నడుస్తూ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
కూటమి విజయభేరి నేడే
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. -
జనం ఆస్తులకు జగనే గండం
[ 06-05-2024]
ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు