Population : లక్ష జనాభా కూడా లేని దేశాలివి.. ఓ లుక్కేయండి!
ప్రపంచంలోనే (World) అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్ (India) అవతరించింది. 142.86 కోట్ల మందితో చైనాను (China) వెనక్కి నెట్టేశాం. ఈ నేపథ్యంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశాలపై ఓ లుక్కేయండి.
భారత్లో (India) జనాభా ప్రకారం అతి చిన్న రాష్ట్రం సిక్కిం (Sikkim). అక్కడ జనాభా 6.90 లక్షలు. సరిగ్గా లక్ష జనాభా (Population) లేకున్నా కొన్ని ప్రాంతాలు దేశాలుగా గుర్తింపు పొందాయి. వాటిని పరిశీలించండి.
వాటికన్ సిటీ
ప్రపంచంలో కెల్లా చిన్న దేశంగా పేరున్న వాటికన్ సిటీలో 518 మంది నివసిస్తున్నారు. ఈ దేశ విస్తీర్ణం చదరపు కిలోమీటరు లోపే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మతబోధకులు, నన్లు కనిపిస్తారు. సిస్టీన్ ఛాపెల్, సెయింట్ పీటర్స్ బసిలికా, సెయింట్ పీటర్స్ స్క్వేర్ వంటి ముఖ్యమైన నిర్మాణాలున్నాయి. స్క్వేర్లో దాదాపు 80 వేల మందికి వసతి కల్పించవచ్చు. పోప్ సందేశాన్ని వినేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు ఇక్కడకు తరలివస్తుంటారు.
టువలు
ఈ దేశం హవాయ్, ఆస్ట్రేలియా మధ్యలో.. 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇక్కడ 11,396 మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న సముద్ర జలాలు భవిష్యత్తులో ఈ దేశాన్ని ముంచెత్తుతాయనే అందోళన స్థానికుల్లో నెలకొంది. ఈ దేశ జనాభా వారి పూర్వీకులు అనుసరించిన జీవన విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వీరు పడవలు తయారు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు. అంతే కాకుండా క్రికెట్ పోలిన ఆట ‘కిలికిటి’ ఆడుతారు. జనాభా మొత్తం సంతోషంగా ఉంటారు. ఎక్కువగా కొబ్బరితో తయారయ్యే వంటకాలు చేసుకుని తింటారు.
నౌరు
21 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ద్వీప దేశం నౌరు. జనాభా 12,780. వారంతా వ్యవసాయం చేస్తూ పైనాపిల్, అరటి, కొబ్బరి, ఇతర కూరగాయలు పండిస్తుంటారు. ఫాస్పేట్ తవ్వకాల కారణంగా ఇక్కడున్న 80 శాతం భూమి నాశనమైంది. ఈ దీవిలోకి మానవులు మూడు వేల ఏళ్ల క్రితమే ప్రవేశించారని చెబుతున్నారు. అప్పట్లో తమ ఆహారం కోసం సముద్ర జీవులపై ఆధారపడేవారు. 1800వ సంవత్సరంలో యూరోపియన్లు ఈ దీవిలోకి అడుగుపెట్టారు. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయంలో ఈ దేశ ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి అక్కడ జనాభా మొత్తం సంతోషంగా జీవిస్తున్నట్లు సమాచారం.
పలౌ
పలౌలో 18,058 మంది నివసిస్తున్నారు. 459 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇది పసిఫిక్ దీవుల్లోని ప్రాంతం. క్రీస్తుపూర్వం సుమారు 2వేల ఏళ్ల కిందటే ఇక్కడ మనుషుల సంచారం ఉండేదట. 1914-44 వరకు ఇది జపాన్ అధీనంలో ఉంది. ఆ తరువాత అమెరికా చేతుల్లోకి వెళ్లింది. 1994లో పలౌ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇక్కడ అందమైన ద్వీపాలున్నాయి.
శాన్ మారినో
శాన్ మారినోలో 33,642 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ దేశం 61 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. క్రీస్తు శకం 300 సంవత్సరంలో ఇక్కడున్న ఓ కొండపై చర్చిని నిర్మించారు. క్రమంగా అదే ఇప్పుడు ఓ స్వతంత్ర దేశంగా రూపాంతరం చెందింది. 1862లో గిసెప్పె గారిబాల్డి అనే ఇటాలియన్ జనరల్ ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇటలీ పునరేకీకరణ సమయంలో గిసెప్పె, అతని భార్య ఇక్కడే తలదాచుకున్నారట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశం అనేక కష్టాలు చవిచూసింది. ఇప్పుడు మాత్రం తలసరి ఆదాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. దేశం నడిబొడ్డున టైటానో పర్వతంపై నిర్మించిన గ్వైటా కోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మొనాకో
మొనాకో దేశంలో 36,297 మంది నివాసముంటున్నారు. 2 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ దేశం విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 32 శాతం మంది ప్రజలు ధనవంతులే. ఇక్కడ గృహాలు, ఇతర నిర్మాణాలు వైవిధ్యంగా కన్పిస్తాయి. అవి చాలా మందికి వసతి కల్పించడానికి అనువుగా ఉంటాయి. ఈ దేశంలో మొనాకో గ్రాండ్ ప్రి రేస్ కూడా జరుగుతుంది. మొనాకో క్యాసినోలకు చాలా ఫేమస్. ఏటా సెప్టెంబరులో నిర్వహించే పడవల పోటీలను చూసేందుకు విదేశాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తుంటారు. ఇది ఐరోపా సమాఖ్యలో భాగం కానప్పటికీ యూరో ఈ దేశ ప్రధాన కరెన్సీ.
లైకెస్టీన్
లైకెస్టీన్లో 39,584 మంది నివసిస్తున్నారు. 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇది స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్యలో కన్పిస్తుంది. ఇక్కడి ప్రజలు జర్మన్ భాష మాట్లాడతారు. వారి తలసరి ఆదాయం కూడా ఎక్కువే. పర్వతాలు, నదులు, సరస్సులతో కూడిన ఈ ప్రాంత అందాలు పర్యాటకులను మైమరచిపోయేలా చేస్తాయి.
మార్షల్ ఐలాండ్స్
మార్షల్ ఐలాండ్స్లో 41,996 మంది జీవిస్తున్నారు. 181 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం పసిఫిక్ మహాసముద్రంలోని మైక్రోనేషియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ 29 వలయాకార పగడపు దిబ్బలు, 5 దీవులున్నాయి. ఈ దేశ రాజధాని మజురోలోనే సగం జనాభా నివసిస్తున్నారు. పర్యాటకులు స్కూబా డైవింగ్ చేసేందుకు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. 1944లో అమెరికా నియంత్రణలోకి వెళ్లినప్పటి నుంచి ఈ దేశం అగ్రరాజ్యంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జనాభా 47,755. 261 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. ఈ కరీబియన్ దేశం వెనెజువెలాకు ఉత్తర దిశలో ఉంది. చెరకు ఇక్కడి ప్రధాన ఆహార పంట. ఈ దేశానికి ప్రత్యేకంగా సైన్యం లేనప్పటికీ మాదక ద్రవ్యాల కార్యకలాపాలను అడ్డుకోవడానికి 300 మంది సిబ్బంది పోలీస్ ఫోర్స్లా పనిచేస్తున్నారు. గతేడాది స్వలింగ సంపర్కాన్ని ఇక్కడ చట్టబద్ధం చేశారు. ఏటా పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఈ దేశం క్రమంగా అభివృద్ధి చెందుతోంది.
డొమినికా
డొమినికాలో 73,040 మంది జనాభా నివసిస్తున్నారు. 751 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ దేశం ఉంది. ఈ అద్భుతమైన ద్వీపంలో వర్షారణ్యాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా కన్పిస్తాయి. గతంలో కాఫీ తోటల్లో పని చేయించుకునేందుకు ఎక్కువ మంది ఆఫ్రికా జాతి ప్రజలను ఇక్కడికి తరలించారు. దాంతో ఇప్పుడు ఆ దేశం నిండా ఆఫ్రికన్లే కన్పిస్తుంటారు. ఈ దేశంలో సంగీత, నృత్యోత్సవాలు అధికంగా జరుగుతుంటాయి.
నోట్ : జనాభా వివరాలు వరల్డ్ పాపులేషన్ రివ్యూ.కామ్ లెక్కల ఆధారంగా తీసుకున్నవి. వీటిలో స్వల్ప పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..