Cave man: గుహలో 16 ఏళ్లు ఒంటరి జీవితం.. సంతోషం కోసం వింత నిర్ణయం!
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి చిల్లిగవ్వ కూడా లేకుండా 16 ఏళ్లు ఒంటరిగా గుహలో జీవనం సాగించాడు.
(Image : Only Human)
డబ్బుకు లోకం దాసోహం అంటారు. ఆధునిక ప్రపంచం మొత్తం డబ్బు(Money) చుట్టూ తిరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదిస్తూ వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారు. అలా ఖర్చు చేసే మొత్తంలో మెజారిటీ వాటా చాలా మంది ఇంటి అద్దె చెల్లించడానికే (house rent)వెచ్చిస్తున్నారు. ఈ విధానంపై ఓ వ్యక్తికి విసుగుపుట్టింది. అంతే.. డబ్బు, ఇల్లు లేకుండా ఓ గుహలో 16ఏళ్లు జీవనం సాగించాడు. అదెలా సాధ్యమైందో తెలుసుకుందాం పదండి..
అన్నీ త్యజించి..
అమెరికాకు(america) చెందిన డేనియల్ షెల్లాబార్జర్ అలియాస్ స్వీలో అందరిలాగే సాధారణ జీవితం గడిపేవాడు. అతడికి కష్టపడి సంపాదించడం.. అలా వచ్చిన నగదుతో ఇంటి అద్దె కట్టడం నచ్చలేదు. దాంతో ఓ రోజు తాను చేస్తున్న ఉద్యోగం, అద్దె ఇల్లు వదిలి ఓ గుహ(cave)లోకి వెళ్లాలనుకొని నిశ్చయించుకొన్నాడు. ఆ సమయంలో డేనియల్ దగ్గర కొంత డబ్బు ఉండేది. వెంటనే దాన్ని తీసుకెళ్లి ఓ పబ్లిక్ ఫోన్ బాక్స్పై పెట్టి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు తనకు స్వేచ్ఛ లభించినట్లయింది. సౌకర్యంగా అనిపించింది. విలువైనది వదిలేసి వెళ్తున్నట్లు కాకుండా ఓ గుది బండను వదిలించుకున్నట్లుగా తన మనసుకు ప్రశాంతత చేకూరింది. ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తూనే యుటా రాష్ట్రంలోని మోఅబ్ పట్టణానికి దగ్గర్లోని ఓ గుహలోకి వెళ్లిపోయాడు.
(Image : Only Human)
జీవనం ఎలా?
గుహలో ఉన్న డేనియల్ దగ్గర చిల్లిగవ్వ లేదు. దాంతో ఆకలి వేస్తే చెత్త డబ్బాలు(Dust bin) వెతకడం మొదలు పెట్టాడు. అందులో తనకు దొరికిన ఆహారం, వస్తువులను సేకరించుకొని గుహకు తెచ్చుకునేవాడు. నాన్వెజ్ ఆహారం తినాలనిపిస్తే రోడ్డుపై చచ్చిపడిన జంతువులను తెచ్చి వండుకునేవాడు. ఇవే కాకుండా గుహకు సమీపంలో కొన్ని రకాల కూరగాయలను(vegetable) కూడా పెంచాడు. సాధారణంగా బిచ్చగాళ్లను, నిరుపేదలను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఫుడ్ స్టాంప్స్(food stamps) ఇస్తుంది. వాటిని వినియోగించుకొని ఆహార కేంద్రాల్లో తినవచ్చు. డేనియల్ అవేవీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. తనకు తీరిక దొరికినప్పుడు బ్లాగ్(blog) రాసుకోవడానికి మాత్రం లైబ్రరీకి వెళ్లేవాడు. అక్కడి కంప్యూటర్లను వినియోగించి బ్లాగ్ రాసేవాడు.
సులభంగానే తిండి..
తన మొత్తం గుహ జీవితంపై డేనియల్ మాట్లాడుతూ.. ‘90వ దశకం నుంచే నేను కొన్నిసార్లు గుహల్లో ఉండటం అలవాటు చేసుకున్నాను. దాంతో ధనం, ఇల్లు లేదనే లోటు నాకు తెలియలేదు. ఒంటరి జీవితం ఎంచుకోవడానికి ముందే నాకు చాలా మంచి ఉద్యోగం ఉండేది. సంపాదించి ఖర్చు చేయడం నాకు నచ్చలేదు. అందుకే ప్రకృతి వైపు అడుగులు వేశాను. దాదాపుగా ఆది మానవుల జీవన శైలిని అనుసరిస్తూ కాలం గడిపానని’ చెప్పాడు.
అందరూ డబ్బు లేకుంటే తిండి ఎలాగని ఆలోచిస్తారు. కానీ, తనకు సులభంగా తిండి దొరికేదని డేనియల్ తెలిపాడు. ప్రజలు చాలా ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. దాంతో కడుపు నింపుకొన్న తాను ఏ రోజూ జబ్బు పడలేదని స్పష్టం చేశాడు. గుహలో జీవించాలనుకోవడం వెనుక ప్రధాన కారణం ఏంటని డేనియల్ను అడగ్గా.. ఆధునిక జీవన విధానం చూసి చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని, నాకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. సంచార జీవనం ఎంచుకున్న తరువాత పూర్తిగా స్వేచ్ఛ(Freedom) దొరికిందని, ఒత్తిడి దూరమైందని తన అనుభవాన్ని వివరించాడు.
తల్లిదండ్రుల కోసం..
ఇలా సంతోషంగా జీవనం సాగిస్తున్న డేనియల్ 2016లో మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చాడు. తన తల్లిదండ్రులు బాగా వయోవృద్ధులు కావడంతో వారికి చేదోడుగా ఉండేందుకు తాను ఎంచుకున్న జీవన విధానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి డేనియల్ జీవితం గురించి పలు పత్రికలు, టీవీ, యూట్యూబ్ ఛానళ్లలో కథనాలు ప్రసారమవుతూ ఉన్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..