ఆ ఎడారి దేశాల్లో ఉప్పునీరే మంచినీరవుతోంది..!
భూమిపై 71శాతం నీరు.. 29శాతం భూభాగం ఉందని అందరికీ తెలిసిందే. భూమిపై ఉన్న నీటిలో 97శాతం సముద్ర జలం కాగా.. మిగతా మూడు శాతం భూగర్భ జలాలే జీవరాశి దాహార్తి తీరుస్తున్నాయి. ...
ఇంటర్నెట్ డెస్క్: భూమిపై 71శాతం నీరు.. 29శాతం భూభాగం ఉందని అందరికీ తెలిసిందే. భూమిపై ఉన్న నీటిలో 97శాతం సముద్ర జలం కాగా.. మిగతా మూడు శాతం భూగర్భ జలాలే జీవరాశి దాహార్తి తీరుస్తున్నాయి. భూగర్భజలాలు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం మంచినీటి సమస్యలు పెద్దగా లేవు. కానీ, పర్యావరణంలో మార్పులు, నీటి అతి వినియోగం కారణంగా నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపు చేయకపోతే రానున్న కాలంలో ప్రపంచమంతా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో వివిధ దేశాల్లో సముద్ర జలాలను మంచినీటిగా మార్చే ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ, పెద్దగా విజయవంతం కావట్లేదు.
అయితే, కొన్ని శతాబ్దాలుగా తగినంత తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ వంటి ఎడారి దేశాలు సముద్ర జలాల్ని మంచినీటిగా మార్చి నీటి సమస్యను అధిగమిస్తున్నాయి. క్లౌడ్ సీడింగ్తో కృత్రిమ వర్షం కురిపిస్తూ నీటి బొట్టు వృథా కాకుండా సేకరించి డ్యామ్లో నిల్వ ఉంచుతున్నాయి. సాంకేతికతను వాడుతూ నీటి వనరులను సంరక్షిస్తున్న తీరు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది.
డిసాలినేషన్..
సముద్రజలాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఒకవేళ ఈ నీటిని తాగితే శరీరంలోకి ఎక్కువ శాతం ఉప్పు చేరుతుంది. దీని వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి వాటి పనితీరు మందగిస్తుంది. శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించొచ్చు. అందుకే సముద్ర జలాలను ఎవరూ తాగరు. అయితే, సముద్ర తీరాలున్న సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయిల్ వంటి కొన్ని దేశాలు డిసాలినేషన్ ద్వారా సముద్ర జలాల్ని మంచినీటిగా మారుస్తున్నాయి. ఇందుకోసం అనేక చోట్ల డిసాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. సముద్ర జలాల్లో ఉండే ఉప్పును వేరు చేసి తాగడానికి, గృహ అవసరాలకు తగ్గట్టుగా నీటిని మార్చుతున్నాయి. ప్లాంట్లలో ఏర్పాటు చేసిన ఫిల్టర్లలోకి సముద్ర నీటిని పంపిస్తారు. వాటిలోని పొరలు నీటిలోని ఉప్పును వేరు చేసి మంచినీటిని బయటకు పంపుతాయి. అలా ప్రతి రోజు కొన్ని బిలియన్ల లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేస్తున్నారు. కువైట్లో మంచినీటిగా మార్చిన సముద్ర జలాలను వందశాతం వినియోగిస్తున్నారు. అయితే, ఈ డీసాలినేషన్ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. నీటిని ఫిల్టర్ చేయడానికి భారీగా విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది. ఫిల్టర్లనూ తరచూ మార్చాల్సిందే. ఇలా విద్యుత్ వినియోగం, ఫిల్టర్ల కొనుగోలుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియాలోని రస్ అల్ ఖైర్, షుయిబా, రబిగ్ 3 ఐడబ్ల్యూపీ.. యూఏఈలోని తవీలా, ఫుజైరా.. ఇజ్రాయిల్లోని సోరేక్లో ఉన్న డిసాలినేషన్ ప్లాంట్లు అతి పెద్దవి. ప్రపంచవ్యాప్తంగా 16వేల డిసాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఒక శాతం మంది ఈ డీసాలినేషన్ ద్వారా వస్తున్న నీటిపై ఆధారపడుతున్నారు. యూఏఈ, సౌదీ, కువైట్ దేశాలు ధనిక దేశాలు కాబట్టి ఆటుపోట్లు ఉన్నా.. ప్రక్రియ విఫలమైనా ప్రయత్నాలు చేస్తూ.. మంచినీటిని ఉత్పత్తి చేయగలుతున్నాయి. సింగపూర్ ప్రభుత్వం డిసాలినేషన్ కోసం భారీగా బడ్జెట్ కేటాయిస్తోందట. కానీ, చాలా దేశాలు సరైన ప్రణాళిక అమలు చేయలేక, బడ్జెట్ కేటాయించలేక డిసాలినేషన్ను సమర్థంగా నిర్వహించలేకపోతున్నాయి.
క్లౌడ్ సీడింగ్(మేఘ మథనం)
వాతావరణంలో మార్పులు తీసుకొచ్చి కృత్రిమంగా వర్షాలు కురిపించడాన్నే క్లౌడ్ సీడింగ్(మేఘమథనం) అంటారు. సిల్వర్ అయోడైడ్, పోటాషియం అయోడైడ్ వంటి లవణాల్ని విమానంలో తీసుకెళ్లి మేఘాలపై జల్లుతారు. దీంతో మబ్బులు కరిగి వర్షం కురుస్తుంది. అయితే, ఈ క్లౌడ్ సీడింగ్ ఫలితాలపై విభిన్న వాదనలు ఉన్నాయి. ఈ విధానం పెద్దగా ఫలితమివ్వదని, వీటి వల్ల పర్యావరణానికి హాని పొంచి ఉందని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు. అయినా ప్రపంచంలో చాలా దేశాలు వర్షపాతం పెంపునకు క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి.
1891లో లూయిస్ గతమన్ అనే జర్మన్-అమెరికన్ ఇంజినీర్ మబ్బులపైకి కార్బన్డైఆక్సైడ్ను తుపాకీ ద్వారా షూట్ చేసి వర్షం కురిపించే ప్రయత్నం చేశారు. ఈ విధానంపై ఆయన పెటెంట్ హక్కులు కూడా పొందారు. 1930దశకంలోనూ మేఘాలపై మంచు ముక్కల్ని విసిరేసి వర్షం పడేట్టు చేశారు. 1946లో తొలిసారి క్లౌడ్ సీడింగ్ ప్రయోగం జరిగింది. ఆ తర్వాత అనేక దేశాల్లో వివిధ పద్ధతుల్లో క్లౌడ్ సీడింగ్ చేశారు. భారత్లోనూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు క్లౌడ్ సీడింగ్ చేశాయి. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాల్లో మేఘమథనం పేరిట క్లౌడ్ సీడింగ్కు ప్రయత్నించారు.
డ్యామ్స్
ఏడారి దేశాల్లో వర్షపాతం చాలా తక్కువ. అరుదుగా వర్షం కురుస్తుంటుంది. అందుకే క్లౌడ్ సీడింగ్తో కృత్రిమ వర్షాలు కురిపిస్తారు. ఇలా వర్షం పడిన సమయంలో భూమికి చేరిన ప్రతి వర్షపు బొట్టును ఆయా దేశాలు ఒడిసిపడుతున్నాయి. ఇందుకోసం పెద్ద పెద్ద డ్యామ్లు నిర్మిస్తున్నాయి. వర్షపునీరు సముద్రంలో కలవకుండా ఈ డ్యామ్ల్లోకి మళ్లించి నిల్వ ఉంచి.. అక్కడి ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ డ్యామ్ల నిర్మాణం భారీగా పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..