ఆ ఎడారి దేశాల్లో ఉప్పునీరే మంచినీరవుతోంది..!
భూమిపై 71శాతం నీరు.. 29శాతం భూభాగం ఉందని అందరికీ తెలిసిందే. భూమిపై ఉన్న నీటిలో 97శాతం సముద్ర జలం కాగా.. మిగతా మూడు శాతం భూగర్భ జలాలే జీవరాశి దాహార్తి తీరుస్తున్నాయి. ...
ఇంటర్నెట్ డెస్క్: భూమిపై 71శాతం నీరు.. 29శాతం భూభాగం ఉందని అందరికీ తెలిసిందే. భూమిపై ఉన్న నీటిలో 97శాతం సముద్ర జలం కాగా.. మిగతా మూడు శాతం భూగర్భ జలాలే జీవరాశి దాహార్తి తీరుస్తున్నాయి. భూగర్భజలాలు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం మంచినీటి సమస్యలు పెద్దగా లేవు. కానీ, పర్యావరణంలో మార్పులు, నీటి అతి వినియోగం కారణంగా నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపు చేయకపోతే రానున్న కాలంలో ప్రపంచమంతా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో వివిధ దేశాల్లో సముద్ర జలాలను మంచినీటిగా మార్చే ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ, పెద్దగా విజయవంతం కావట్లేదు.
అయితే, కొన్ని శతాబ్దాలుగా తగినంత తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ వంటి ఎడారి దేశాలు సముద్ర జలాల్ని మంచినీటిగా మార్చి నీటి సమస్యను అధిగమిస్తున్నాయి. క్లౌడ్ సీడింగ్తో కృత్రిమ వర్షం కురిపిస్తూ నీటి బొట్టు వృథా కాకుండా సేకరించి డ్యామ్లో నిల్వ ఉంచుతున్నాయి. సాంకేతికతను వాడుతూ నీటి వనరులను సంరక్షిస్తున్న తీరు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది.
డిసాలినేషన్..
సముద్రజలాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఒకవేళ ఈ నీటిని తాగితే శరీరంలోకి ఎక్కువ శాతం ఉప్పు చేరుతుంది. దీని వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి వాటి పనితీరు మందగిస్తుంది. శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించొచ్చు. అందుకే సముద్ర జలాలను ఎవరూ తాగరు. అయితే, సముద్ర తీరాలున్న సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయిల్ వంటి కొన్ని దేశాలు డిసాలినేషన్ ద్వారా సముద్ర జలాల్ని మంచినీటిగా మారుస్తున్నాయి. ఇందుకోసం అనేక చోట్ల డిసాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. సముద్ర జలాల్లో ఉండే ఉప్పును వేరు చేసి తాగడానికి, గృహ అవసరాలకు తగ్గట్టుగా నీటిని మార్చుతున్నాయి. ప్లాంట్లలో ఏర్పాటు చేసిన ఫిల్టర్లలోకి సముద్ర నీటిని పంపిస్తారు. వాటిలోని పొరలు నీటిలోని ఉప్పును వేరు చేసి మంచినీటిని బయటకు పంపుతాయి. అలా ప్రతి రోజు కొన్ని బిలియన్ల లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేస్తున్నారు. కువైట్లో మంచినీటిగా మార్చిన సముద్ర జలాలను వందశాతం వినియోగిస్తున్నారు. అయితే, ఈ డీసాలినేషన్ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. నీటిని ఫిల్టర్ చేయడానికి భారీగా విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది. ఫిల్టర్లనూ తరచూ మార్చాల్సిందే. ఇలా విద్యుత్ వినియోగం, ఫిల్టర్ల కొనుగోలుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియాలోని రస్ అల్ ఖైర్, షుయిబా, రబిగ్ 3 ఐడబ్ల్యూపీ.. యూఏఈలోని తవీలా, ఫుజైరా.. ఇజ్రాయిల్లోని సోరేక్లో ఉన్న డిసాలినేషన్ ప్లాంట్లు అతి పెద్దవి. ప్రపంచవ్యాప్తంగా 16వేల డిసాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఒక శాతం మంది ఈ డీసాలినేషన్ ద్వారా వస్తున్న నీటిపై ఆధారపడుతున్నారు. యూఏఈ, సౌదీ, కువైట్ దేశాలు ధనిక దేశాలు కాబట్టి ఆటుపోట్లు ఉన్నా.. ప్రక్రియ విఫలమైనా ప్రయత్నాలు చేస్తూ.. మంచినీటిని ఉత్పత్తి చేయగలుతున్నాయి. సింగపూర్ ప్రభుత్వం డిసాలినేషన్ కోసం భారీగా బడ్జెట్ కేటాయిస్తోందట. కానీ, చాలా దేశాలు సరైన ప్రణాళిక అమలు చేయలేక, బడ్జెట్ కేటాయించలేక డిసాలినేషన్ను సమర్థంగా నిర్వహించలేకపోతున్నాయి.
క్లౌడ్ సీడింగ్(మేఘ మథనం)
వాతావరణంలో మార్పులు తీసుకొచ్చి కృత్రిమంగా వర్షాలు కురిపించడాన్నే క్లౌడ్ సీడింగ్(మేఘమథనం) అంటారు. సిల్వర్ అయోడైడ్, పోటాషియం అయోడైడ్ వంటి లవణాల్ని విమానంలో తీసుకెళ్లి మేఘాలపై జల్లుతారు. దీంతో మబ్బులు కరిగి వర్షం కురుస్తుంది. అయితే, ఈ క్లౌడ్ సీడింగ్ ఫలితాలపై విభిన్న వాదనలు ఉన్నాయి. ఈ విధానం పెద్దగా ఫలితమివ్వదని, వీటి వల్ల పర్యావరణానికి హాని పొంచి ఉందని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు. అయినా ప్రపంచంలో చాలా దేశాలు వర్షపాతం పెంపునకు క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి.
1891లో లూయిస్ గతమన్ అనే జర్మన్-అమెరికన్ ఇంజినీర్ మబ్బులపైకి కార్బన్డైఆక్సైడ్ను తుపాకీ ద్వారా షూట్ చేసి వర్షం కురిపించే ప్రయత్నం చేశారు. ఈ విధానంపై ఆయన పెటెంట్ హక్కులు కూడా పొందారు. 1930దశకంలోనూ మేఘాలపై మంచు ముక్కల్ని విసిరేసి వర్షం పడేట్టు చేశారు. 1946లో తొలిసారి క్లౌడ్ సీడింగ్ ప్రయోగం జరిగింది. ఆ తర్వాత అనేక దేశాల్లో వివిధ పద్ధతుల్లో క్లౌడ్ సీడింగ్ చేశారు. భారత్లోనూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు క్లౌడ్ సీడింగ్ చేశాయి. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాల్లో మేఘమథనం పేరిట క్లౌడ్ సీడింగ్కు ప్రయత్నించారు.
డ్యామ్స్
ఏడారి దేశాల్లో వర్షపాతం చాలా తక్కువ. అరుదుగా వర్షం కురుస్తుంటుంది. అందుకే క్లౌడ్ సీడింగ్తో కృత్రిమ వర్షాలు కురిపిస్తారు. ఇలా వర్షం పడిన సమయంలో భూమికి చేరిన ప్రతి వర్షపు బొట్టును ఆయా దేశాలు ఒడిసిపడుతున్నాయి. ఇందుకోసం పెద్ద పెద్ద డ్యామ్లు నిర్మిస్తున్నాయి. వర్షపునీరు సముద్రంలో కలవకుండా ఈ డ్యామ్ల్లోకి మళ్లించి నిల్వ ఉంచి.. అక్కడి ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ డ్యామ్ల నిర్మాణం భారీగా పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్లాండ్లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం