కృత్రిమ మేధ విద్యార్థుల భావాల్ని కనిపెట్టేస్తుంది!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ప్రత్యక్షంగా బోధించడం ద్వారానే విద్యార్థులకు జ్ఞానం, మంచి నడవడిక అబ్బుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉపాధ్యాయులకు సైతం విద్యార్థుల మానసిక స్థితి, ప్రతిభ దగ్గరుండి తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ ఆన్లైన్ తరగతుల వల్ల అదీ వీలు కావట్లేదు. పదుల సంఖ్యలో విద్యార్థులను చిన్న తెరపై గమనించడం కాస్త కష్టమే. ఇదే పరిస్థితి హాంకాంగ్లో ట్రూ లైట్ విద్యాసంస్థలో ప్రిన్సిపల్గా ఉన్న కా టిమ్ చుకి ఎదురైంది. దీంతో కృత్రిమ మేధ(ఏఐ)ను ఆశ్రయించాడు. ఏఐకి సంబంధించిన సాఫ్ట్వేర్ సంస్థ రూపొందించిన 4 లిటిల్ ట్రీస్ను కొనుగోలు చేసి ఉపయోగించడం మొదలుపెట్టాడు. దీని ద్వారా తను పాఠాలు చెబుతున్న సమయంలో విద్యార్థుల ముఖాలను పరిశీలించి వారి భావాల్ని టిమ్ కనిపెట్టగలుతున్నాడు.
ఈ సాఫ్ట్వేర్ను ఆన్లైన్ తరగతులకు ఉపయోగించే కంప్యూటర్ లేదా ట్యాబ్లెట్లో ఇన్స్టాల్ చేస్తే.. అందులోని కెమెరా ద్వారా ఆన్లైన్ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థుల ముఖాలను ఏఐ పరిశీలిస్తుంది. ముఖ కండరాలు, కదలికలను బట్టి విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? బాధగా ఉన్నారా? కోపంగా ఉన్నారా? భయపడుతున్నారా? లేదా ఆశ్చర్యపోతున్నారా? వంటి విషయాలను గుర్తించి తెలియజేస్తుంది. అంతేకాదు, ఒక ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఒక్కో విద్యార్థి ఎంత సమయం తీసుకుంటున్నాడు?వారి మార్కుల జాబితా, వారి బలాలు.. బలహీనతలు ఇలా అన్ని విషయాలను రికార్డు చేసి.. ప్రతి విద్యార్థికి ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తుంది. వీటి ద్వారా విద్యార్థి ప్రతిభ సులువుగా తెలుసుకోవచ్చు. వెనుకబడుతున్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే వీలు కలుగుతుంది. అలాగే, ఈ ఏఐ సాఫ్ట్వేర్ మెదడుకు పనిచెప్పే కొన్ని ఆటలు ఆడిస్తూ విద్యార్థులకు తెలివిపెరిగేలా శిక్షణ ఇస్తుంది. ఈ 4 లిటిట్ ట్రీస్ సాఫ్ట్వేర్ను రూపొందించిన వియోలా లామ్ కూడా ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడట. అందుకే, విద్యార్థులు పడే ఇబ్బందులు గుర్తించడం కోసం దీన్ని 2017లోనే రూపొందించాడు. కానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఆన్లైన్ తరగతులే దిక్కుగా మారడంతో ఈ సాఫ్ట్వేర్ వినియోగం పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022 : అమ్మాయిల ఫైనల్ పోరు సమయంలో.. రోహిత్ సేన ఇలా..
-
India News
India Corona: కొనసాగుతోన్న హెచ్చుతగ్గులు.. కొత్త కేసులు ఎన్నంటే..?
-
Movies News
Rajeev Kanakala: ‘లవ్స్టోరీ’లో బాబాయ్ పాత్ర.. ఇబ్బంది పడ్డా! : రాజీవ్ కనకాల
-
Ap-top-news News
Lambasingi: మన్యంలో మంచు దుప్పటి!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Hyderabad News: కారు డ్రైవర్పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస