కృత్రిమ మేధ విద్యార్థుల భావాల్ని కనిపెట్టేస్తుంది!
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ ఆన్లైన్ తరగుతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ప్రత్యక్షంగా బోధించడం ద్వారానే విద్యార్థులకు జ్ఞానం, మంచి నడవడిక అబ్బుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉపాధ్యాయులకు సైతం విద్యార్థుల మానసిక స్థితి, వారు పాఠాలు అర్థం చేసుకుంటున్నారో
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ప్రత్యక్షంగా బోధించడం ద్వారానే విద్యార్థులకు జ్ఞానం, మంచి నడవడిక అబ్బుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉపాధ్యాయులకు సైతం విద్యార్థుల మానసిక స్థితి, ప్రతిభ దగ్గరుండి తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ ఆన్లైన్ తరగతుల వల్ల అదీ వీలు కావట్లేదు. పదుల సంఖ్యలో విద్యార్థులను చిన్న తెరపై గమనించడం కాస్త కష్టమే. ఇదే పరిస్థితి హాంకాంగ్లో ట్రూ లైట్ విద్యాసంస్థలో ప్రిన్సిపల్గా ఉన్న కా టిమ్ చుకి ఎదురైంది. దీంతో కృత్రిమ మేధ(ఏఐ)ను ఆశ్రయించాడు. ఏఐకి సంబంధించిన సాఫ్ట్వేర్ సంస్థ రూపొందించిన 4 లిటిల్ ట్రీస్ను కొనుగోలు చేసి ఉపయోగించడం మొదలుపెట్టాడు. దీని ద్వారా తను పాఠాలు చెబుతున్న సమయంలో విద్యార్థుల ముఖాలను పరిశీలించి వారి భావాల్ని టిమ్ కనిపెట్టగలుతున్నాడు.
ఈ సాఫ్ట్వేర్ను ఆన్లైన్ తరగతులకు ఉపయోగించే కంప్యూటర్ లేదా ట్యాబ్లెట్లో ఇన్స్టాల్ చేస్తే.. అందులోని కెమెరా ద్వారా ఆన్లైన్ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థుల ముఖాలను ఏఐ పరిశీలిస్తుంది. ముఖ కండరాలు, కదలికలను బట్టి విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? బాధగా ఉన్నారా? కోపంగా ఉన్నారా? భయపడుతున్నారా? లేదా ఆశ్చర్యపోతున్నారా? వంటి విషయాలను గుర్తించి తెలియజేస్తుంది. అంతేకాదు, ఒక ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఒక్కో విద్యార్థి ఎంత సమయం తీసుకుంటున్నాడు?వారి మార్కుల జాబితా, వారి బలాలు.. బలహీనతలు ఇలా అన్ని విషయాలను రికార్డు చేసి.. ప్రతి విద్యార్థికి ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తుంది. వీటి ద్వారా విద్యార్థి ప్రతిభ సులువుగా తెలుసుకోవచ్చు. వెనుకబడుతున్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే వీలు కలుగుతుంది. అలాగే, ఈ ఏఐ సాఫ్ట్వేర్ మెదడుకు పనిచెప్పే కొన్ని ఆటలు ఆడిస్తూ విద్యార్థులకు తెలివిపెరిగేలా శిక్షణ ఇస్తుంది. ఈ 4 లిటిట్ ట్రీస్ సాఫ్ట్వేర్ను రూపొందించిన వియోలా లామ్ కూడా ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడట. అందుకే, విద్యార్థులు పడే ఇబ్బందులు గుర్తించడం కోసం దీన్ని 2017లోనే రూపొందించాడు. కానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఆన్లైన్ తరగతులే దిక్కుగా మారడంతో ఈ సాఫ్ట్వేర్ వినియోగం పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
భారత్-మాల్దీవుల(India Maldives) విదేశాంగ మంత్రుల మధ్య నేడు భేటీ జరిగింది. రెండు దేశాల సంబంధాల్లో ఒడుదొడుకులు కొనసాగుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది. -
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన