న్యాయవ్యవస్థ సమూలంగా మారాలి

‘‘వివాదాల సంక్లిష్టత సమస్యను అధిగమించేందుకు న్యాయవ్యవస్థ కేవలం సంప్రదాయ మార్గాల మీద ఆధారపడితే సరిపోదు. సమూల మార్పులతో కొత్తగా ముందుకు రావాలి’’ అని సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ అన్నారు.

Published : 05 Feb 2023 06:21 IST

సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ 

దిల్లీ: ‘‘వివాదాల సంక్లిష్టత సమస్యను అధిగమించేందుకు న్యాయవ్యవస్థ కేవలం సంప్రదాయ మార్గాల మీద ఆధారపడితే సరిపోదు. సమూల మార్పులతో కొత్తగా ముందుకు రావాలి’’ అని సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ అన్నారు. భారత సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘మారుతున్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జస్టిస్‌ మేనన్‌ ప్రసంగిస్తూ.. ‘‘న్యాయవ్యవస్థ విఫలమైతే వ్యవస్థ కుప్పకూలుతుంది. సంక్షోభాలను మనం విజయవంతంగా ఎదుర్కొంటే సమాజానికి మార్గనిర్దేశం చేయవచ్చు’’ అని అన్నారు. అపారమైన కేసుల భారం ఉండే భారత్‌లో న్యాయమూర్తులు ఎక్కువ శ్రమిస్తుంటారని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. భారత సుప్రీంకోర్టు చరిత్ర అంటే.. భారతీయుల దైనందిన పోరాట చరిత్రే అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని