Omicron: ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలు..!
సార్స్కోవ్-2 కొత్త మ్యూటేషన్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్పలక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. వారికి ఇంటి వద్దనే ఉంచి చికిత్సను అందించవచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక డాక్టర్ వెల్లడించారు.
వెల్లడించిన దక్షిణాఫ్రికా డాక్టర్
ఇంటర్నెట్డెస్క్: సార్స్కోవ్-2 కొత్త మ్యూటేషన్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందించొచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక డాక్టర్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఓ ఆంగ్ల వార్తా సంస్థ వద్ద ఈ విషయాన్ని వెల్లడించారు. కోయెట్జీ దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ కమిటీలో సభ్యురాలు కూడా. కొత్త వేరియంట్ను తొలిదశలో అనుమానించిన వారిలో ఆమె కూడా ఒకరు. డెల్టా వేరియంట్ కంటే భిన్నమైన లక్షణాలతో ఏడుగురు పేషెంట్లు వచ్చినట్లు వెల్లడించారు. వీరిందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. ఈ ఘటన నవంబర్ 18న జరిగినట్లు వివరించారు. నవంబర్ 25న దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ) సంస్థ ఒమిక్రాన్ వేరియంట్ వివరాలను వెల్లడించింది.
ఈ విషయమై కోయెట్జీ మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన పేషెంట్లు తీవ్రమైన ఒళ్లునొప్పులు, తలనొప్పితో రెండ్రోజులు బాధపడ్డారని పేర్కొన్నారు. ‘‘ఆ సమయంలో వారి లక్షణాలు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను పోలి ఉన్నాయి. అప్పటికి 10 వారాల వరకు మా ప్రాంతంలో కొవిడ్ కేసులు రాలేదు. దీంతో వారికి పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. ఆ పేషెంట్, వారి కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది. అదే రోజు అటువంటి లక్షణాలతో మరికొంత మంది పేషెంట్లు వచ్చారు. ఏదో మార్పు వచ్చినట్లు అనుమానించాను. ఆ తర్వాత ఎన్ఐసీడీని అదే రోజు అప్రమత్తం చేశాను. ఆ తర్వాత నిత్యం ఇద్దరు లేదా ముగ్గురు కొవిడ్ పేషెంట్లు నా క్లినిక్కు రావడం మొదలైంది. వారందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఆ పేషెంట్లను ఇంటి వద్ద ఉంచే చికిత్స అందించాం. వాసన, రుచి పోవడం, ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించలేదు’’ అని పేర్కొన్నారు.
పీసీఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా కొత్త వేరియంట్ను గుర్తించే అంశంపై ఆదివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. దీనిని కూడా ఇతర వేరియంట్ల వలే పీసీఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చని వెల్లడించింది. ఇతర పరీక్షల ఫలితాలను ఒమిక్రాన్ వేరియంట్ ఏమేరకు ప్రభావితం చేస్తోందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ వేరియంట్ వ్యాప్తి వేగం ఏ స్థాయిలో ఉందనే అంశంపై , రోగ లక్షణాల తీవ్రతపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు మిగిలిన వాటికంటే ఎంత భిన్నంగా ఉంటాయో కూడా చెప్పేందుకు తగినంత సమాచారం లేదని పేర్కొంది. కాకపోతే గతంలో కొవిడ్ బారినపడిన వారు కూడా మరోసారి ఒమిక్రాన్ బారిన పడేందుకు అవకాశం ఉందనటానికి ఆధారాలు లభించాయని వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ఒమిక్రాన్ వేరియంట్ను ‘ఆందోళనకర వేరియంట్’గా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు వెలుగు చూసినా ఆల్ఫా,బీటా,గామా వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితాలోకి చేరింది. ఈ జాబితాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ మాత్రమే ఉంది. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. కాలంతో పోటీపడి దీనిని అడ్డుకోవాలని ఐరోపా సమాఖ్య చీఫ్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. -
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు (Latest News)
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
-
ఓట్ల పండగకు ఆహ్వానం