Ramayanam: 25 ఏళ్ల ‘రామాయణం’.. సెట్స్లో ఎన్టీఆర్ ఎంత అల్లరి చేసేవాడంటే?
రామాయణ ఇతివృత్తంతో ఎన్ని సినిమాలొచ్చినా గుణశేఖర్ తెరకెక్కించిన ‘రామాయణం’ ఎప్పటికీ ప్రత్యేకమే. పూర్తిస్థాయిలో బాల నటులతో తెరకెక్కించడమే ఇందుకు కారణం.
ఇంటర్నెట్ డెస్క్: రామాయణం నేపథ్యంతో ఎన్ని సినిమాలొచ్చినా గుణశేఖర్ తెరకెక్కించిన ‘రామాయణం’ ఎప్పటికీ ప్రత్యేకమే. పూర్తిస్థాయిలో బాల నటులతో తెరకెక్కించడమే ఇందుకు కారణం. జూనియర్ ఎన్టీఆర్.. బాల రాముడిగా నటించిన ఈ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు గుణశేఖర్.
‘‘శబ్దాలయ థియేటర్స్ పతాకంపై ఎం.ఎస్. రెడ్డిగారు నా దర్శకత్వంలో నిర్మించిన రామాయణం చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా మీ ముందుకురావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో చాలామంది పిల్లలు బాల నటులుగా పరిచయమయ్యారు. వారికి, ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడం ఎంతో ప్రోత్సాహనిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక గాథ ‘శాకుంతలం’తో మీ ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని గుణశేఖర్ తెలిపారు.
1997లో విడుదలైన ఈ చిత్రం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. సీతగా స్మితమాధవ్, రావణుడిగా స్వాతికుమార్, లక్ష్మణుడిగా నారాయణమ్ నిఖిల్ కీలక పాత్రల్లో కనిపించారు. మాధవపెద్ది సురేశ్, వైద్యనాథన్ సంగీతం అందించారు.
సెట్స్లో గోలగోల
ఎన్టీఆర్.. తెరవెనక విపరీతమైన అల్లరి చేసేవాడట. ఎన్టీఆర్ సహా ఇతర బాల నటులందరినీ నియంత్రించడం చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారేదట. శివ ధనుర్భంగం సన్నివేశం కోసం దర్శకుడు ఓ విల్లును టేకుతో ప్రత్యేకంగా తయారు చేయించారు. చాలా బరువు ఉండటంతో కొందరు దాన్ని పైకెత్తే సాహసం కూడా చేయలేదట. ఎన్టీఆర్ బలవంతంగా పైకెత్తి బ్యాలెన్స్ చేయలేక కిందపడేయటంతో అది విరిగిపోయింది. అంతే.. తారక్పై గుణశేఖర్ కోప్పడ్డారు. దాంతో ‘ఇక నేను సినిమా చేయను. వెళ్లిపోతా’ అని అప్పుడు ఎన్టీఆర్ గోల చేశారట. మరోవైపు, అన్నపూర్ణ స్టూడియోస్లో వానర సైన్యంపై సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆ గెటప్లో ఉన్న పిల్లల తోకలు లాగేవాడట తారక్. రాముడి వేషంలో వారిని బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట. అలాంటి చిలిపి ఎన్టీఆర్.. ఇప్పుడు ఎంతటి స్టార్ అయ్యాడో తెలిసిన విషయమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు.