అంధాధున్‌ రీమేక్‌.. వివాదంపై నటి స్పందన

ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అంధాధున్‌’. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌లో హిట్ టాక్‌ అందుకుంది. ఈ క్రమంలోనే ‘అంధాధున్‌’...

Published : 12 Mar 2021 01:05 IST

ఇప్పుడు అందులో నేను భాగం కాదు..!

తిరువనంతపురం: ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అంధాధున్‌’. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌లో హిట్ టాక్‌ అందుకుంది. ఈ క్రమంలోనే ‘అంధాధున్‌’ చిత్రాన్ని త్వరలో మలయాళంలోకి రీమేక్ చేయనున్నారు. పృథ్వీరాజ్‌ హీరోగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అహానా కృష్ణ ఇందులో నటించనున్నారంటూ చిత్రబృందం ఓ సమయంలో అధికారికంగా ప్రకటించింది. కాగా, కొన్ని అనివార్య కారణాల వల్ల అహానా కృష్ణను ఈ సినిమా నుంచి తప్పిస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా ఆమెను తొలగించడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని చెప్పుకొచ్చింది.

‘అంధాధున్‌’ రీమేక్‌ కాంట్రవర్సీ గురించి తాజాగా నటి అహానా స్పందించారు. ‘ఈ వార్తల నుంచి నన్ను దూరంగా ఉంచండి. ఇకపై నేను ఆ సినిమాలో భాగం కాదు. ఈ విషయమై నేను ఎవర్నీ నిందించాలనుకోవడం లేదు. నా గురించి ఎవరు ఏమనుకున్నా అది వాళ్ల అభిప్రాయానికే వదిలేస్తా. ఈ డ్రామా వల్ల నాకు వచ్చేది ఏం లేదు.’’ అని అహానా స్పందించారు. మరోవైపు, రాజకీయ కారణాల వల్ల తన కుమార్తె అహానాను ‘అంధాధున్‌’ రీమేక్‌ నుంచి తొలగించారని  హీరోయిన్‌ తండ్రి కృష్ణకుమార్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. తాను భాజపాలోకి చేరడం వల్లనే తన కుమార్తెను సినిమా నుంచి తొలగించారని ఆయన ఆరోపణలు చేశారు. కాగా, కృష్ణకుమార్‌ చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ చిత్రబృందం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని