Anushka Shetty: అనుష్క అభిమానులకు నిరాశ.. సారీ చెప్పిన నిర్మాణ సంస్థ

అనుష్క (Anushka) అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆమె నటిస్తోన్న సరికొత్త చిత్రం వాయిదా పడింది.

Updated : 29 Jul 2023 14:16 IST

హైదరాబాద్‌: మూడేళ్ల విరామం తర్వాత అగ్ర కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty) నటిస్తోన్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty ). యువ నటుడు నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహేష్‌బాబు.పి దర్శకుడు. ఈ ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కోసం అనుష్క అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ముందు అనుకున్న విధంగా ఆగస్టు 4న ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని తెలిపింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాకపోవడం వల్ల రిలీజ్‌ వాయిదా వేయాల్సి వస్తోందని.. కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. అంతేకాకుండా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పింది.

అది నయనతార వ్యక్తిగత విషయం.. మేం ఇబ్బంది పెట్టం: విశాల్‌

‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రమిదే. ఇందులో ఆమె.. నేటితరం యువతను ఆకట్టుకునే పాత్రలో యాక్ట్‌ చేశారు. ‘జాతిరత్నాలు’తో గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పోలిశెట్టి.. అనుష్కకు జోడీగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పాటలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని