Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. 

Published : 16 Mar 2024 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శివ కందుకూరి కథానాయకుడిగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా (bhoothaddam bhaskar narayana ott) స్ట్రీమింగ్‌ కానుంది. ‘‘బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ చూసేయండి’ అంటూ ఆహా ఓ పోస్టర్‌ విడుదలచేసింది. రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌ కీలకపాత్రలు పోషించారు.

అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్‌ ఎంట్రీ సంగతులివీ..

ఈ భాస్కర్‌ నారాయణ క‌థేంటంటే: పోలీసు యంత్రాంగానికి స‌వాల్‌గా మారతాయి దిష్టి బొమ్మ హ‌త్య‌లు. దారుణంగా మ‌హిళ‌ల్ని హ‌త్య చేయ‌డం, త‌ల స్థానంలో దిష్టిబొమ్మ‌ని పెట్టి అడ‌వుల్లో మృత‌దేహాన్ని వ‌దిలి వెళ్లిపోవ‌డం. అలా 18 ఏళ్ల కాలంలో 17 హ‌త్య‌లు చోటు చేసుకుంటాయి. క‌ర్ణాట‌క‌, ఆంధ్రా స‌రిహ‌ద్దులో జరిగే ఈ హ‌త్యలు ఓ సైకో కిల్ల‌ర్ చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తారు. కానీ, ఎంత ప‌రిశోధించినా ఒక్క ఆధారమూ దొర‌క‌దు. ఈ కేస్‌ని పరిష్కరించడం కోసం రంగంలోకి దిగుతాడు డిటెక్టివ్‌ భాస్క‌ర్ నారాయ‌ణ (శివ కందుకూరి). ఎలాంటి ఆధారాలు దొర‌క్కుండా చేస్తున్న ఆ హ‌త్య‌లు అత‌నికీ స‌వాల్‌గా మార‌తాయి. కానీ, చివ‌రికి అవి హ‌త్య‌లు కాదు, నర బ‌లులు అనే విషయాన్ని ప‌సిగ‌డ‌తాడు. ఇంత‌కీ అలా మ‌హిళ‌ల్ని బ‌లి ఇస్తున్న‌ది ఎవ‌రు?త‌ల స్థానంలో దిష్టి బొమ్మ‌లు పెట్ట‌డానికి కారణమేంటి? ఈ కేస్‌ని భాస్క‌ర్ నారాయ‌ణ ఎలా క్లోజ్ చేశాడు?డిటెక్టివ్ కావాలన్న అతడి కల నిజమైందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని