Rakul Preet Singh: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. నటి రకుల్‌ప్రీత్‌కు మరోసారి ఈడీ నోటీసులు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)నోటీసులు జారీ చేసింది.

Updated : 16 Dec 2022 15:40 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్‌ 3న  రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్‌ వెళ్లిపోయారు. దీంతో ఈడీ అధికారులు ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా ఈడీ అధికారులు రకుల్‌కు నోటీసులు జారీ చేశారు. 

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై 2017 జులైలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్‌ ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులును విచారించారు. గతేడాది సెప్టెంబర్‌లో మనీలాండరింగ్‌ కింద ఈ కేసులో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు పలువురికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు. ఈడీ విచారణకు పూరీ జగన్నాథ్‌, రవితేజ, ఛార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రానా దగ్గుబాటి, ముమైత్‌ఖాన్‌, నందు, తనీష్‌, నవదీప్‌తో పాటు పబ్‌ మేనేజర్‌, రవితేజ డ్రైవర్‌లు హాజరయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని