మహేశ్‌ డ్యాన్స్‌ అదరగొట్టింది ఈ పాటలోనే..!

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘మైండ్‌ బ్లాక్‌..’ పాట ప్రోమో విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా.. మహేశ్‌ హుషారుగా స్టెప్పులేస్తున్న ఈ వీడియోను విడుదల చేశారు. ఆయన సరసన రష్మిక చిందేశారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల....

Published : 14 Jan 2020 21:39 IST

ప్రోమో విడుదల చేసిన చిత్ర బృందం

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘మైండ్‌ బ్లాక్‌..’ పాట ప్రోమో విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా.. మహేశ్‌ హుషారుగా స్టెప్పులేస్తున్న ఈ వీడియోను విడుదల చేశారు. ఆయన సరసన రష్మిక చిందేశారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఈ పాటలో సూపర్‌స్టార్‌ డ్యాన్స్‌ చూసి అందరూ మెచ్చుకున్నారు. ఇంత వరకు తన డ్యాన్స్‌కు ఇలాంటి ప్రశంసలు రాలేదని మహేశ్‌ సైతం ఆనందం వ్యక్తం చేశారు. మహేశ్‌ లుంగీ కట్టుకుని, మాస్‌లుక్‌లో అలరించారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.103 కోట్లకుపైగా రాబట్టిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా విజయశాంతి-ప్రకాశ్‌రాజ్‌తో కూడిన డైలాగ్‌ ప్రోమోను విడుదల చేసింది.


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని