మాళవిక ప్రేమలో రాజ్‌తరుణ్‌..!

‘కుమారి 21ఎఫ్‌’తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు రాజ్‌తరుణ్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌కు జంటగా మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ నటిస్తున్నారు....

Updated : 07 Dec 2022 14:45 IST

వరుణ్‌తేజ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: ‘కుమారి 21ఎఫ్‌’తో విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు రాజ్‌తరుణ్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌కు జంటగా మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ నటిస్తున్నారు. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఈ సినిమా నుంచి ‘కురిసేనా, కురిసేనా’ అంటూ సాగే ఓ మెలోడి పాటను వరుణ్‌తేజ్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన వరుణ్‌ ‘ఓరేయ్‌ బుజ్జిగా’ చిత్రబృందానికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.

అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలోని మొదటిపాట ‘కురిసేనా కురిసేనా’ను అర్మాన్‌ మాలిక్‌, మేఘన ఆలపించారు. రాజ్‌తరుణ్‌-మాళవిక మధ్య ప్రేమను తెలియజేస్తూ ఈ పాటను చిత్రీకరించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని