నేను ఒంటరినే : నిధి

తెలుగులో ‘సవ్యసాచి’తో చిత్రంతో కథానాయికగా తెలుగులో ప్రవేశించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.  ఆ తర్వాత ‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాల్లో నటించి అలరించారు.

Published : 01 Mar 2021 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగులో ‘సవ్యసాచి’తో చిత్రంతో కథానాయికగా ప్రవేశించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.  ఆ తర్వాత ‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాల్లో నటించారు. నిధి అగర్వాల్‌ ఎవరితోనో డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు.

‘‘కాల్‌ చేయడానికి.. మెసేజ్‌లు పంపడానికి నాకెవరూ లేరు. కొన్నిసార్లు నేనే ఖాళీగా కూర్చోని ఫోన్లలో ఇతరులను చూస్తుంటా. కొన్ని సందర్భాల్లో నడుస్తూనే మా మేనేజర్‌కు మెసేజ్‌లు చేస్తుంటా. నేను స్నేహితులతో కలిసి బయటకు విందుకు వెళ్లాలనుకున్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటా. ఎక్కడికి వెళ్లాలనేది స్నేహితుల ఇష్టానికే వదిలేస్తా. ప్రస్తుతం ఒంటిరిగానే ఉన్నా. ఈ ప్రయాణం నాన్‌స్టాప్‌గా సాగిపోతోంది. ఒంటరిగా నా ప్రయాణం బాగుంది.. ఎవరైనా జీవితంలోకి వచ్చినా బాగానే ఉంటుంది’’ అంటూ తెలిపింది.

ఈ మధ్యే తమిళనాడులో నిధి అగర్వాల్‌కు విగ్రహం చేయించి, దానికి పాలాభిషేకాలు కూడా చేశారు అక్కడి అభిమానులు. తమిళంలో ‘భూమి’, ‘ఈశ్వరన్‌’ సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం సంపాదించింది. ప్రస్తుతం తెలుగులో పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని