KH234: కమల్‌ హాసన్‌ కొత్త సినిమా టైటిల్‌ ఇదే.. భారీ తారాగణాన్ని ప్రకటించిన టీమ్‌

కమల్ హాసన్ కొత్త చిత్రం (#KH234) టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఇందులోని నటీనటుల వివరాలను కూడా టీమ్‌ వెల్లడించింది.

Published : 06 Nov 2023 18:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మణిరత్నం (Mani Ratnam)- కమల్‌ హాసన్‌ (Kamal Haasan)కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్‌ కానుండడంతో ప్రేక్షకులంతా దీనిపై అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలోని కమల్‌ హాసన్ ఫస్ట్ లుక్‌ను రివీల్‌ చేసిన టీమ్‌ వాటిని రెట్టింపు చేసింది. అలాగే నవంబర్‌ 7 కమల్ హాసన్‌ పుట్టినరోజు సందర్భంగా దీని టైటిల్‌ను కూడా ఎనౌన్స్‌ చేసింది. ఈ మూవీకి ‘థగ్‌ లైఫ్‌’ (ThugLife)అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను నిర్మాణసంస్థ పంచుకుంది. గతంలో ‘థగ్స్‌ ఆఫ్ హిందూస్థాన్‌’ పేరుతో బాలీవుడ్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ చిత్రం వచ్చింది. మరి మణిరత్నం కూడా ఇదే కాన్సెప్ట్‌ను తన స్టైల్‌లో రూపొందిస్తారా లేదంటే సరికొత్త కథాంశంతో రానున్నారా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో  అనేకమంది స్టార్‌ నటీనటులు అలరించనున్నారు. హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. కీలకపాత్రల్లో మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), జయం రవి కనిపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయంపై త్రిష (Trisha) ట్వీట్ చేస్తూ.. ‘కలలు చాలా సార్లు నెరవేరినప్పుడు ఎంతో అదృష్టవంతులమని అనిపిస్తుంది. #KH234లో భాగం కావడం కమల్ హాసన్‌, మణిరత్నంలతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. యూనివర్స్‌కు థ్యాంక్స్‌ చెప్పాలని ఉంది’ అంటూ తన పోస్టర్‌ను షేర్‌ చేశారు.

రష్మిక మార్ఫింగ్‌ వీడియో వైరల్‌.. తీవ్రంగా స్పందించిన కేంద్ర ఐటీ శాఖ

మణిరత్నం, కమల్‌ హాసన్‌ల కాంబోలో తెరకెక్కి సూపర్‌ హిట్ అయిన చిత్రం ‘నాయకన్‌’. ఓ గ్యాంగ్‌స్టర్‌ జీవితాధారంగా రూపొందిన ఆ సినిమా 1987లో విడుదలై, ఘన విజయం అందుకుంది. మళ్లీ ఇప్పుడు ఈ కాంబో రిపీట్‌ కానుండడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. కమల్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’లో నటిస్తున్నారు. శంకర్‌ దర్శత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన దీని ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని