Major: నాకంత స్వార్థం లేదు.. అందుకే నాన్న బయోపిక్ చేయను: మహేశ్బాబు
ప్రముఖ నటుడు మహేశ్బాబు నిర్మాతగా మారి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మేజర్’. ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కగా.. యువ నటుడు అడివి శేష్ హీరోగా నటించాడు.
హైదరాబాద్: ప్రముఖ నటుడు మహేశ్బాబు నిర్మాతగా మారి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మేజర్’. ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కగా.. యువ నటుడు అడివి శేష్ హీరోగా నటించాడు. శోభిత, సయీ మంజ్రేకర్, ప్రకాశ్రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం ‘ట్రైలర్ లాంచ్’ ఈవెంట్ను నిర్వహించారు. మహేశ్ అతిథిగా హాజరై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వేడుకనుద్దేశించి మహేశ్ మాట్లాడుతూ.. ‘‘నిన్ననే నేను ‘మేజర్’ సినిమా చూశా. కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. సినిమాలోని ఆఖరి 30 నిమిషాల ఎపిసోడ్కు నా గొంతు ఎండిపోయింది. అంత భావోద్వేగంగా ఉందా ట్రాక్. కాసేపటి వరకు ఏం మాట్లాడలేకపోయా. బయోపిక్ తెరకెక్కించడమనేది బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు చిత్ర బృందానికి నా అభినందనలు. వీరితో భాగమైనందుకు రెండేళ్లుగా నాకు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నారు. ఇంతటి మంచి చిత్రాన్ని అందిస్తున్నందుకు ఇప్పుడు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రిస్క్ చేస్తున్నా అని కొందరు అనుకుంటున్నారు కానీ, నేను అసలు రిస్క్ తీసుకోను. నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బ్లస్టరే. ఈ సినిమా కూడా అంతే’’ అని మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అందుకే మూడు భాషల్లో..
‘‘మనందరిలానే సందీప్ జీవితం కూడా చాలా సాధారణంగా ఉండేది. అలాంటి ఆయన.. అసాధారణ వ్యక్తిగా ఎలా మారారన్నది ‘మేజర్’లో చూపించాం. సందీప్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవాలన్నదే ఆయన పేరేంట్స్ కోరిక. అది ఈ చిత్రంతో నెరవేరుతుంది. మార్కెట్ కోసం ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నామని చాలామంది ఊహించుకున్నారు. కానీ, మేం అందుకు చేయలేదు. సందీప్ ఈ దేశ ముద్దుబిడ్డ. తన మాతృభాష మలయాళం కాబట్టి అందులో డబ్ చేశాం, మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగులో తెరకెక్కించాం, ఎక్కువమందికి చేరాలన్న సంకల్పంతో హిందీలోనూ విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు మహేశ్ వెన్నెముకలా నిలిచారు. గుండెను హత్తకునే సంభాషణలు అందించిన అబ్బూరి రవికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని శేష్ పేర్కొన్నారు.
శేష్ గురించి ఓ పుస్తకం రాయొచ్చు
‘‘శేష్ 2018లో మేజర్ జీవితాధారంగా ఓ సినిమా చేయాలనుందన్నాడు. ఇలాంటి గొప్ప కథను ఎలా అయినా తెరకెక్కించాలని అప్పుడే ఫిక్స్ అయ్యా. మహేశ్, నమ్రత మా వెన్నంటే ఉండటం మాకు ధైర్యానిచ్చింది. శేష్తో ఇది నాకు రెండో సినిమా. తన గురించి ఓ పుస్తకం రాయొచ్చు. అనుకున్నది సాధించాలంటే ఎలా శ్రమించాలో ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. శేష్తోపాటు కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్రాజ్, రేవతి నటన అందరినీ కట్టిపడేస్తుంది’’ అని దర్శకుడు శశి తెలిపారు. అనంతరం, మహేశ్- శేష్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ విశేషాలివీ..
* నటుడిగా మీరు పాన్ ఇండియా సినిమా ప్రయత్నం చేయలేదు. నిర్మాతగా వ్యవహరించడం ఎలా ఉంది?
మహేశ్: అన్నింటికీ కథే సమాధానం. ఈ సినిమాకు నేను నిర్మాతనైనా ఎప్పుడో ఒకసారి సెట్స్కు వెళ్లేవాడిని. నమ్రతనే ఈ ప్రాజెక్టులో ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది. సహ నిర్మాతలు అనురాగ్, శరత్ హీరోగా శేష్ను అనుకుంటున్నామని చెప్పగానే ఆనందించా. తను నటించిన ‘గూఢచారి’ చిత్రం నాకు బాగా ఇష్టం.
* సినిమా చూశాక, ఇందులో మీరు నటించి ఉంటే బాగుండనిపించిందా?
మహేశ్: లేదండీ. కొన్ని కథలు కొందరికే సెట్ అవుతాయి. వాటికి తగిన న్యాయం చేసేవారి దగ్గరకే అవి వెళ్తాయి. ఇలాంటి వాటిని చూసి ఆనందిస్తా తప్ప మనం చేస్తే బాగుండని ఆలోచించేంత సెల్ఫిష్ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి, మిగిలిన వాటిని చూసి ఎంజాయ్ అని అనుకుంటా అంతే.
* సల్మాన్ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్తో హిందీ, మలయాళ ట్రైలర్లు విడుదల చేయించడం గురించి..
మహేశ్: ఇది అడివి శేష్ ఆలోచన. ఆయా ఇండస్ట్రీల సూపర్స్టార్లతో విడుదల చేయిస్తే మంచి సినిమా ఎక్కువ మందికి చేరుతుందనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేశాం.
* ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు వచ్చాయి కదా!
మహేశ్: ఈ చిత్రం కోసం పలు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో ఆఫర్లు ఇచ్చాయి. కానీ, మాలో ఎవరికీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనే ఆసక్తి లేదు. కొవిడ్/లాక్డౌన్ కారణంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సోనీ పిక్చర్స్ సంస్థ మాకు అండగా నిలిచింది.
* కృష్ణ బయోపిక్ వచ్చే అవకాశాలున్నాయా?
మహేశ్: ఇంతకుముందుకు చెప్పినట్టు.. నాన్నగారి బయోపిక్ ఎవరైనా తీస్తే చాలా ఆనందంగా చూస్తా (నవ్వుతూ..). నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు.
* సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తీసేందుకు ఆయన తల్లిదండ్రులను ఎలా ఒప్పించారు?
శేష్: సందీప్ ఏం చేశారో చాలామందికి తెలుసు. కానీ, ఆయన ఎలా బతికారో తెలియదు. దాన్నే చూపించాలనుకున్నా. ఆయన గురించి రీసెర్చ్ చేసే క్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఈ సినిమా చూస్తే అందరిలోనూ పాజిటివిటీ వస్తుంది. సందీప్ జీవితాన్ని సినిమాగా మలిచేందుకు ఎంతోమంది ప్రయత్నించారు. కానీ, సాధ్యపడలేదు. ఏడెనిమిది సార్లు వారి తల్లిదండ్రులతో చర్చించి, సినిమా తీసేందుకు అంగీకారం తీసుకున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..