kannappa: మంచు కుటుంబం నుంచి నట వారసుడు.. ‘కన్నప్ప’తో తెరంగేట్రం

ప్రేక్షకులను అలరించేందుకు మంచు ఫ్యామిలీ నుంచి మరో తరం సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ విష్ణు (Manchu vishnu)ట్వీట్‌ చేశారు.

Updated : 05 Jan 2024 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు కుటుంబం నుంచి మరొకరు వెండితెరకు పరిచయమవుతున్నారు. మోహన్‌బాబు మనవడు.. విష్ణు కుమారుడు అవ్రామ్‌ మంచు తెరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని ‘కన్నప్ప’ టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో నెటిజన్లు ‘ఆల్‌ ది బెస్ట్’ చెబుతున్నారు. తన కుమారుడి సినీరంగ ప్రవేశాన్ని ఉద్దేశిస్తూ విష్ణు (Manchu vishnu) పోస్ట్‌ పెట్టారు. ‘‘ఒక కొత్త తరాన్ని వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు ఎంతో థ్రిల్‌గా ఉంది. అవ్రామ్‌ ‘కన్నప్ప’తో సినిమాటిక్‌ యూనివర్స్‌లో అడుగుపెడుతున్నాడు. మా కుటుంబం నుంచి మరో అద్భుతమైన తరం మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైంది. మా కుటుంబ కీర్తిని అవ్రామ్‌ మరింత ముందుకు తీసుకెళ్లనున్నాడు’’ అని రాసుకొచ్చారు.

‘కన్నప్ప’ (kannappa) విషయానికొస్తే.. విష్ణు కలల ప్రాజెక్ట్‌గా ఇది రూపొందుతోంది. ‘మహాభారత్‌’ సిరీస్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ మోడల్ ప్రీతి ముకుందన్‌ ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక ఇందులో ప్రభాస్, నయనతార కనిపించనున్నట్లు మధుబాల తెలిపారు. వీళ్లిద్దరూ శివ పార్వతులుగా నటించనున్నట్లు సమాచారం. స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందమంతా న్యూజిలాండ్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చింది. 90 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో 600మంది హాలీవుడ్‌ నిపుణులు పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని