Naga Chaitanya: థియేటర్‌ ఆర్టిస్ట్‌లతో నాగచైతన్య.. అందుకే అక్కడకు వెళ్లారా?

టాలీవుడ్‌ ప్రముఖ హీరో నాగచైతన్య పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్‌కు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Updated : 02 Aug 2023 20:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్‌ను ప్రముఖ హీరో నాగచైతన్య (Naga Chaitanya) సందర్శించారు. అక్కడి ఆర్టిస్ట్‌లు, డైరెక్టర్లలతో దిగిన ఫొటోలు, ప్రకృతి అందాలను క్యాప్చర్‌ చేసి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అక్కడ చేసిన ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. డైరెక్టర్‌ వినయ్‌ కుమార్‌ తదితరులను ట్యాగ్‌ చేస్తూ మంచి వ్యక్తులు, ఎంతో అందమైన ప్రదేశమిదని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్య ఈ పోస్ట్‌ పెట్టిన కొన్ని క్షణాల్లోనే లక్షకుపైగా లైక్స్‌ వచ్చాయి. 

విశ్వక్‌ను ఎప్పుడూ అవమానించలేదు: వివాదంపై తొలిసారి మాట్లాడిన సాయిరాజేశ్‌

నటనకు సంబంధించిన శిక్షణ ఇవ్వడంలో ఆదిశక్తి థియేటర్‌ పేరుగాంచింది. కొత్తగా నటన నేర్చుకోవాలనుకునేవారితోపాటు కొంత అనుభవం ఉన్న నటులూ అక్కడకు వెళ్తుంటారు. యాక్టింగ్‌ పరంగా మరిన్ని మెలకువలు నేర్చుకునేందుకు నాగచైతన్య అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. ఆయన సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘కస్టడీ’ (Custody) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగచైతన్యకు అనుకున్నంత స్థాయిలో ఫలితం దక్కలేదు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. ‘కార్తికేయ 2’ (Karthikeya 2)తో హిట్‌ కొట్టిన చందూ మొండేటి దర్శకత్వంలో చైతన్య నటించే అవకాశాలున్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని