Namratha: మహేశ్‌.. వాళ్లకు మీరొక ఎమోషన్‌..: నమ్రత ఆసక్తికర పోస్ట్‌

మహేశ్‌బాబు (Mahesh Babu) ఫ్యాన్స్‌పై నమ్రత (Namratha) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 10 Jan 2024 11:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) అభిమానులను ఉద్దేశించి నమ్రత (Namratha) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘‘మహేశ్‌ అభిమానుల గురించి ఇప్పటికే ఎంతోమంది గొప్పగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయన్ని ఆదరిస్తున్నారు. ప్రతి ప్రయత్నంలో అండగా నిలిచి.. మరింత కష్టపడి పనిచేసేందుకు దోహదపడుతున్నారు. (గుంటూరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఉద్దేశించి) గుంటూరులో అభిమానులు చూపించిన ప్రేమను చూసి ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది. మహేశ్‌.. అభిమానులకు మీరొక ఎమోషన్‌. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

Social Look: కొబ్బరి తోటలో పూజాహెగ్డే పోజులు.. చీరలో భూమీ హొయలు

మహేశ్‌ హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్‌లో మా చిత్రం విడుదలైతే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతుంది. కానీ, ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనంద పడేవాడిని. ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన నమ్రత ఈ పోస్ట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని