Tollywood: భ‌య‌పెడుతోన్న ‘ఆర్జీవీ దెయ్యం’

రాజశేఖర్‌, స్వాతి దీక్షిత్‌ ప్రధాన పాత్ర‌ల్లో ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ తెర‌కెక్కించిన‌ చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’.

Updated : 07 Dec 2022 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజశేఖర్‌, స్వాతి దీక్షిత్‌ ప్రధాన పాత్ర‌ల్లో ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ తెర‌కెక్కించిన‌ చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. ఏప్రిల్‌ 16న విడుద‌లై ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ పంచింది. తాజాగా ఈ చిత్రంలోని ఆస‌క్తిక‌ర స‌న్నివేశం ఒక‌టి విడుద‌లైంది. కోర్టు నేప‌థ్యంలో సాగిన ఈ సీన్‌లో స్వాతి దీక్షిత్, రాజ‌శేఖ‌ర్, జెన‌ర్జీ త‌దిత‌రులు క‌నిపించారు. బోనులో నిల్చుని స్వాతి చెప్పిన డైలాగులు, దెయ్యంలా ఆమె ప‌లికించిన హావ‌భావాలు ఆకట్టుకుంటున్నాయి.‘న‌న్ను న‌మ్మని వాళ్ల‌ని చంపడానికే వ‌చ్చా’ అని మ‌గ గొంతుతో సంభాష‌ణ‌లు వినిపించిన తీరు అల‌రిస్తోంది. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ చూసేయండి ఆర్జీవీ దెయ్యాన్ని... 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని