Salman Khan: 25 ఏళ్ల నుంచి ఇంటిబయట డిన్నర్లకు దూరంగా ఉంటున్నా..: సల్మాన్‌ ఖాన్‌

స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఇంటిబయట డిన్నర్లకు వెళ్లడం మానేసినట్లు చెప్పారు. 25 ఏళ్ల నుంచి తన లైఫ్‌ స్టైల్‌ పూర్తిగా మార్చుకున్నట్లు తెలిపారు.

Updated : 24 Nov 2023 13:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘టైగర్‌3’తో తాజాగా సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan). దీని సక్సెస్‌ మీట్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తాను 25 ఏళ్ల నుంచి ఇంటిబయట డిన్నర్లకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ‘‘కొన్ని సంవత్సరాల నుంచి బయట డిన్నర్లకు వెళ్లడం మానేశాను. కేవలం సినిమా షూటింగ్‌లకు, ప్రమోషన్ల కోసం మాత్రమే బయటకు వస్తున్నా. నాకు అవుట్‌ డోర్‌ అంటే ఇంట్లో బాల్కనీలో కూర్చోవడం లేదంటే నా ఫామ్‌హౌస్‌కు వెళ్లడం అంతే. నా ప్రయాణాలంటే ఇల్లు, షూటింగ్‌, హోటల్‌, ఎయిర్‌పోర్టు, లొకేషన్‌, తిరిగి ఇంటికి రావడం, జిమ్‌కు వెళ్లడం. ఇవే నేను చేస్తున్న ప్రయాణాలు. నా కుంటుంబ సభ్యులతో కంటే ఎక్కువగా నా సిబ్బందితోనే గడుపుతున్నా. షాపింగ్‌లకు కూడా వెళ్లడం మానేశాను. ఎప్పుడైనా మా అమ్మ బయటకు తీసుకెళ్లమంటే దగ్గర్లో ఉన్న హోటల్‌ లేదా కాఫీషాప్‌నకు తీసుకెళ్తున్నాను’ అని చెప్పారు.

రివ్యూ: ఆదికేశవ.. వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది?

ఇక ‘టైగర్‌’ చిత్రం గురించి మాట్లాడుతూ తనకు ఆ స్టోరీ చెప్పిన సమయంతో సహా గుర్తుందన్నారు. ‘2012లో ‘ఏక్తా టైగర్‌’ సినిమా కథను దర్శకుడు మధ్యాహ్నం సమయంలో చెప్పారు. నాకెంతో నచ్చి వెంటనే అంగీకరించాను. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌లో అదే నా తొలి చిత్రం. ఇప్పటికి కూడా నేను సూపర్‌ స్టార్‌ అని అనుకోవడం లేదు. నాకు వచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేయగలుగుతున్నానా లేదా అన్నదే చూస్తాను. అలాగే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో చేయడానికి కూడా నేనేం ఆలోచించను. ప్రేక్షకులకు వినోదం అందించడమే నా లక్ష్యం’ అన్నారు. ఇక సల్మాన్ తాజా చిత్రం ‘టైగర్‌3’ (Tiger3) మంచి వసూళ్లను సాధిస్తోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.400 కోట్లు వసూళ్లను రాబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని