నటి కవిత ఇంట్లో మరో విషాదం

సీనియర్‌ నటి కవిత ఇంట్లో మరో విషాదం నెలకొంది. కొవిడ్‌తో పోరాడుతూ ఆమె భర్త దశరథ రాజు మరణించారు.

Published : 30 Jun 2021 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్‌ నటి కవిత ఇంట్లో మరో విషాదం నెలకొంది. కొవిడ్‌తో పోరాడుతూ ఆమె భర్త దశరథ రాజు మరణించారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితమే కుమారుడు సంజయ్‌ రూప్‌ సైతం కరోనాతో పోరాడుతూ మృతిచెందారు. దశరథ రాజు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాలనటిగా వెండితెరకు పరిచయమైన కవిత దాదాపు 350 చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోనూ తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపైనా తన సత్తా చాటారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు