Chiranjeevi: ‘విశ్వంభర’లో హీరోయిన్ ఫిక్స్‌.. 18 ఏళ్ల తర్వాత మెరవనున్న జోడి..

చిరంజీవి-వశిష్ఠ కాంబోలో రానున్న ‘విశ్వంభర’లో హీరోయిన్‌ను ఖరారు చేశారు.

Published : 05 Feb 2024 12:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’ (Viswambhara). గతేడాది దసరా రోజు ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌ను టీమ్ అధికారికంగా ప్రకటించింది. చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వచ్చాయి. వాటికి చెక్‌ పెడుతూ స్టార్ హీరోయిన్ త్రిషను (trisha) ఖరారు చేసింది చిత్రబృందం. ఆమె ‘విశ్వంభర’ సెట్‌లోకి అడుగుపెడుతోన్న వీడియోను పంచుకొని నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని కన్ఫామ్‌ చేసింది. 

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే..!

2006లో విడుదలైన ‘స్టాలిన్‌’లో చిరు-త్రిషల జోడి వినోదాన్ని పంచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించనున్నారు. దీంతో మెగా అభిమానులు సంబర పడుతున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఇది ముస్తాబవుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతోంది. దీని కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది. దీనితో పాటు చిరంజీవి తన కుమార్తె సొంత నిర్మాణ సంస్థ ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’పై 157వ సినిమా చేయనున్నారు. అలాగే హరీశ్‌ శంకర్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు