Rashmika: మాస్క్‌ తీయను.. ఫేస్‌ చూస్తే భయపడతారు.. సారీ చెప్పిన రష్మిక

వెకేషన్‌ పూర్తి చేసుకుని ముంబయికి తిరిగి వచ్చారు కథానాయిక రష్మిక. ఎయిర్‌పోర్ట్‌లో ఆమె విలేకర్లతో సరదాగా మాట్లాడారు. 

Updated : 12 Oct 2022 15:33 IST

ముంబయి: నాలుగు రోజుల పాటు మాల్దీవుల్లో సేద తీరి తిరిగి ముంబయికి చేరుకున్నారు నటి రష్మిక (Rashmika). ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూసిన ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. ‘‘మేడమ్‌ ఎలా ఉన్నారు? దయచేసి ఒక్కసారి మాస్క్‌ తీయండి. ఫొటోలు తీసుకుంటాం’’ అని కోరగా.. రష్మిక సున్నితంగా తిరస్కరించింది. ‘‘క్షమించండి నేను మాస్క్‌ తీయలేను. శరీరం నల్లగా మారిపోయింది. ఇప్పుడు మాస్క్‌ తీస్తే మీరందరూ భయపడతారు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చింది. ‘‘మీరు కారులోకి వెళ్లే ముందైనా ఒక్కసారి మాస్క్‌ తీయండి’’ అని అడగ్గా.. ‘‘సారీ.. ఏం అనుకోకండి’’ అని బదులిచ్చి రష్మిక అక్కడి నుంచి వెళ్లిపోయింది.

బాలీవుడ్‌, టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న రష్మిక చిన్న విరామం తీసుకుని టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. మాల్దీవుల టూర్‌లో భాగంగా సముద్రం, ప్రకృతి అందాలకు మైమరచిపోయిన ఆమె.. ఆ ప్రాంతానికి బై చెప్పడం కష్టంగా ఉందని మంగళవారం ఉదయం పోస్ట్‌ పెట్టారు. అయితే, ఈ టూర్‌లో రష్మికతోపాటు నటుడు విజయ్‌ దేవరకొండ సైతం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. శుక్రవారం టూర్‌కు వెళ్లే ముందు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం ఈ వార్తలకు ఆజ్యం పోసింది. ఇక, మాల్దీవుల నుంచి తిరిగి వచ్చిన సమయంలోనూ రష్మిక కంటే ముందు ఎయిర్‌పోర్ట్‌ నుంచి విజయ్‌ దేవరకొండే బయటకు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని