అలాగైతే నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ
బిహార్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను బోల్తా కొట్టించేందుకు రాజకీయ పార్టీలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తనపై హత్యారోపణలు చేస్తు్న్నారని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ మండిపడ్డారు. దళిత నేత శక్తి మాలిక్ హత్య కేసులో తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తు్న్నారని అన్నారు. నేరం చేశానని భావిస్తే...
పట్నా: బిహార్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించేందుకు రాజకీయ పార్టీలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తనపై హత్యారోపణలు చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ మండిపడ్డారు. దళిత నేత శక్తి మాలిక్ హత్య కేసులో తనను కావాలనే ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నేరం చేశానని భావిస్తే అరెస్టు చేయాలి, లేదంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అంతేగానీ, ఎన్నికల వేళ నిరాధార ఆరోపణలు చేస్తూ.. దొంగదెబ్బ తీయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు ఘాటుగా లేఖ రాశారు.
తాజా ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ప్రతిక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన దళిత నేత శక్తిమాలిక్ హత్యకేసుతో తేజస్వి యాదవ్కు, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు సంబంధాలున్నాయని వార్తలొచ్చాయి. మాలిక్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఇప్పటికే ఏడుగుర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గత ఆదివారం ద్విచక్రవాహంపై వచ్చి ఇంట్లో చొరబడి నిద్రిస్తున్న మాలిక్ను హత్య చేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త స్వతంత్రంగా పోటీ చేస్తారనే భయంతోనే ఆర్జేడీ నేతలు హత్య చేయించారని మాలిక్ భార్య ఆరోపిస్తున్నారు. అయితే హత్య వెనక దీనికి సంబంధించి తేజస్వీ, తేజ్ ప్రతాప్ హస్తం ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పూర్ణియా జిల్లా ఎస్పీ విశాల్ శర్మ వెల్లడించారు. శక్తి మాలిక్ స్థానికంగా కొందరికి అప్పులిచ్చేవాడని, తిరిగి వాళ్లు చెల్లించలేకపోతే దౌర్జన్యానికి పాల్పడేవాడని, ఈ క్రమంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు శక్తి మాలిక్ ఇటీవల ఓ వీడియోను విడుదల చేశారు. తమ పార్టీ తరఫున పోటీ చేయాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారని ఆ వీడియోలో ఆరోపించారు. ఆర్జేడీ నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఇలా జరిగిన కొన్నాళ్లకే మాలిక్ హత్యకు గురికావడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. దీంతో అధికార జేడీయూ దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. అయితే, ఈ హత్యతో తమకు ఎటువంటి సంబంధం లేదని, అవసరమైతే చట్టం తన పనిని తాను చేసుకోవచ్చని ఆర్జేడీ వాదిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిస్తే.. బాలీవుడ్కు వీడ్కోలు!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ప్రదేశ్లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బెంగాల్లో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్లను దుండగులు చెరిపి వేశారు. -
రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస
రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. -
విపక్ష నేతలంతా రావణుడి అనుచరులే..
విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మండిపడ్డారు. -
ఆమ్ఆద్మీ పార్టీ అంతానికి ‘ఆపరేషన్ ఝాడూ’
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ముప్పుగా భావిస్తున్న భాజపా తమ పార్టీని అణచేసేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. -
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపా సోషల్మీడియా విభాగంపై కేసు
వైకాపా సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. -
పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
సూత్రధారులపై చర్యలు తీసుకోండి
తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్ అధికారులను కోరారు. -
అప్పుడు లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చింది?: తెదేపా
విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలట్ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. -
పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు. -
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్ఛైర్మన్ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
మమత గురించి ఖర్గే చెప్పినా వినను: అధీర్
మమతా బెనర్జీ విషయంలో సంయమనం పాటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చెబుతున్నా అంగీకరించేది లేదని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి తేల్చిచెప్పారు. -
పెద్దలను మోదీ అలా అనొచ్చా!
లోక్సభ ఎన్నికల తరవాత విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందులోని మిత్రపక్షమైన ఆప్ దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు యత్నిస్తుందని భాజపా ఆందోళనలో ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
సుస్థిర విధానాలతో సుసంపన్న భారత్
ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే దేశ ఆర్థిక రంగం ఒడుదొడుకులకు గురవుతుందని, స్టాక్ మార్కెట్లు పతనమవుతాయంటూ భాజపా నేతలు మదుపరుల్లో భయాందోళనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. -
రాహుల్, అఖిలేశ్ సభలో తొక్కిసలాట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. -
రాహుల్ నోట మావోయిస్టుల భాష.. వాళ్లొస్తే పెట్టుబడులు రావు
బలవంతపు ధన సమీకరణ వంటి కొత్త పద్ధతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ యువరాజు (రాహుల్గాంధీని ఉద్దేశించి) మావోయిస్టుల భాష వింటే ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. -
‘కళింగ’ కదన కుతూహలం!
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కళింగ గడ్డ ఒడిశాలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. నేడు 5 లోక్సభ సీట్లు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న బదిలీలు.. వివక్షపూరితంగా జరుగుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..