LS Polls: అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం.. భాజపా, కాంగ్రెస్‌లు కీలక భేటీలు

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాజపా, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మరోసారి వేర్వేరుగా సమావేశమయ్యారు.

Published : 11 Mar 2024 23:43 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తోన్న నేపథ్యంలో భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress)లు అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో వేగం పెంచాయి. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఈ పార్టీల నేతలు.. సోమవారం మరోసారి సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలో సమావేశమైన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ (CEC).. తాజా చర్చల్లో ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా సహా ఆయా రాష్ట్రాల్లోని స్థానాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

సమావేశానికి ముందు హరియాణా ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత దుష్యంత్ చౌతాలా.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 10 ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళంతో జేజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా.. భాజపా మొదటి విడత జాబితాలో 16 రాష్ట్రాల్లో 195 సీట్లకుగానూ అభ్యర్థులను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ నుంచి భోజ్‌పురి గాయకుడు పవన్‌ సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ నుంచి ఉపేంద్ర రావత్‌లు బరిలో నిలిచేందుకు నిరాకరించారు.

సీట్ల కేటాయింపు.. చంద్రబాబు నివాసంలో కీలక భేటీ

మరోవైపు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించిన సీఈసీ సమావేశంలో తొలుత ఉత్తరాఖండ్‌లోని ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సోనియా గాంధీతో పాటు కుమారి సెల్జా తదితర నేతలు హాజరయ్యారు. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను హస్తం పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని