రైలు టికెట్లకూ డబ్బుల్లేవ్
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి ఆర్థికంగా నిర్వీర్యం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ అగ్రనేతలు ఆరోపించారు.
మా పార్టీ బ్యాంకు ఖాతాలను కావాలనే స్తంభింపజేశారు
సోనియా, రాహుల్, ఖర్గే ఆరోపణ
ఈనాడు, దిల్లీ: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి ఆర్థికంగా నిర్వీర్యం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ అగ్రనేతలు ఆరోపించారు. దశాబ్దాల క్రితంనాటి ఆదాయపు పన్ను రిటర్నుల వివాదంలో నోటీసులిచ్చి, వెంటనే స్తంభింపజేసిన ఖాతాలను సత్వరం తమకు అప్పగించాలని పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ ఉమ్మడిగా డిమాండ్ చేశారు. గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వారు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభన, ఎన్నికల బాండ్ల అంశాలపై మాట్లాడారు. తమ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలవేళ డబ్బుల్లేక ప్రచారంలో సమానావకాశాలు కోల్పోతామని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా దేశంలో కోర్టులు, ఎన్నికల సంఘం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడం అబద్ధమని, మనదేశంలో ప్రజాస్వామ్యమే లేదని రాహుల్గాంధీ ధ్వజమెత్తారు.
రెండు రూపాయలైనా ఖర్చుచేయలేకపోతున్నాం
‘‘కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా నేరపూరిత చర్యకు పాల్పడుతున్నారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలు పనిచేయకపోతే ఎలాంటి లావాదేవీలు చేయలేం. ఎన్నికల ప్రచార ప్రకటనలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ప్రచారం కోసం మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు పక్కనబెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవు’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ‘‘ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేయడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని నిలువరించడమే. దేశంలో ప్రజాస్వామ్యమనేదే లేకుండా పోయింది. 20% ఓటర్లు మాకు మద్దతుగా ఉన్నా మేం రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం. వ్యక్తుల బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డులను రద్దుచేస్తే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపార సంస్థకు ఇలా జరిగితే అది మూతపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్కు అదే జరిగింది. ఎన్నికల్లో పోరాడకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు’’ అని రాహుల్ వివరించారు.
ఆర్థికంగా దెబ్బతీసేందుకేనన్న సోనియా
తొలుత సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘ఓవైపు ఎన్నికల బాండ్ల వ్యవహారం.. మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడి జరుగుతోంది. ఇన్ని సవాళ్ల నడుమ ఎన్నికల్లో మేం సమర్థంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజల నుంచి వసూలుచేసిన విరాళాలను స్తంభింపజేసి మా ఖాతాల్లో ఉన్న డబ్బును బలవంతంగా తీసేసుకున్నారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితులున్నప్పటికీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఎన్నికల బాండ్ల ద్వారా భారీగా లబ్ధిపొందిన భాజపా మమ్మల్ని ఆర్థికంగా దెబ్బకొట్టడానికి కుట్రపన్నింది. ఇది పూర్తి అప్రజాస్వామికం’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
భాజపా డబ్బుకు లెక్కాపత్రం లేదు: ఖర్గే
‘ఎన్నికల బాండ్ల ద్వారా భాజపా 56% నిధులను చేజిక్కించుకొంది. కాంగ్రెస్కు 11% మాత్రమే దక్కాయి. బాండ్ల నిధులతోపాటు, భాజపాకు నగదు కూడా వచ్చింది. దానికి లెక్కాపత్రం లేదు. ప్రింట్, టీవీ, సామాజిక మాధ్యమాల్లో వారి ఆధిపత్యం కొనసాగుతోంది. ఇంత భారీ మొత్తం విరాళాలను ఒక పార్టీ చేజిక్కించుకోవడం ప్రజాస్వామ్య చర్రితలో ఇదే తొలిసారి. ఐటీ రిటర్నుల వివాదం కోర్టులో తేలుతుంది. అంతవరకు ఐటీ విభాగం వేచిచూడాలి. రాజకీయ పార్టీలు పన్ను చెల్లించవు. దేశంలో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేలా ఎన్నికల్లో సమానావకాశాలు కల్పించాలి’ అని ఖర్గే డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్