లక్షల మెజారిటీతో గెలిచినా దక్కని సీట్లు
ఉత్తర భారత దేశంలో బలంగా కనిపిస్తున్నప్పటికీ సిట్టింగ్లను భారీ సంఖ్యలో భాజపా మార్చింది. 2019 ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులనూ వివిధ కారణాలతో పక్కనబెట్టింది.
విజయావకాశాలే ప్రాతిపదికగా భాజపాలో టికెట్లు
పార్టీకి చేటు తెచ్చే మాటలు, చేతలకు చెల్లుచీటీ
ఈనాడు, దిల్లీ: ఉత్తర భారత దేశంలో బలంగా కనిపిస్తున్నప్పటికీ సిట్టింగ్లను భారీ సంఖ్యలో భాజపా మార్చింది. 2019 ఎన్నికల్లో లక్షల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులనూ వివిధ కారణాలతో పక్కనబెట్టింది. గత ఎన్నికల్లో లక్ష నుంచి 6 లక్షల వరకూ మెజారిటీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులను మార్చింది. ఇందులో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్, జౌళిశాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోస్ ఉన్నారు. భౌమిక్ను త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. ఆమె గెలిచారు. ఆమెను ముఖ్యమంత్రిని చేస్తారని భావించినా చివరి నిమిషంలో ఆ పదవి దక్కలేదు. దీంతో ఆమె కేంద్రంలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, దిల్లీల్లో భారీ మెజారిటీలు దక్కాయి. ఇందులో ఒక్క మధ్యప్రదేశ్లో మినహాయించి మిగిలిన 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ 100% సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడూ అదే పంథాను కొనసాగించేందుకు అభ్యర్థులను మార్చి పార్టీ కేడర్ను క్రియాశీలకంగా ఉంచే ప్రయత్నం చేసింది. ప్రజా జీవితంలో నిర్లక్ష్యంగా, అచేతనంగా ఉన్నవారిని, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మాటలు, చేతలతో పార్టీకి చెడ్డపేరు తెచ్చిన వారిని పక్కనబెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో 9 మంది సిట్టింగ్లను ఇంటికి పంపింది. ఇందులో ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహించిన వడోదరా ఎంపీ రంజనాబెన్ భట్ ఉన్నారు. ఆమెకు పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో స్థానం కల్పించినప్పటికీ తర్వాత ఆస్ట్రేలియాలో హోటళ్లు ఉన్నాయనే ఆరోపణలు చుట్టుముట్టడంతో పక్కనబెట్టింది. దిల్లీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సాహెబ్సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి మైనారిటీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారి అవకాశాలను దెబ్బతీసినట్లు చెబుతున్నారు. ఒక మతం చేసే వ్యాపారాలను బాయ్కాట్ చేయాలని ఒక బహిరంగ సభలో పర్వేష్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశాయి. అలాగే రమేష్ బిదూరి లోక్సభలో మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున యూపీ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ ఎంపీ డానిష్ అలీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సీటు కోల్పోయేలా చేశాయి. భోపాల్ ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకుర్ తొలగింపు వెనుకా ఇలాంటి కారణాలే ఉన్నాయి.
అసెంబ్లీకి వెళ్లడంతో కొంత మంది..
రాజస్థాన్కు చెందిన దియా కుమారి, రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్, బాబా బాలక్నాథ్, మధ్యప్రదేశ్ నుంచి ప్రహ్లాద్ పటేల్, రాకేష్ సింగ్ గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో వారిని లోక్సభ బరి నుంచి తప్పించారు. ఈసారి ఎన్నికల్లో భాజపాకు 370, ఎన్డీయే కూటమికి 400కిపైగా సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్న నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో కేవలం విజయావకాశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీలో అంతర్గత కలహాలు, ఒకరిని ఒకరు దెబ్బ తీసుకునేందుకు ప్రయత్నించడం, అనవరమైన వ్యాఖ్యలు చేసి పార్టీని వివాదాల్లోకి లాగిన వారిని నిర్మొహమాటంగా పక్కనబెడుతోంది. దీంతోపాటు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తోంది. 2019 ఎన్నికల్లో దేశంలో రెండో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన హరియాణాలోని కర్నాల్ ఎంపీ సంజయ్ భాటియాను పక్కనబెట్టి అక్కడ మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రంగంలోకి దింపింది. ఉత్తర కన్నడ లోక్సభ స్థానం నుంచి 6సార్లు గెలుపొంది, గత ఎన్నికల్లో కర్ణాటకలోనే అత్యధికంగా 4.79 లక్షల మెజారిటీతో గెలుపొందిన అనంత కుమార్ హెగ్డే.. తాము 400కిపైగా సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనను పక్కనబెట్టేలా చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్