Telangana Congress: ఎల్లా హోటల్‌ వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తల నినాదాలు

తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రకటించడంలో జాప్యం జరుగుతోందంటూ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ గేటు దగ్గర కొంతమంది యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు.

Updated : 05 Dec 2023 16:12 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రకటించడంలో జాప్యం జరుగుతోందంటూ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ గేటు దగ్గర కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ‘రేవంత్‌ రెడ్డి సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ రెడ్డి స్పష్టం చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ పరిశీలకుల వద్ద చెప్పినట్లు తెలిపారు. పార్టీ అంతర్గతంగా చర్చించే అంశాలు సున్నితమైనవి కావడంతో బహిర్గతం చేయలేకపోతున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని