బెంగాల్ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్పై రాళ్లు!
పశ్చిమబెంగాల్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్పై దాడి కలకలం రేపింది. అలీపుర్దువర్ జిల్లాలో జైగాన్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, నల్ల జెండాలతో నిరసన తెలిపినట్టు ..........
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్పై దాడి స్థానికంగా కలకలం రేపింది. అలీపుర్దువర్ జిల్లాలో జైగాన్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, నల్ల జెండాలతో నిరసన తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. గుర్ఖా జన్ముక్తి మోర్చ (జీజేఎం) కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అక్కడినుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో దిలీప్ ఘోష్ వాహనం పాక్షికంగా ధ్వంసమైనట్టు భాజపా వర్గాలు తెలిపాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అనంతరం దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించే తృణమూల్ కాంగ్రెస్, మిత్రపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఏదైమైనా ఇలాంటి ఎత్తుగడలు పనిచేయవని.. ప్రజలు తమవెంటే ఉన్నారన్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చాయ్పే చర్చా కార్యక్రమంలో పాల్గొని వేరే కార్యక్రమానికి వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. అయితే, దీనిపై ఆ జిల్లా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సౌరవ్ చక్రవర్తి స్పందించారు. నార్త్ బెంగాల్లో సమస్యలు సృష్టించేందుకు దిలీప్ ఘోస్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనతో తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
వరికి కాంగ్రెస్ ఇస్తామన్న బోనస్.. పెద్ద బోగస్ అని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. -
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
బాధితుల వేదన ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని వైకాపా ఆరోపిస్తోందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. -
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ అనంతరం ‘ఇండియా’ కూటమి ఓటమి ఖాయమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
కేంద్రంలో మూడోసారి భాజపా అధికారం సాధిస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా దీమా వ్యక్తంచేశారు. భారత్లో పీవోకే విలీనం ఖాయమని మరోసారి పేర్కొన్నారు. -
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
పల్నాడులో జరిగిన అల్లర్లను తానే సృష్టించినట్లు వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని లావు శ్రీకృష్ణదేవరాయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైకాపా నేతలు దాడి చేసిన ఘటనపై ఏపీ తెదేపా అధ్యక్షుడు ఈసీ, డీజీపీకి డీజీపీకి లేఖ రాశారు. -
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సీఎం సోదరుడుకి అనూహ్య పరిస్థితి ఎదురైంది. -
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
PM Modi: రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో తాను సంపాదించుకున్న విశ్వాసం ఫలితమే తనకు ‘బ్రాండ్ మోదీ’ అనే గుర్తింపునిచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. తానో కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. -
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేడీ ప్రభుత్వ విధానాలను ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఈసందర్భంగా పూరీ ఆలయ భాండాగారం ప్రస్తావన తెచ్చారు. -
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. -
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
Lok Sabha Elections: ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. -
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ప్రదేశ్లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బెంగాల్లో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్లను దుండగులు చెరిపి వేశారు. -
రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస
రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’