Redmi Note 11: రెడ్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు.. ధరెంతంటే?

రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెడ్‌మీ నోట్‌ 11 ప్రో, రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్‌ మోడల్స్‌ను భారత్‌ మార్కెట్లలో విడుదల చేసింది.

Updated : 17 Oct 2022 14:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెడ్‌మీ మొబైల్‌ శ్రేణిలో పాపులర్‌ సిరీస్‌ అయిన నోట్‌ సిరీస్‌లో కొత్త మోడల్స్‌ను తీసుకువచ్చింది. రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెడ్‌మీ నోట్‌ 11 ప్రో, రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్‌ మోడల్స్‌ను భారత్‌ మార్కెట్లలో విడుదల చేసింది. మరి ఈ ఫోన్లలో ఏయే ఫీచర్స్‌ ఉన్నాయి? ధరెంత? చూద్దాం..


రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్.. 

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 67 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయంతో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. వెనుకవైపు 108ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు అమర్చారు. సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 6జీబీ+128జీబీ స్టోరేజీ ఫోన్ల ధరను రూ.20,999గా, 8జీబీ+128జీబీ స్టోరేజీ వేరియంట్‌తో కలిగిన ఫోన్ల ధరను రూ.22,999గా నిర్ణయించారు. అలాగే 8జీబీ+256జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఫోన్ల ధరను రూ.24,999గా నిర్ణయించారు. మార్చి 15 నుంచి ఎంఐ డాట్ కామ్‌, అమెజాన్‌, రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.


రెడ్‌మీ నోట్‌ 11 ప్రో..

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో, ప్రో ప్లస్‌లో ఉన్న స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. 6జీబీ+128జీబీ స్టోరేజీ ఫోన్ల ధరను రూ.17,999గా, 8జీబీ+128జీబీ స్టోరేజీ వేరియంట్‌ ఫోన్ల ధర రూ.19,999గా నిర్ణయించారు. మార్చి 23 నుంచి ఎంఐ డాట్ కామ్‌, అమెజాన్‌, రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. 


రెడ్‌మీ వాచ్‌ 2 లైట్‌..

ఈ రెండు ఫోన్లతో పాటు రెడ్‌మీ వాచ్‌ 2 లైట్‌ పేరుతో స్మార్ట్‌ వాచీని విడుదల చేసింది. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇందులో 100 రకాల వర్క్‌అవుట్‌ మోడ్‌లు, 120 వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. మ్యూజిక్‌ కంట్రోల్‌, వెథర్‌, మెసేజ్‌, ఇన్‌కమింగ్‌ కాల్‌ నోటిఫికేషన్స్‌, స్లీప్‌, స్ట్రెస్‌ మానిటర్‌ ఇతరత్రా ఫీచర్స్ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని