Redmi: రెడ్‌మీ ట్రిపుల్‌ ధమాకా.. ఒకేసారి 11 సిరీస్‌ మొబైల్స్‌, స్మార్ట్‌ టీవీ, బ్యాండ్‌ విడుదల

చైనా టెక్ దిగ్గజం షావోమీ సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ తన కొత్త ఉత్పత్తులతో మళ్లీ వచ్చేసింది. ఈసారి మొత్తం మూడు ఉత్పత్తులను ఇండియాలో ఇవాళ లాంచ్‌ చేసింది.

Published : 10 Feb 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెడ్‌మీ తన కొత్త ఉత్పత్తులతో మళ్లీ వచ్చేసింది. ఈసారి మొత్తం మూడు ఉత్పత్తులను ఇండియాలో ఇవాళ లాంచ్‌ చేసింది. వీటిలో రెడ్‌మీ నోట్‌ 11 సిరీస్‌ మొబైల్స్‌తో పాటు మరో స్మార్ట్‌ బ్యాండ్‌, టీవీ కూడా ఉండటం విశేషం. మరి వీటి ఫీచర్ల ఏంటి? ధరెంత?అమ్మకాలు ఎప్పటినుంచి మొదలవుతాయో ఓ లుక్కెద్దాం.. రండి.. 

అంతటా నాలుగు.. మనకు రెండు

రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ను కంపెనీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అయితే, రెడ్‌మీ నోట్‌ 10కు కొనసాగింపుగా మొత్తం నాలుగు మోడల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా తీసుకురాగా, భారత్‌లో మాత్రం రెండు మోడల్స్‌తో 11 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్‌ 11 (Redmi Note 11), నోట్‌ 11 ఎస్‌ (Redmi Note 11S) పేరిట మన వద్దకు తీసుకొచ్చింది. ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌, కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా ఫిబ్రవరి 11 నుంచి నోట్‌ 11, ఫిబ్రవరి 21న నోట్‌ 11 ఎస్‌ మోడల్స్‌ అమ్మకాలు మొదలుకానున్నాయి. 


స్మార్ట్‌గా వచ్చేశాయ్‌..

అలాగే స్మార్ట్‌ బ్యాండ్‌ ప్రో పేరిట రెడ్‌మీ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఇది ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌కు అనుకూలంగా పనిచేస్తుంది. మ్యూజిక్‌తో పాటు కెమెరాను కూడా ఇది నియంత్రించగలదని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి 14 నుంచి అమెజాన్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇక రెడ్‌మీ స్మార్ట్‌టీవీ విషయానికొస్తే Redmi X43 Smart TV దీని లాంచ్‌ చేసింది. ఫిబ్రవరి 16 నుంచి టీవీ అమ్మకాలు జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని