CM KCR: యాసంగిలో కొనలేం
కేంద్రం చేతులెత్తేసి.. ధాన్యం తీసుకోవడానికి నిరాకరించినందున యాసంగిలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండబోవని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు వరి వేసి ఆగం కావద్దని స్పష్టం చేశారు. వారికి రైతుబంధు మాత్రం....
కేంద్రం ధాన్యం తీసుకోనని తేల్చిచెప్పింది..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుండవు
కేంద్రంలో ఉన్నది రైతు హంతక, రాబందు ప్రభుత్వం
750 మందిని పొట్టన పెట్టుకుంది
వరి వేసి రైతులు ఆగం కావద్దు
కిషన్రెడ్డి దద్దమ్మలా మాట్లాడారు
ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు - హైదరాబాద్
రైతుల ఉసురు పోసుకోవడానికి కేంద్రం కరెంటు చట్టం తెచ్చింది. బోర్లకు మీటర్లు పెట్టాలంటోంది. రైతు మెడపై కత్తి పెడతానంటోంది. లేకుంటే రాష్ట్రానికి వచ్చే హక్కులు, అధికారాలు కట్ చేస్తదట. కేంద్రమే విద్యుత్ మీద పెత్తనం చేస్తదట. అప్పుడు 24 గంటల కరెంటు వద్దంటరు. అందరిలాగానే 16 గంటలే ఇస్తమంటరు.. ఇది మనకు కుదురుతాదా? రైతులు, సామాన్యులకు రక్షణ ఉండాలంటే భాజపా ప్రభుత్వం పోవాలి
రైతుల తరఫున మంత్రులు, ఎంపీలు, సీఎస్ దిల్లీ వెళ్తే ‘మీకు వేరే పనిలేదా?’ అని కేంద్రమంత్రి (పీయూష్ గోయల్) అన్నారు. మంత్రులకు పనిలేక వెళ్తారా? ఇలాగేనా ఒక కేంద్రమంత్రి మాట్లాడేది? రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారా? తెలంగాణ రైతులను ముంచడానికే కేంద్రం చూస్తోంది. రేపు రైతు పంట పండిస్తాడు.. వీళ్లు తీసుకోరు.. అప్పుడు ఏం చేయాలి.
దేశాన్ని రావణకాష్టం చేయాలని చూస్తున్నది కేంద్రం. ప్రపంచ ఆకలి సూచీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ల కంటే వెనకపడ్డాం. దేశంలో అప్పులు పెంచింది భాజపా. రూ. 80 లక్షల కోట్ల అప్పులు చేసింది. పాత అప్పులు రూ. 50 లక్షల కోట్లు ఉన్నాయి.
- ముఖ్యమంత్రి కేసీఆర్
కేంద్రం చేతులెత్తేసి.. ధాన్యం తీసుకోవడానికి నిరాకరించినందున యాసంగిలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండబోవని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు వరి వేసి ఆగం కావద్దని స్పష్టం చేశారు. వారికి రైతుబంధు మాత్రం కొనసాగుతుందని చెప్పారు. వానాకాలం పంట ఎంతైనా కొంటామని, కేంద్రం తీసుకోకుంటే ఆ పంటను ప్రధాని, కిషన్రెడ్డి ఇళ్ల ముందు, భాజపా కార్యాలయాలు, ఇండియా గేట్ వద్ద పోస్తామన్నారు. కేంద్రంలో దుర్మార్గపు, రైతు వ్యతిరేక, హంతక, రాబందు ప్రభుత్వం ఉందని, 750 మంది రైతులను పొట్టన పెట్టుకొని, పూర్తిగా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఇంత దిగజారిన, నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని.. భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవడం లేదన్నారు. ధాన్యాన్ని సేకరించబోమంటూ కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరించిందని.. రైతాంగాన్ని గందరగోళపరుస్తోందని విరుచుకుపడ్డారు. దేశంలో రైతులు బాగుపడాలంటే భాజపాను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ధాన్యం కొనాలని ఒప్పించే ధైర్యం లేక ఇక్కడ అసత్యాలు చెబుతూ చేతగాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో బహిరంగ చర్చకు రావాలన్నారు. సోమవారం మంత్రిమండలి సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ప్రజలు ఆహారం లేక చస్తుంటే.. నిల్వలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. నిజంగా నిల్వలు అధికంగా ఉంటే ప్రజలకు వాటిని ఉచితంగా పంపిణీ చేయాలి’ అని సూచించారు.
దిక్కుమాలిన మాటలు
‘‘దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం.. సేకరించిన వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం.. దేశ ఆహార భద్రత కేంద్రం బాధ్యత. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. కానీ.. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. రైతుల ప్రయోజనాలను, వ్యవసాయాన్ని కేంద్రం ఆగం చేస్తోంది. ఇది మంచి చేసే ప్రభుత్వం కాదు. ముంచే ప్రభుత్వం. తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనబోమని చెప్పడం దుర్మార్గం. ఇది రైతు వ్యతిరేక పార్టీ. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో భాజపా కన్నా తెలంగాణ ప్రభుత్వం కోటి రెట్లు మెరుగు. ఎన్నో రైతు సంక్షేమ విధానాలు అమలు చేస్తున్నాం. మా చేతుల్లో ఎన్ని ఉన్నాయో అన్నీ రైతులకు అందజేస్తం. తెలంగాణ రైతు బీమా పథకం మరెక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రం అత్యధిక పంట పండిస్తున్నందున కేంద్రం ఓర్వడం లేదు. ధాన్యం కొంటారా.. కొనరా.. అంటే అది చెప్పకుండా భాజపా వాళ్లు ఏమేమో చెబుతున్నారు. మేం వడ్లు కొనం.. అయినా కల్లాల కాడ కొట్లాడుతాం అంటరు.. పనికిమాలిన చట్టాలు చేసేది. వాపసు తీసుకునేది భాజపాయే. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడతారు. భాజపా వాళ్లకు పాలించడం చేతకాదు. మీ చేతగానితనాన్ని రాష్ట్రంపై రుద్దుతారా? మేం భాజపాలాగా చిల్లర రాజకీయాలు చేయడంలేదు. తెలంగాణలో యాసంగిలో వాతావరణం వల్ల ఉప్పుడు బియ్యమే వస్తాయి. మామూలుగా వర్షాకాలంలో పండే బియ్యం 67 కిలోలు వస్తే.. యాసంగిలో పండే పంటకు బియ్యం 35 కిలోలే వస్తది. ఆ నష్టం ఎవరు భరించాలి? బాయిల్ చేసి అమ్మితే కరెక్ట్గా వస్తుంది. అందుకే పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వచ్చాయి. గత సంవత్సరం దాకా తీసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఒక గింజ కూడా తీసుకోం అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారు. ఇప్పుడు రైతులు ఏం చేయాలి? కేంద్రం చేతులెత్తేసింది.. గత యాసంగి ధాన్యమే పూర్తిగా తీసుకోలేదు. అప్పుడు రాష్ట్రం సేకరించిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పంటలసాగుపై సరైన నిర్ణయం తీసుకోవాలి. సొంత వినియోగానికి, విత్తన కంపెనీలతో ఒప్పందం ఏదైనా ఉంటే వరి సాగు చేసుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరి కొనుగోలు చేయదు.
ఉన్మాదిలా మాట్లాడుతున్న కిషన్రెడ్డి
కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉప్పుడు బియ్యం కొంటారా? కొనరా? చెప్పమంటే చెప్పరట. వర్షాకాలం ఎంత తీసుకుంటారో చెప్పమంటే చెప్పరట. ఈ ఉల్టాపల్టా మాట్లాడి మేం బియ్యం కొనమన్నమా? అని అంటున్నారు. చాతకాని దద్దమ్మ. అయామ్ వెరీ సారీ. ఆయన ఏం మాట్లాడుతున్నరు. ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నరు. మీకు దమ్ముంటే తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొనిపించాలి. తెలంగాణలో ఉప్పుడు బియ్యమే వస్తాయి. 35 డిగ్రీల్లో ఎండల్లో పండుతాది మా పంట.. మీ చేతగానితనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చారు. మీ ప్రధానే క్షమాపణలు చెప్పారు రైతాంగానికి. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న హంతకుల పార్టీ మీది.. మీరు మాట్లాడతారా? మీది రైతు రాబందుల పార్టీ.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. పక్కన మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు
మేం రైతుబంధువులం
మేం రైతుబంధువులం. కొత్త రాష్ట్రమైనా.. కేంద్రం సహకరించనప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. ఏపీ ఇబ్బంది పెట్టినా, కొందరు కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించాం. ప్రభుత్వ కృషి వల్లే తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందని చెప్పారు. గతంలో తెలంగాణ నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగింది. మా హయాంలో 69.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోంది. నాశనమైన చెరువులను బాగు చేశాం. ప్రాజెక్టులు కట్టాం. ఆయకట్టు స్థిరీకరణ చేశాం. పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఇవన్నీ కనపడలేదా? ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టు, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్సాగర్, దేవాదుల ఎవరు పూర్తి చేశారో అందరికీ తెలుసు. ఏడేళ్ల క్రితం మూడెకరాల రైతు పరిస్థితి ఏమిటి. ఈరోజు ఏమిటి? రాష్ట్రం వస్తే ధరలు పడిపోతాయి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు 20 లక్షల్లోపు భూములే దొరకడంలేదు. రోడ్డు ఉంటే ఎకరా రూ. 30, 40 50 లక్షలు, జాతీయ రహదారి వెంట రూ.3 కోట్ల ధర పలుకుతున్నాయి. అయిదెకరాలున్న తెలంగాణ రైతు కోటీశ్వరుడు.. ఏడేళ్ల క్రితం బిచ్చగాడు.. ఇప్పుడు తెలంగాణ రైతులు కాలర్ ఎగరేసి ప్రకాశం, కర్ణాటకలో భూములు కొంటున్నారు.
విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తాం
విద్యుత్ బిల్లుపై రైతాంగానికి ముప్పు ఉంది. బోర్ల వద్ద మీటర్లు పెట్టాలంటున్నారు. లేకపోతే నిధులివ్వబోమంటున్నారు. విద్యుత్పై పెత్తనం వస్తే ఉచిత విద్యుత్ను తీసేయమంటారు. ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తాం. మేం ఎస్సీ వర్గీకరణ బిల్లు పంపితే పెండింగ్లో పెట్టారు. యూపీ ఎన్నికల కోసం దళిత్ అంటున్నారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్లను పెంచాలన్నా వినడం లేదు. వీటన్నింటిపై పార్లమెంటులో అడుగడుక్కీ కేంద్రాన్ని నిలదీస్తాం.
రైతులకు రూ. 27.50 కోట్ల సాయం
రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు ఇస్తామన్నా.. రూ. 27.50 కోట్ల ఆర్థికసాయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. నేను, మంత్రులు వెళ్లి రైతు కుటుంబాలకు అందజేస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
దేశానికి ఏం ఒరగబెట్టారు?
ఏడేళ్లలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. బీసీలు, దళితులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఏం చేశారు? ఈ దేశానికి ఒరగబెట్టింది ఏమిటి? వీళ్లను నమ్మితే సర్వనాశనం అయిపోతారు. దేశంలో పెట్రో ధరలు పెంచిందెవరు? నరేంద్రమోదీ ప్రభుత్వం కాదా? క్రూడాయిల్ ధర అప్పుడెంత? ఇప్పుడెంత? ధర తగ్గినా అబద్ధాలు చెప్పి, దేశాన్ని మోసం చేసి డీజిల్ ధరలు పెంచుతున్నారు. పెంచిన తదుపరి రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని ధర్నాలు చేస్తారా? ఏమైనా సిగ్గుందా? ప్రజలు అమాయకులా? మీరేమో పెంచాలే.. మేం తగ్గియ్యాల్నా? ఇది నీతా? దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం చేసే గొప్పతనమా ఇది.. ఇదేం దందా. కచ్చితంగా వీరు ముంచేటోళ్లు తప్ప మంచి చేసేటోళ్లు కాదని తేలిపోయింది. మతపిచ్చితో విభజన రాజకీయాలు.. దేశాన్ని రావణకాష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఐటీ, పరిశ్రమలు వస్తున్నాయి. ఆర్థికంగా బలంగా తయారవుతోంది. ఇండియాటుడే రేటింగ్లో నంబర్ 1గా నిలిచింది.. మతాల మధ్య పంచాయితీ, మతకల్లోలాలు పెట్టి, కర్ఫ్యూ ఫైరింగ్లు పెడితే మంచిదా? భాజపాది అదే ధోరణి, దానిని ప్రజలు అంగీకరిస్తారా? విభజన పార్టీయా దేశానికి కావాల్సింది?
- ముఖ్యమంత్రి కేసీఆర్
సాగులో ఇంత సాధించాం
* తెలంగాణలో 2004 నుంచి 2013-14 వరకు సగటున వరి ధాన్యం సేకరణ 10.09 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా సగటున 69.38 లక్షల టన్నుల సేకరణ జరిగింది. 2020-21 సీజన్లో 141.08 లక్షల టన్నులను సేకరించాం.
* తెలంగాణలో 2004 నుంచి 2013-14 వరకు సగటున 37.47 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగయింది. రాష్ట్రం వచ్చాక గత ఏడేళ్ల కాలంలో సగటున 55.28 లక్షల ఎకరాల్లో వరి పండింది. 2020-21లో అత్యధికంగా 104.23 లక్షల ఎకరాల్లో వరి సాగయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!