హైదరాబాద్లో ఎన్కామ్
దేశంలోనే తొలి జాతీయ సంకలిత తయారీ కేంద్రం(నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎన్కామ్) హైదరాబాద్లో నెలకొల్పేందుకు....
దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు
సమగ్ర నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు
భాగస్వామిగా చేరనున్న ‘జాతీయ సంకలిత తయారీ సంఘం’
ఈనాడు, హైదరాబాద్: దేశంలోనే తొలి జాతీయ సంకలిత తయారీ కేంద్రం(నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎన్కామ్) హైదరాబాద్లో నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమమేధ, రోబోటిక్, యంత్ర పరిజ్ఞానం వంటి నవీన సాంకేతికతలతో త్రీడీ ప్రింటింగ్, కంప్యూటర్ ఆధారిత ఆకృతి(క్యాడ్), సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సాయంతో పరిశ్రమలకు అవసరమైన ప్రాజెక్టులు, పరికరాలు, విడిభాగాల నమూనాలను రూపొందించి అందించడం వంటి కార్యకలాపాలను ఇందులో నిర్వహించనున్నారు. వాటిపై పరిశోధనలు, అభివృద్ధి, అకృతుల తయారీలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు, నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ‘జాతీయ సంకలిత తయారీ సంఘాన్ని’ ఇందులో భాగస్వామిగా చేర్చాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్కామ్ కేంద్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇవి త్రీడీ తదితర నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భారీ పరిశ్రమలతోపాటు సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా యంత్ర పరికరాల నమూనాలు, పరికరాలు రూపొందించి ఇస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమల నవీకరణకూ ఊతమిస్తున్నాయి. భారత్లోనూ ఈ తరహా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జాతీయ సంకలిత తయారీ ముసాయిదా’ విధానాన్ని ప్రకటించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయస్థాయి కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. తొలి కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధమైన రాష్ట్రం ఒక్కటేకావడం, ఐటీ రంగంలో ఇప్పటికే గుర్తింపు ఉండటంతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఆమోదిస్తే మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరడంతోపాటు జాతీయస్థాయి సంస్థగా గుర్తింపు లభిస్తుంది. కేంద్రం ఆమోదించని పక్షంలో సొంతంగా దీనిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పరిశ్రమలతోపాటు వాహనాల తయారీ, వైమానిక, రక్షణ, ఆరోగ్య పరిరక్షణ, దుస్తుల తయారీ, నిర్మాణ, వినియోగవస్తు పరికరాల రంగాల అభ్యున్నతికి దీన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది.
ఇదీ ప్రణాళిక
* ప్రస్తుతం తెలంగాణలో టీహబ్, వీహబ్, టీవర్క్స్, జీఎస్ఐలీ, రిచ్ వంటి సంస్థల ద్వారా నవీన అంకుర ఆలోచనలు, ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అదే తరహాలో సంకలిత కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
* దీని ఏర్పాటులో వివిధ దేశాల్లో నడుస్తున్న కేంద్రాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
* పరిశ్రమలు, విద్యాసంస్థలను అనుసంధానం చేసి, ఇంజినీరింగ్ తదితర కోర్సుల విద్యార్థులకు ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. వినియోగదారుల అవసరాల మేరకు పరికరాల రూపకల్పన, మార్కెటింగ్పైనా పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
* ఇందులో భాగంగా తెలంగాణ ఐటీశాఖ నవీన సాంకేతికతల విభాగం ఈ నెల 6వతేదీన దృశ్యమాధ్యమ సదస్సు నిర్వహించి, దేశవ్యాప్తంగా ఈ రంగానికి చెందిన పరిశ్రమలు, అంకురాలు, విద్యావేత్తల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దాన్ని రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
ప్రపంచస్థాయి కేంద్రంగా మారుతుంది
- జయేశ్రంజన్, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శిప్రస్తుతం ఎన్కామ్లకు ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆవిష్కరణలు, పరిశోధన కేంద్రంగా దీన్ని ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతం ఈ రంగంలోని పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. హైదరాబాద్లో జాతీయ స్థాయి కేంద్రంతో పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలా మేలు జరుగుతుంది. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధిని, జాతీయ లక్ష్యాలను సాధిస్తుంది. దేశీయ మార్కెట్ అవసరాలను తీరుస్తుంది. ఎగుమతులకూ అవకాశం ఉంటుంది. భారీఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.