పంచాయతీలకు పక్కాగా నిధులు
కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు తలసరి గ్రాంటు కింద నాలుగు రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రూ.650లకుపైగా ఇస్తోంది. ప్రస్తుతం దేశం గర్వపడేలా తెలంగాణలోని సర్పంచులు ఉన్నారు.
సమన్యాయం కోసమే జీవో 60
అది సొమ్ము మళ్లింపు కోసం కాదు
ప్రశ్నోత్తరాలలో సీఎం స్పష్టీకరణ
కాంగ్రెస్ జమానాలో సర్పంచుల బాధలు అనేకమని వ్యాఖ్య
ఇప్పుడు సంతోషంగా ఉన్నారని వెల్లడి
‘‘కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు తలసరి గ్రాంటు కింద నాలుగు రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రూ.650లకుపైగా ఇస్తోంది. ప్రస్తుతం దేశం గర్వపడేలా తెలంగాణలోని సర్పంచులు ఉన్నారు.’’
ఈనాడు, హైదరాబాద్: పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ఖజానాకు రప్పించి అక్కడి నుంచి ఠంచనుగా నెలవారీగా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సెప్టెంబరు నిధులను కూడా విడుదల చేశామన్నారు. 60వ నంబరు జీవోను ఇచ్చామని.. అది నిధుల మళ్లింపు కోసం కాదన్నారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన సీనరేజ్ తదితర నిధులు ఇవ్వటం లేదని, నిధులను మళ్లిస్తున్నారని శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమాధానం చెబుతూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు పలు అంశాలను ప్రస్తావించటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘క్వారీలు, గ్రానైట్తోపాటు వివిధ రూపాల్లో పంచాయతీలకు నిధులు వస్తాయి. అవి అన్ని పంచాయతీలకూ రావు. పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండటంతో వాటికి ఆదాయం వస్తుంది. ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి అన్ని పంచాయతీల్లో అభివృద్ధిని ఆవిష్కరించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంతకుమునుపు వరకు పంచాయతీలు మురికి కూపాలుగా ఉన్నాయి. ప్రస్తుతం అవి అభివృద్ధితో ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి చేసిన చట్టానికి లోబడే ఉత్తర్వులు జారీ చేశాం. నిధుల మళ్లింపు అన్నది సత్యదూరం. అవాస్తవం.
అది వారి అవగాహనా రాహిత్యం
కేంద్రం నిధులు ఇవ్వటం అన్నది రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రావాల్సిందే. కేంద్ర దయాదాక్షిణ్యం కాదు. కొందరు సభ్యులు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎందుకు గొంతు నొక్కుతుంది? ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. మీ(కాంగ్రెస్) జమానాలో సర్పంచులు బాధపడిన మాట వాస్తవం. మీ హయాంలో చెల్లించాల్సిన కరెంటు బిల్లులు ఇంకా రూ.రెండు వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు సైతం రాష్ట్ర విధానాలను ప్రశంసిస్తున్నారు. కరోనా సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపైనా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని అధికారులకు స్పష్టం చేశాను. గ్రామాల్లో ప్రజలు మరణిస్తే అంత్యక్రియలు చేసేందుకు మీ ప్రభుత్వ హయాంలో స్థలం కూడా చూపించలేకపోయారు. మా ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసింది. రండి.. రేపే వెళదాం. అన్ని పార్టీల వారితో సభా కమిటీని వేద్దాం. ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే చూద్దాం. సర్పంచులు ఆగమయ్యారని చెబుతున్నారు. ఎక్కడో చెప్పండి. అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతిపై సభలో సుదీర్ఘంగా చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను సీఎం కోరారు.
అది చట్టంలో లేదు
‘‘ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు ఇస్తామని మా పార్టీ ఎక్కడా చెప్పలేదు. అసలు అది నూతన పంచాయతీరాజ్ చట్టంలో లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వమే తెచ్చింది. కానీ పంచాయతీల్లో సర్పంచులను కాదని కాంగ్రెస్ నాడు సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం దాన్ని పూర్తిగా తీసేసింది. సర్పంచులకు సర్వ స్వేచ్ఛ ఇచ్చింది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
ఎందుకంత ఉలికిపాటు?
‘బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రానైట్, క్వారీలు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో పంచాయతీలకు రావాల్సిన వాటాను ఇవ్వకపోవటంతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. సభ్యుల నుంచి అభ్యంతరం వ్యక్తమైతే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు.పంచాయతీల నిధులను మళ్లించటం ద్వారా ప్రభుత్వం ఆ నిధులపై పెత్తనం చెలాయిస్తోందని శ్రీధర్ బాబు మాట్లాడారు.
ఏకగ్రీవ పంచాయతీలకు నిధులేవి?: భట్టి విక్రమార్క
‘ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇస్తామని ప్రకటించారు. ఇంత వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. రూ.193 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సిబ్బంది కొరత కూడా ఉంది. నిధుల మళ్లింపు సరికాదు. ఉపాధి హామీ కింద కేంద్రం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్రం పంచాయతీలకు ఇవ్వటం లేదు. సీతక్క వినియోగించిన భాష బాగోలేదని స్పీకర్ అన్నారు. పార్లమెంటరీ భాషనే ఆమె వినియోగించారు. స్పీకర్ అలా అనటం బాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
-
క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్
-
నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు