ఒప్పందం ప్రకారమే బియ్యం తీసుకుంటాం
ధాన్యం కొనుగోళ్లు సహా అనేక విషయాల్లో లేని తప్పుల్ని భాజపాపై రుద్ది తెరాస ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం కేంద్రం పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం కొంటుందని
ఉచిత విద్య, వైద్యంపై తొలిసంతకం: బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు సహా అనేక విషయాల్లో లేని తప్పుల్ని భాజపాపై రుద్ది తెరాస ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం కేంద్రం పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం కొంటుందని స్పష్టంచేశారు.కేంద్రం కొత్త నిబంధనలేం తేలేదని వెల్లడించారు. ఈ సంవత్సరం ఉప్పుడుబియ్యం ఇవ్వబోమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. హుజూరాబాద్ ఓటమి నుంచి దృష్టి మళ్లించడానికి మాటమార్చిందని ఆరోపించారు. ‘‘అగ్గి పెడతానంటూ దిల్లీ వెళ్లిన సీఎం ఏం చేశారు? యుద్ధం చేయాల్సింది పాకిస్థాన్ వంటి శత్రుదేశాలపై.. కేంద్రంపై చేస్తారా?’’ అని కిషన్రెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో శనివారం ఆయన ముగింపు ప్రసంగం చేశారు.
సీఎం ధర్నా రైతుల కోసం కాదు..
‘‘లేని సమస్యను సృష్టించి సీఎం ధర్నా చేశారు. కొడుకు సీఎం అవుతారో లేదోననే భయంతో కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ధర్నాచౌక్కు వచ్చారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం 2014లో రూ.3,600 కోట్లు ఖర్చు పెట్టింది. 2021లో రూ.26,600 కోట్లు వెచ్చించింది. చివరిగింజ వరకూ కొంటామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయి? కేంద్రం రైల్వేలు, ఎల్ఐసీని అమ్మేస్తుందని కేసీఆర్ అంటున్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న హామీని కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోలేదు? హుజూరాబాద్ ఎన్నిక అయిపోగానే దళితబంధును మరచిపోయారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రమాదకరం. దళిత సీఎంపై మాటతప్పి.. రాష్ట్రం ఆగమైపోవద్దనే అలా చేయలేదంటూ దళితుల్ని అవమానిస్తున్నారు. వారికి పరిపాలించే శక్తి లేదా?’’ అని కిషన్రెడ్డి అన్నారు.
సొంత పనులపైనే కేసీఆర్ దిల్లీకి
అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ‘కేసీఆర్ పతనం ప్రారంభమైంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఎన్నికలు ముందుగా వచ్చినా, 2023లో వచ్చినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే. వేదికపై ఉన్న మాలో ఎవరు ముఖ్యమంత్రి అయినా పేదలకు ఉచిత విద్య, వైద్యంపై తొలి సంతకం పెట్టించే బాధ్యత నాది’ అని అన్నారు. సీఎం దిల్లీకి వెళ్లి వచ్చింది సొంతపనుల కోసమేనని.. భాజపాను అప్రతిష్ఠపాలు చేసేందుకు, కేంద్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ సెంటిమెంట్ను రాజేసేందుకు యత్నించారని విమర్శించారు. ‘గడీల పాలననుంచి విముక్తికి ఉద్యమించే బాధ్యత నాది. త్యాగాలకు రక్తాన్ని ధారపోసేందుకు సిద్ధమా?’ అని కార్యకర్తల్ని ప్రశ్నించారు. ‘సీఎం కుర్చీ కోసం ప్రగతిభవన్లో కొట్లాట మొదలైంది’ అని అన్నారు.
హిందువులను ఒక్కటి చేస్తాం
తెలంగాణలో 80 శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే తెరాస, మజ్లిస్ కుట్రలు పటాపంచలై రాజ్యాధికారం పొందగలం. వచ్చే ఎన్నికల్లో హిందువుల్ని ఒక్కటి చేస్తాం. డిసెంబరు 17-20 మధ్య రెండోవిడత పాదయాత్ర ప్రారంభిస్తా’ అని సంజయ్ తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్ను ఈ సందర్భంగా సన్మానించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాశ్, నేతలు కె.లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి విజయశాంతి, సంకినేని వెంకటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యవర్గం తీర్మానాలు
* ఏడున్నరేళ్ల తెరాస పాలనలో రాష్ట్రం అన్నిరకాలుగా నష్టపోయింది. అవినీతి రాజ్యమేలుతోంది. దుబారా ఖర్చులు తగ్గించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. భూమి, ఇసుక, మైనింగ్, మద్యం, మాదక ద్రవ్యాల మాఫియాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
* వర్షానికి తడిసిన వడ్లను కొనాలి. 60 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి.
* దళితబంధురాష్ట్రమంతా అమలుచేయాలి. దళితుల కోసం రూ.60వేల కోట్ల టిప్రైడ్ నిధుల్ని వాడాలి.
* ధరణి వెబ్సైట్ లోపాల్ని సరిదిద్ది రైతులకు న్యాయంచేయాలి.
* ఖాళీ పోస్టులను భర్తీచేయాలి. ఒక్కో నిరుద్యోగికి 35 నెలల నిరుద్యోగభృతి రూ. 1,05,560 ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి