వ్యవసాయ డిగ్రీ సీట్ల పెంపు
వ్యవసాయ కోర్సులకున్న భారీ డిమాండుతో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పందించింది. ఏటా వరసగా సీట్లు పెంచాలని తాజాగా నిర్ణయించింది. గతేడాది (2020-21) 710 వ్యవసాయ డిగ్రీ (ఏజీ బీఎస్సీ)
జయశంకర్ వర్సిటీ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయ కోర్సులకున్న భారీ డిమాండుతో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పందించింది. ఏటా వరసగా సీట్లు పెంచాలని తాజాగా నిర్ణయించింది. గతేడాది (2020-21) 710 వ్యవసాయ డిగ్రీ (ఏజీ బీఎస్సీ) సీట్లుండగా ఈ ఏడాది 760కి, 2022-23లో 995కి పెంచబోతోంది. ఈ వర్సిటీ తరపున రాష్ట్రంలో ఐదుచోట్ల వ్యవసాయ కాలేజీలున్నాయి. వీటిలో ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా పాలెం, వరంగల్, సిరిసిల్ల కాలేజీల్లో 72 చొప్పునే సీట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది పాలెం, సిరిసిల్లలో 100కి, వరంగల్లో 75కి సీట్లు పెరగనున్నాయి. అత్యధికంగా రాజేంద్రనగర్ కాలేజీలో 320 ఉంటాయి. జగిత్యాల, అశ్వారావుపేటల్లో 200కి పెంచబోతున్నారు.
ఉద్యోగం పక్కా అనే ప్రచారంతో..
రాష్ట్రంలో 3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటైన తరవాత వాటిలో వ్యవసాయ డిగ్రీ కోర్సులు ప్రారంభించారు. కానీ అవి జయశంకర్ వర్సిటీకి అనుబంధం కావు. ఇతరత్రా ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు అనుమతి లేదు. వ్యవసాయ డిగ్రీ చదివితే ఉద్యోగం గ్యారంటీ అనే ప్రచారం ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కాలేజీల్లో ఈ డిగ్రీలో చేరేందుకు లక్షల రూపాయల డొనేషన్లు కట్టి తెలుగు విద్యార్థులు చేరుతున్నారు. తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు లేకపోవడం, జయశంకర్ వర్సిటీలో ఇంతకాలం 710 సీట్లు మాత్రమే ఉండటం వల్ల తీవ్రమైన పోటీ ఉంది. కాలేజీలు, సీట్ల సంఖ్య ఇంకా పెంచాలని ఎప్పటినుంచో డిమాండు ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీల్లోనూ చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. కానీ 3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో నిర్వహిస్తున్న ఏజీ బీఎస్సీ కోర్సులకు ఇంతవరకూ ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గుర్తింపు రాలేదు. జయశంకర్ వర్సిటీ కోర్సులకు మాత్రమే ఉంది. గుర్తింపు ఉన్న డిగ్రీ చదివిన వారికే జయశంకర్ వర్సిటీలో పీజీ, పీహెచ్డీ సీట్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేసే వ్యవసాయాధికారి పోస్టులకు సైతం వారినే ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయశంకర్ వర్సిటీ నిర్వహిస్తున్న ఏజీ బీఎస్సీ కోర్సులకే అధిక డిమాండు ఉన్నందునే సీట్లు పెంచుతున్నట్లు వర్సిటీ వీసీ వి.ప్రవీణ్రావు ‘ఈనాడు’కు చెప్పారు.
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ తరవాతే..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్లో ర్యాంకుల ఆధారంగా ఏజీ బీఎస్సీ సీట్లను జయశంకర్ వర్సిటీ భర్తీ చేస్తుంది. కానీ జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ ఆధారంగా ఎంబీబీఎస్, దంత వైద్య కోర్సులకు కౌన్సెలింగ్ ఇంకా జరగలేదు. అది పూర్తయిన తరవాతే ఏజీ బీఎస్సీ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్ను జయశంకర్ వర్సిటీ నిర్వహిస్తుంది. వచ్చేనెల మొదటివారంలో ఇది జరిగే అవకాశాలున్నాయని ప్రవీణ్రావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?