Telangana Rains: కుండపోత వాన
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమురం భీం జిల్లా బెజ్జూరులో 20 సెం.మీ. వర్షం కురిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
పొంగిపొర్లిన వాగులు
రహదారులు జలమయం
హైదరాబాద్లో 24 గంటల్లో 18.8, బెజ్జూరులో అత్యధికంగా 20 సెం.మీ. వర్షపాతం నమోదు
గోదావరి పరవళ్లు.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
నేడు విద్యాసంస్థలకు సెలవు
జీహెచ్ఎంసీ పరిధిలో నేడు, రేపు కార్యాలయాలకు, బడులకూ..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
టీఎస్పీఎస్సీ సహా పలు పరీక్షల వాయిదా
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే యంత్రాంగం: రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమురం భీం జిల్లా బెజ్జూరులో 20 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాలు, మండలాల్లో భారీగా వాన పడింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. హైదరాబాద్లో రహదారులు చెరువులను తలపించాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ప్రస్తుత వర్షాకాల సీజన్లో అత్యధికంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 34.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కుమురం భీం, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, మహబూబాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఇందల్వాయిలో అత్యధికంగా 105.6 మి.మీ వర్షం పడింది.
నిలిచిన రాకపోకలు
భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లడంతో పాటు పలుచోట్ల రోడ్లు తెగడం, కోత పడడం, ధ్వంసం కావడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణంలోకి నీరు చేరింది. అక్కడ గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. గోదావరి కరకట్టపై రాకపోకలను పోలీసులు నిషేధించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిన్న గంగారం వద్ద పాలెం వాగుకు గండిపడింది. మండలంలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. అంతర్రాష్ట్ర రహదారి వరదనీటితో నిండిపోవడంతో ఛత్తీస్గఢ్-తెలంగాణ మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామస్థులను చెల్పాక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. జనగామ నుంచి సిద్దిపేట మార్గంలో బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్నగర్ వద్ద కల్వర్టు తెగిపోయింది. దేవాదుల బొమ్మకూరు జలాశయం కుడికాల్వకు వెంకిర్యాల సమీపంలో పలుచోట్ల గండ్లు పడ్డాయి. జనగామ జిల్లాలో ఆకేరు వాగు, సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మొయతుమ్మెద వాగు, మహబూబాబాద్ జిల్లాలోని పాకాలేరు, మద్దెలవాగు, దొరవారి తిమ్మాపురం, మొట్ల తిమ్మాపురం వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ శివారులో నల్లవాగు కాల్వ వద్ద తాత్కాలిక రోడ్డు వరదకు కొట్టుకుపోయింది.
వచ్చే మూడు రోజులూ జోరు వానలు
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు.., ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాజధానిలో 24 గంటల్లో 18.8 సెం.మీ
హైదరాబాద్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏమాత్రం తెరపినివ్వలేదు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్లో సగటున 18.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో గురువారం సగటున 10 సెం.మీ. వర్షం కురిసినట్లు అధికారులు అంచనా వేశారు. మియాపూర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 9.9 సెంటీమీటర్లు కురిసింది.
జోలెలో వాగు దాటించి.. వైద్యం అందించి
వెంకటాపురం, న్యూస్టుడే: అస్వస్థతతో బాధపడుతున్న గిరిజనుల వైద్య సేవలకు వరదలు ఆటంకం కలిగిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలోని సీతారాంపురానికి చెందిన కుర్సం ముత్తయ్య, కుర్సం సిద్ధు జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలోని పూసువాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సిద్ధును కుటుంబసభ్యులు, గ్రామస్థులు అతన్ని జెడ్డీ(జోలె)లో మోస్తూ దాటించారు. మరో 5 కి.మీ కాలినడకన ప్రయాణించి ఆలుబాకకు చేర్చారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. డెంగీ అనుమానంతో అతడిని ములుగు ప్రాంతీయ ఆసుపత్రికి వైద్యులు పంపించారు. సీతారాంపురానికి చెందిన కుర్సం బాబూరావు(37) జ్వరం, అనారోగ్య సమస్యలతో గురువారం మృతి చెందారని, గ్రామంలో పలువురు అస్వస్థతతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు.
నేలకూలిన 345 స్తంభాలు
కరెంటు సరఫరా ఆగకుండా డిస్కంల ఏర్పాట్లు
ఈనాడు, హైదరాబాద్: భారీ వర్షాలతో కరెంటు సరఫరా నిలిచిపోకుండా డిస్కంలు ఏర్పాట్లు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పెనుగాలులు, వర్షాలకు 345 కరెంటు స్తంభాలు నేలకూలగా వాటిని మార్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. కరెంటు సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించడానికి అందుబాటులో ఉండాలని విద్యుత్ ఇంజినీర్లకు సెలవులను రద్దు చేసినట్లు దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి గురువారం తెలిపారు. ఇతరశాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాలరావు, రఘుమారెడ్డి అన్ని జిల్లాల ఇంజినీర్లకు ఆదేశించారు.
స్తంభాలు, వైర్లను తాకవద్దు
వర్షపు నీటిలో ఉన్న కరెంటు స్తంభాలు, వైర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దని ప్రజలకు సీఎండీలు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమైన వెంటనే ఆ సమాచారాన్ని కరెంటు కార్యాలయాలకు తెలియజేస్తే.. సరఫరా నిలిపివేస్తామని రఘుమారెడ్డి వివరించారు. ప్రతి సర్కిల్ పరిధిలో కంట్రోల్ రూములు ఏర్పాటుచేయాలని ఆదేశించినట్లు సీఎండీలు తెలిపారు. ఉత్తర డిస్కం పరిధిలో కరెంటు సమస్యలపై ఫిర్యాదు చేయడానికి 18004250028 , 1912 నంబర్లకు ఫోన్ చేయాలని గోపాలరావు పేర్కొన్నారు. దక్షిణ డిస్కం పరిధిలో ఫిర్యాదులు చేయడానికి 1912, 7382071574, 7382072106, 7382072104 నంబర్లకు ఫోన్ చేయాలని రఘుమారెడ్డి తెలిపారు. మరోవైపు విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత