పాలమూరుకు పర్యావరణ అనుమతులు
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి లభించింది. పథకం నిర్మాణపనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల (రెండో దశ: సాగునీరు) నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది.
పర్యావరణానికి రూ.153.70 కోట్ల నష్టం
ఆ మొత్తాన్ని పీసీబీ వద్ద జమ చేయాలని ఈఏసీ షరతు
సాగునీటి నిర్మాణ పనులకు లైన్ క్లియర్
ఈనాడు, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి లభించింది. పథకం నిర్మాణపనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల (రెండో దశ: సాగునీరు) నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ అనుమతుల కమిటీ (ఈఏసీ) గత నెల 24వ తేదీన నిర్వహించిన 49వ సమావేశం మినిట్స్ను గురువారం విడుదల చేసింది. ఈ ఎత్తిపోతల పనుల్లో పర్యావరణపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని.. దానికి సంబంధించి ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అథారిటీని ఈఏసీ ఆదేశించింది. ఆయా చర్యలను నిర్దేశిస్తూ.. ఆమోదం తెలిపింది.
ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2016లో ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం చేపట్టింది. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి రోజుకు 1.5 టీఎంసీ చొప్పున అరవై రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేందుకు ఈ పనులు ప్రారంభించింది. 4 లిఫ్టులు, అయిదు జలాశయాలు ఉన్నాయి. నార్లాపూర్ జలాశయం 89.44 శాతం, ఏదుల 90, వట్టెం 70, కరివెన 60, ఉదండాపూర్ జలాశయం 48 శాతం పనులు పూర్తయ్యాయి. వివిధ దశల్లో పనులు పూర్తయినట్లు 31.10.2021 నాటికి ఈఏసీ నిర్వహించిన అధ్యయన నివేదిక పేర్కొంటోంది.
మినిట్స్లో పేర్కొన్న షరతులు ఇవే..
- పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం సందర్భంగా దెబ్బతిన్న పర్యావరణ సమతౌల్యం, సామాజిక పరిస్థితులను సరిచేసేందుకు రూ.153.70 కోట్లు కేటాయించాలి. రానున్న మూడేళ్ల కాలంలో దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళిక ద్వారా నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు చేపట్టాలి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రణాళిక ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అయిదేళ్ల కాలానికి రూ.153.70 కోట్లకు పీసీబీకి బ్యాంకు గ్యారంటీ చూపాలి.
- జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గతంలో చేసిన సూచనలను అమలు చేయాలి.
- రాష్ట్ర అటవీశాఖ, స్థానిక పంచాయతీల నేతృత్వంలో ప్రతిపాదిత జలాశయాల పరిధిలో 500 మీటర్ల వెడల్పుతో పచ్చదనం (గ్రీన్ కవర్) పెంచాలి. గతంలో ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలనే పెంచాలి. వాటర్షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. జీవవైవిధ్య, వన్యప్రాణి సంరక్షణ చర్యలు తీసుకోవాలి.
- ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలి. శుద్ధి చేసిన నీటిని అందించాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించాలి.
- ప్రాజెక్టు ప్రారంభమైన అయిదేళ్ల తరువాత పర్యావరణంపై ప్రాజెక్టు ప్రభావం ఎలా ఉందనే అధ్యయనం జరగాలి. పది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల వారికి గోబర్ గ్యాస్, సౌరశక్తి పలకలు అందించాలి.
- ముంపు బాధిత కుటుంబాలకు (పీఏఎఫ్ఎస్) ఉద్యోగ శిక్షణకు సంస్థాగతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
పాలమూరు పాదాలు కడిగే రోజు ఆసన్నమైంది
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడం సంతోషకరం. కృష్ణమ్మ నీటితో పాలమూరు పాదాలు కడిగే రోజు ఆసన్నమైంది. ఎన్నో కేసులు, అడ్డంకులను ఎదుర్కొని, అకుంఠిత దీక్షతో ఈ అనుమతులను సాధించాం. ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయం. ఇందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులకు అభినందనలు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ పథకం తొలిదశ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఇక రెండోదశ పనులూ వేగంగా కొనసాగుతాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్
మధుర ఘట్టం: హరీశ్రావు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వమైన ఆనందాన్నిస్తోందని.. ఇది మాటల్లో వర్ణించలేని మధురఘట్టమని వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన మరో చారిత్రక విజయం’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు